Monday, October 25

మన ఋణ వ్యవస్థ - 10

"సూక్ష్మ" ఋణాలు - 10


"ఆరంభింపరు......" అనే సుభాషితాన్ని మననం చేసుకొని, ఈ వ్యాస పరంపరని ముగిద్దామనే నిర్ణయానికొచ్చాను. (నాకేదో విఘ్నాలొచ్చాయని కాదు--ప్రారంభించినదాన్ని పూర్తి చెయ్యలి కదా అని.)

రెండు మూడు విషయాలు వ్రాసి ముగిస్తాను.

"ఇండియాలో జనాలు యెక్కువ తినేస్తున్నారు--అందుకే........" అని ఒబామా అన్నాడంటే, వాడిని తిట్టిపోశాము.

రాశ్శేఖర్రెడ్డి, "దొడ్డు బియ్యం సన్న బియ్యం కన్నా ఆరోగ్యానికి మంచివి, సన్న బియ్యం రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి, అందరూ దొడ్డు బియ్యమే తినండి" అంటే, వాణ్ని కూడా వదలలేదు.

ఇప్పుడు అహ్లువాలియా "జనాలదగ్గర యెక్కువ డబ్బు వుంటే, ప్రతిరోజూ కూరగాయలు కొంటారు, పాలూ, పాల వుత్పత్తులూ యెక్కువగా వినియోగిస్తారు--అందుకే ఆహర ద్రవ్యోల్బణం 16.37 శాతానికి పెరిగింది--ఇప్పుడు కొంచెం తగ్గింది" అంటున్నాడు.

"గత మూడు నెలలుగా రేషన్ బియ్యం అందరూ తీసుకొంటున్నారు (అంతకు ముందు డీలర్లకే వదిలేసేవారట); మార్కెట్ లో సన్న బియ్యం సరఫరా బాగుండడంతో రేట్లు పెరక్కుండా వున్నాయి, పైగా తగ్గుతున్నాయి" అంటూ ప్రభుత్వాధికారులూ, పత్రికలూ అంటున్నారు!

--అంటే, యేమి జరుగుతోందో చిన్నపిల్లవాణ్ని అడిగినా చెపుతాడు! అవునా?

మన రిజర్వ్ బ్యాంక్ యేర్పడ్డాకా, స్వతంత్రం వచ్చాకా, అనేకమంది దిగ్దంతులు గవర్నర్లు గా పని చేశారు--ఎల్ కే ఝా నుంచీ, మన్మోహన్ సింగ్ నుంచీ, బిమల్ జలాన్ ల వరకూ! కానీ ఇప్పుడు వున్నంత దుస్థితిలో ఇంతకు ముందు లేదు--క్రమ క్రమంగా నెట్టివెయ్యబడింది! (పాపం వేణుగోపాల రెడ్డీ, దువ్వూరి సుబ్బారావు ల తప్పేమీ లేదండి!--పాపం అంతా సో కాల్డ్ "అధిష్టానాలదే"--యెక్కువగా కాంగీల!)

లేకపోతే, ఆర్బీఐ కి "లీజింగ్ & ఫైనాన్స్" సంస్థలమీదా, "ఎన్ బీ ఎఫ్ సీ" ల మీదా, "బ్యాంకుల" మీదా, వడ్డీ రేట్ల మీదా, రెపో, రివర్స్ రెపో, రేట్లమీదా, ఎస్ ఎల్ ఆర్, సీ ఆర్ ఆర్ లమీదా, దేనిమీదా కంట్రోలు లేదు!

ఇక, అవసరం లేకపోయినా, తమతోటివాళ్లతో అప్పులు తీసుకున్న స్వ స సం సభ్యులు, ఆ డబ్బులతో బంగారాలు కొనేశారనుకున్నాం కదా. మరి ఆ బంగారాలు యేమయ్యాయి? ఆత్మహత్యలెందుకు? అంటే, వాటిని సూ ఋ సం ల అప్పులు తీర్చడానికి, ముథూట్ ఫైనాన్స్, మణప్పురం గోల్డ్ లలో తనఖా పెట్టారు!

(నేను అడపాదడపా ఈ సంస్థల గురించి హెచ్చరిస్తూనే వున్నాను! మన దేశం లో కాంగ్రెస్ కూడా పుట్టక ముందు నించీ ఇవి "బిజినెస్" చేస్తున్నామని చెప్పుకొంటున్నాయి! యేం బిజినెస్ అని నన్నడక్కండి--యెందుకంటే మన రిజర్వ్ బ్యాంకు తో సహా మనమెవరూ పుట్టలేదు అప్పటికి! మరి ఇప్పుడు, గత రెండేళ్లుగా--పత్రికల్లో మొదటి పేజీలలో ఓ మూల చిన్న ప్రకటన వేసే స్థాయి నుంచి ఇప్పుడు సినీ యాక్టర్లతో ఓ పావుపేజీ ప్రకటనలు ఇచ్చే, టీవీల్లో వార్తలు కూడా "స్పాన్సర్" చేసే స్థాయికి యెలా యెదిగాయో, అనేక బ్రాంచీలని యెలా యేర్పాటు చేసుకొని, వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకున్నాయో--యెవరికీ తెలియదు, యెవరూ పట్టించుకో లేదు!)

ఇక మన రా నా లు మాత్రం గత ఆరేళ్లు గా సామాన్య జనాన్ని--

"దొరికిన చోట్లల్లా అప్పులు చెయ్యండి, కట్టలేము అని చేతులెత్తెయ్యండి--తరవాత ప్రయోగించడానికి 'మాఫీ అస్త్రం' మేము సిధ్ధం చేస్తాం"!

--అని జనాలని రెచ్చగొట్టడం లో కృతకృత్యులయ్యారు! ఇక ఈ వాగ్దానాలు వోట్లు గా మారతాయో లేదో--కాలమే నిర్ణయించాలి! 

సర్వే జనాస్సుఖినో భవంతు!

No comments: