Sunday, February 28

చరిత్ర

వ్యాఖ్యానాలు


వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు.

నా టపాలో వుదహరింపబడిన 1946 లో జరిగిన అసెంబ్లీ యెన్నికలు మనకి స్వాతంత్ర్యం రాకముందు, ఆంధ్ర ప్రదేశ్ యేర్పడకముందు, అప్పటి (ఉమ్మడి) మదరాసు రాష్ట్రానికి జరిగినవి.

మనదేశం లో 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' ఆక్టు ప్రవేశపెట్టబడినప్పటినించీ, రాష్ట్రాలకి ప్రతి 5 యేళ్ళకోసారి తప్పకుండా యెన్నికలు జరిగేవి. 

నేను చెప్పానని బాధపడకుండా, మీరు చదివిన స్వాతంత్రోద్యమ చరిత్రనీ, గాంధీ, నెహ్రూ, పటేల్, టంగుటూరి, తెన్నేటి మొదలైన వారి జీవిత చరిత్రలూ గుర్తు చేసుకోండి!

చదవని వాళ్ళు చదవడానికి ప్రయత్నించండి!


డియర్ oremuna!

గాంధీకి అంతనమ్మకంగా చెప్పినవాళ్ళెవరో కూడా మీకు తెలిసేవుంటుందంట! మరి చెప్పరూ?

అదెంత నిజమో అదికూడా చెప్పరూ?

(నా ఈ బ్లాగులో యెందుకో నా కామెంట్లు ప్రకటించబడడం లేదు. అందుకనే ఇలా వేరే టపా గా వ్రాస్తున్నాను. అన్యథా భావించవద్దు. యెవరికైనా కారణం తెలిస్తే, చెపితే సంతోషిస్తాను!)

Saturday, February 27

కాంగ్రెస్

అధిష్ఠానం

మహాత్మా గాంధీ నించి, ఇందిరా పందీ సారీ ఇందిరా గాంధీ వరకూ (ఎమర్జన్సీ విధించాక ఆవిడని అలా అనేవాళ్ళం), సోనియా గాంధీ నించి రాబోయే రాహుల్ వరకూ--తెలుగువాళ్ళ పట్ల వాళ్ళ దృక్పథం--మారలేదు, మారదు, మారబోదు!

"1946 లో జరిగిన అసెంబ్లీ యెన్నికల్లో శ్రీ (తెన్నేటి) విశ్వనాధం విశాఖపట్నం నుంచి అఖండ విజయం సాధించారు.

ఆ సమయం లో ఆంధ్ర ప్రతినిధులు నలుగురు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు చెయిర్మన్ సర్దార్ పటేల్ ను కలుసుకోనడానికి వెళ్ళారు. వీరు (టంగుటూరి) ప్రకాశం గారికి వ్యతిరేకం గా ఢిల్లీలో ప్రచారం చేయడానికి వెళ్ళారన్న విషయం స్పష్టమౌతున్నది.

ఆప్పుడు తెన్నేటి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన ఇలా వుంది:

'ఈ నలుగురు ఆంధ్రులు సర్దార్ పటేల్ వద్దకు వ్యక్తిగతం గా వెళ్ళి వుండాలి (రాష్ట్ర పార్టీ అనుమతి తో కాదు). ఆంధ్ర ప్రాంత సభ్యులకు వారెంతమాత్రమూ ప్రతినిధులు కానేకారు. చెన్న రాష్ట్ర శాసన సభ్యులకు స్వేఛ్ఛగా తమ నాయకుని యెన్నుకునే హక్కున్నది. పరోక్షం గా కాని, అపరోక్షం గా కాని యెవరైనా వారిని నిర్బంధిస్తే, వారి హక్కులకు భంగం కలుగుతుంది.'

ఈ ప్రకటనను 'ఆంధ్ర కేసరికి ' తెలియకుండానే తెన్నేటి చేశారు.

ఆయన వుద్దేశ్యం--మద్రాసు ముఖ్యమంత్రి యెన్నికలలో కాంగ్రెస్ అధిష్టానవర్గం ప్రమేయం వుండరాదని, శాసన సభ్యులే స్వేఛ్ఛగా తమ నాయకుని (ముఖ్యమంత్రిని) యెన్నుకోవాలని!

...........చర్చించడానికి ఢిల్లీ రావలసిందిగా ఆనాటి కాంగ్రెసు అధ్యక్షుడు మౌలానా ఆజాద్ తంతి పంపారు......'ఇది చాలా తప్పు. మనం ఢిల్లీ వెళ్ళకూడదు ' అని తెన్నేటి ఒక ప్రకటన చేశారు.

...........రాజాజీనే (చక్రవర్తుల రాజగోపాలాచారి ని--సియార్--అంటే హిందీలో జిత్తులమారి గుంటనక్క--అనేవారు) కాంగ్రెసుపార్టీ నాయకుడుగా, అంటే ముఖ్యమంత్రిగా యెన్నుకోవాలని కాంగ్రెసు అధిష్ఠాన వర్గం మద్రాసు కాంగ్రెసు లిజిస్లేచర్ పార్టీ కి సూచించింది.  'మీరు హైకమాండ్ ఆదేశం పాటిస్తే పాటించండి. లేకపోతే, తత్పరిణామాల బాధ్యత మీదే' అన్న ధోరణిలో తిరిగి ఆజాద్ టెలిగ్రాం పంపించారు.

రాజాజీని నాయకుడుగా అంగీకరించాలన్న హైకమాండ్ ఆదేశాన్ని మద్రాసు కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ సమావేశం లో 1946 ఏప్రిల్ 18 న వోటింగుకు పెడితే, రాజాజీకి అనుకూలం గా 38, వ్యతిరేకం గా 148 వోట్లు వచ్చాయి. ఈ సమావేశానికి ప్రకాశం గారి శిష్యుడు వి. వి. గిరి (తరవాత మన రాష్ట్రపతి అయ్యారు--ఇందిరాగాంధీ నీలం సంజీవరెడ్డిని మోసం చేసి, అంతరాత్మ ప్రబోధం ప్రకారం వోట్లు వెయ్యమనడం వల్ల) అధ్యక్షత వహించారు. 

..........కాగా ప్రకాశం గారు ఏ పరిస్థితిలోను ముఖ్యమంత్రి కారాదని కాంగ్రెసు హైకమాండ్, ముఖ్యం గా మహాత్మాగాంధీ ధృఢాభిప్రాయం.

ఈ విషయం లో మాత్రం గాంధీజీ వైఖరి ఏ విధం గానూ సమర్థనీయం గా కనిపించదు. ముఖ్యం గా--1942 నుంచి కాంగ్రెసు సిధ్ధాంతాలకు, ఆలోచనారీతికి వ్యతిరేకం గా వుంటూ, 'క్విట్ ఇండియా' తీర్మానాన్ని ప్రతిఘటించి, చివరికి పాకిస్తాన్ తీర్మానాన్ని సమర్థించి, ఆ స్వాతంత్ర్యోద్యమం చివరి ఘట్టం లో ఒక్కరోజు కూడా జెయిలుకి వెళ్ళకుండా, కాంగ్రెసు విథానాలను, మహాత్మా గాంధీ కార్యానుసరణ విథానాన్ని వెన్నుపోటు పొడిచిన--రాజాజీయే ముఖ్యమంత్రి కావాలని, అంతటి త్యాగధనుడు, మహా దేశభక్తుడు, ప్రజానాయకుడు అయిన ప్రకాశం గారు ముఖ్యమంత్రి కారాదని గాంధీజీ పట్టు పట్టడం ఆంధ్రులకేకాదు, తెన్నేటి విశ్వనాధం వంటి గాంధేయవాదులకు, నిష్పాక్షిక రాజకీయ పరిశీలకులకు సయితం అప్పటికీ, ఇప్పటికీ అర్థం కాని విషయం.

రాజాజీ గాంధీజీకి వియ్యంకుడు కావడమే ఇందుకు కారణమని అప్పటిలో కొందరు చేసిన ఆరోపణలు జాతిపితకు బంధుప్రీతిని ఆపాదించడం కావచ్చుకాని, మొత్తం మీద గాంధీజీ వైఖరి అప్పటిలో చాలామందికి అర్థం కాలేదు.

...........'పరిస్థితి ఇలా వుంది, యేమి చెయ్యమంటారో చెప్పండి ' అని వి. వి. గిరి....మౌలనా అజాద్ కు టెలిగ్రాము ఇవ్వగా, 'మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు. ఇక మా సలహా దేనికి?' అంటూ నిష్ఠూరం గా సమాధానం ఇచ్చారు.

1946 ఏప్రిల్ 23న తిరిగి మద్రాసు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. ప్రకాశం గారికి, సి. ఎన్. ముత్తురంగ మొదలియార్ కు పోటీ జరిగింది. అధిక సంఖ్యాకులు ప్రకాశాన్ని నాయకుడుగా యెన్నుకున్నారు."

(ఆ విధం గా అధిష్ఠానానికి వ్యతిరేకం గా ముఖ్యమంత్రి గా యెన్నికైన శ్రీ టంగుటూరి ప్రకాశాన్ని--పదవి నించి దిగేదాకా నిద్రపోలేదు అధిష్ఠానం! ఆ విషయాలు తరవాత! ఇందులో "..." మధ్య వున్నదంతా తెన్నేటి విశ్వనాధం జీవిత చరిత్రనించి యథాతథం గా వ్రాయడం జరిగింది. బ్రాకెట్ల మధ్య వున్నవి నా వివరణలు. బోల్డ్ గా వున్నవి నేను ప్రాథాన్యత ఇచ్చినవి--కృష్ణశ్రీ)

Thursday, February 25

లక్ష్యం

గురి

ద్రోణుడు ఓసారి తన శిష్యుల విలువిద్యా నైపుణ్యాన్ని పరీక్షించదలిచి, ఓ చెక్క పక్షిని చేయించి, ఓ చెట్టుమీద చిటారుకొమ్మన పెట్టించి, కౌరవుల్నీ, పాండవుల్నీ ఒక్కొక్కళ్ళనీ పిలిచి 'నీకేమి కనిపిస్తోంది?' అని అడగడం మొదలు పెట్టాడట.

ఒక్కొక్కళ్ళూ--ఆకాశం, మేఘాలు, చెట్టు, పక్షీ, గురువుగారు, సోదరులూ--అంటూ లిష్టులు చెప్పారట.

చివరికి అర్జునుడు మాత్రం, 'నేను కొట్టవలసిన పక్షి ఒక్కటే నాకు కనిపిస్తోంది గురువర్యా!' అన్నాడట!

అదీ లక్ష్యం అంటే--దానికి గురి పెడితేనే విజయం వరిస్తుంది!

యెందుకు చెప్పానంటే, మన తెలుగు బ్లాగులమీద వ్యాఖ్యలు చేసేవాళ్ళు కూడా.....అర్జునుళ్ళు కాదు....వాళ్ళకి అసలు విషయం తప్ప అన్నీ అర్థం అవుతాయేమో....అనిపించి!

ఆఁ! సింగినాదం, జీలకఱ్ఱ అంటారా!

ఈ మాటా, సామెతా మా పశ్చిమగోదావరి జిల్లాలోనే, మా నరసాపురం లోనే పుట్టాయండోయ్!

డచ్చివారు (హాలెండర్స్--హలంధరులు--వలందరులు) నరసాపురాన్ని వాళ్ళ వ్యాపార కేంద్రం గా చేసుకొని, సంపన్నమైన మన అటవీ సంపదని విదేశాలకి యెగుమతి చెయ్యడానికి వుపయోగించుకోవాలని తలచి, గోదావరిని వాడుకున్నారు.

మొదటిగా, అడవుల్లోంచి 'జీలకఱ్ఱ' సేకరించి, పడవల్లో నరసాపురం రవాణా చేసి, అక్కడ గోదాముల్లో నిలవ చేసి, అక్కడనించి అంతర్వేది రేవు ద్వారా ఓడలలో యెగుమతి చేశేవారు.

(మూడు వందల యేళ్ళ క్రితమే అంతర్వేది లో లైట్ హౌస్ వుండేది--దాని శిథిలాలు మొన్న మొన్నటి వరకూ వుండేవి).

పడవలు నరసాపురం రేవుకి అల్లంత దూరం లో వుండగానే, దిగుమతి కార్మికుల్నీ, వుద్యోగుల్నీ హెచ్చరించడానికి, పడవమీద నించి 'శృంగనాదం' (కొమ్ము బూరాలు వూదడం) చేశేవారు.

ఆ నాదం వినపడగానే, వూరి ప్రజలు--'జీలకఱ్ఱ పడవలు వచ్చేశాయండోయ్' అని తమ పరిఙ్ఞాన్ని ప్రదర్శించేవారు!

ఆ శృంగనాదమే, సింగినాదం అయ్యింది--దానికీ జీలకఱ్ఱకీ సంబంధం కల్పించడం జరిగింది.

తరవాత్తరవాత, చింతపండూ, మిరపకాయలూ దగ్గరనించి, తుమ్మజిగురు దాకా అన్నీ పడవల్లోనే వచ్చేవి, వాటికీ సింగినాదమే చేసేవారు!

అప్పుడు నిశ్చయం అయ్యింది--సింగినాదానికీ, జీలకఱ్ఱకీ యే సంబంధం లేదని!

ఇప్పటికీ సంబంధం లేని విషయాలని 'ఆఁ! సింగినాదం, జీలకఱ్ఱ' అంటారు!

అదండీ సంగతి!
డియర్ oremuna!

ఇక్కడ విషయం అమెరికాలో తప్పా, ఆంధ్రలో తప్పా కాదు కదా?

ప్రభుత్వం చేస్తున్న దగా గురించి!

ఇక విద్యా విధానం, పరీక్షలూ అవీ అమెరికాకీ మనకీ చాలా తేడా వుంది కదా? మరి వీళ్ళు చదువులు యెప్పుడు వెలగబెట్టాలి?

ఆలోచించండి!

ధన్యవాదాలు.

Wednesday, February 24

కాకి బంగారం

వాయస స్వర్ణాంధ్ర ప్రదేశ్

అచ్చం బంగారం లాగే భ్రమింపచేసే దాన్ని కాకి బంగారం అంటారు.

స్వర్ణాంధ్ర ప్రదేశ్ చేసి చూపిస్తామన్న మన రాజకీయులు--"కాకి బంగారాంధ్ర ప్రదేశ్"  చేసి చూపిస్తున్నారు.

==> స్టూడెంట్ మేనేజ్ మెంట్ హాస్టళ్ళు--700 యేర్పాటు చేసిందట రాష్ట్ర ప్రభుత్వం. (యెప్పుడో నాకు తెలీదు). వాటికి, భవనం అద్దె, వంటవాళ్ళ ఖర్చు, కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లిస్తుందట. ఇలా రెండు లక్షల మంది ఏస్సీ, ఏస్టీ, బీసీ విద్యార్థినీ విద్యార్థులు ఈ హాస్టళ్ళ నీడ పొందారట.

ఇప్పుడు మన రాష్ట్ర 'మిగులు బడ్జెట్' పుణ్యమాని, ఆ విద్యార్థులు--ఇంజనీరింగ్, మెడిసిన్, ఏంబీయే, ఏంసీయే, ఎంఫిల్, పీహెచ్డీ, సీయే--ల్లాంటివి చదువుతున్నవాళ్ళూ--హోటళ్ళలోనూ, బార్ల లోనూ వెయిటర్లుగా పనిచేస్తూ, విద్యార్థినులు--ఫంక్షన్లలో పన్నీరు చల్లే, పువ్వులు ఇచ్చి స్వాగతం చెప్పే పాత్రలతో పొట్ట పోషించుకుంటున్నారట!(ఇంకా నయం--కాల్ గర్ల్స్/బాయ్స్ గా మారడం లేదు!)

==> కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం లో 17 ట్రామాకేర్ కేంద్రాల యేర్పాటుకి రెండేళ్ళ క్రిందట, 130 కోట్లు మంజూరు చేసిందట--ప్రమాదాల్లో గాయపడిన వారికి సత్వర చికిత్స అందించడానికి.  రాష్ట్రం లో ఏటా 40 వేల రోడ్డు ప్రమాదాల్లో, 28 వేలు జాతీయ రహదారుల్లోనే జరుగుతున్నాయట. అందులో గత యేడాది 13,545 మంది మృతి చెందారట. వీరిలో, 60% సకాలం లో చికిత్స అందకే మరణించారట! ఈ కేంద్రాల కోసం 2008-09 లో 31.53 కోట్లు విడుదల చేస్తే, ఖర్చు చేసింది 15.70 కోట్లు మాత్రమేనట! ఆ నిధులన్నీ ఖర్చు చేస్తేనే తరవాత విడత మంజూరు చేస్తామన్న కేంద్రానికి జవాబు చెప్పే దిక్కే లేదట! అసలు 17 లో 7 కేంద్రాల్లో ఎలాంటి పనులూ మొదలే పెట్టలేదట!

==> నీటి పారుదల కి 'పెద్ద పీట ' వేసినప్పటినించీ, కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకుండా, కూలీలకి పనులు చూపించకుండా, తప్పించుకు తిరుగుతోందట ప్రభుత్వం!

==> మన ఆర్టిసీ 'టోల్ పన్నుల ' రూపం లో 'అన్ని జిల్లాలనీ కలిపి ఒక యూనిట్ గా పరిగణించి ' చెల్లింపులకన్నా యెక్కువగా వసూలు చేసి, తన జేబు నింపుకుంటోందట!

==> మధ్యాన్న భోజన పథకం లో తమకు రావలసిన యేడు నెలల బకాయిలని చెల్లించాలని అడిగిని పాపానికి మహిళల్ని నెత్తురు కారేలా చితక్కొడుతున్న పోలీసుల ఫోటోలు పేపర్లో చూడనే చూశారు కదా?

==> ఈ లోపల, 'తెలంగాణను అడ్డుకోవాలని చూస్తున్న వారి ఆస్తులని లెక్క కడుతున్నాం' అంటున్నాడు--'తెలంగాణ ఐ కా స ' 'ప్రొఫెసర్ ' కోదండరామి రెడ్డి! 'శ్రీ కృష్ణ కమిటీ' ని తాము బహిష్కరించామన్నారు!

మరి వాళ్ళు బహిష్కరించిన కమిటీని కేంద్రం యెందుకు రద్దు చెయ్యదు?

'ఇదే ఆఖరి పోరాటం--ఈసారి తెలంగాణ రాకుంటే ఇక ఎప్పుడూ రాదు ' అని కూడా అన్నారు--తథాస్తు దేవతలుంటారని మరిచి పోయినట్టున్నాడు!

ఇదండీ మన 'వాయస స్వర్ణ ' ఆంధ్ర!

Monday, February 1

గొప్పవాళ్ళు



భస్పీ మాలబబ్రహ్మణ్యం  


కొంతమంది 'గొప్పవాళ్ళుగా పుడతారు', కొంతమందికి 'గొప్పతనం వాళ్ళ నెత్తిమీద రుద్దబడుతుంది', కొంతమంది 'గొప్పతనాన్ని స్వయంకృషి తో పొందుతారు'! అంటారు.  


ఆఖరి కోవకి చెందే, మన జాతి గర్వించదగ్గ తెలుగు రత్నం మన యెస్పీ!  


మొన్న (18-01-2010) '....ట్ పాడుతా తీయగా' ఎపిసోడ్ ముగింపులో, కీరవాణి 'అమ్మా సరోజినీదేవీ' పాట పాడితే 'అది ఆయన సంస్కారం' అన్న బాలూకి సమాధానం గా, కీరవాణి.... 


'సినిమావాళ్ళందరూ వీ ఐ పీ ల్లా శ్రీపతిని దర్శించుకుని తమ కోరికలు కోరుకుంటే, బాలూ కాలినడకన కొండ యెక్కి, స్వామి సమక్షం లో తను ఈ రోజు ఈ స్థితికి రావడానికి కారణమైన వాళ్ళందరినీ పేరు పేరునా తలుచుకుని, వారి తరఫున స్వామిని ప్రార్థించాడు!' అన్నాడు!  


దటీజ్ బాలసుబ్బు!  


(యెప్పుడో ఆయన సరదాగా చెప్పిన ఆయన పేరుని--అలాగే వుపయోగిస్తున్నందుకు యస్పీకి క్షమాపణలు.)