Friday, December 18

"ప్రధాన మం..."



రాజకీయ మోసం


"'.....పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో వున్నాయనుకుని, తెలంగాణా ప్రకటన చేశా'మని, 'ఒక మాట చెప్పి, మరోపని చేస్తారని 'తమకు' తెలియలేదని' " ప్రధాని మన్మోహన్ సింగ్--తనతో 'ఆవేదన' వ్యక్తం చేశారని--లోక్ సత్తా అధినేత జయ ప్రకాష్ నారాయణ్ అన్నారట!  


ఇంకా, ".....పార్టీలు బాధ్యతతో, నిజాయితీగా అభిప్రాయాలు వెల్లడించాలని, 'భారత ప్రభుత్వానికి' మాటిచ్చే ముందు 'ఆచి తూచి' వ్యవహరించాలని, ప్రజల జీవితాలతో ఆడుకోవడం ప్రమాదకరమని" ఆయన అన్నట్టు కూడా జేపీ తెలిపారట!  


కాసేపు ఈ మాటలన్నీ నిజం అనుకుందాం!  


యెంతటి అక్షర సత్యాలవి!  


(రాజకీయానికి కొత్త అయిన రాజీవ్ గాంధీ, వోట్ల కోసం రామ జన్మ భూమి లో 'శిలాన్యాస్' చేయించారు!)  


యే రాజకీయం తెలియని మన్మోహన్ సింగే ఇలా అంటే, రాజకీయ ధురంధరుడు, అపర చాణక్యుడు, మహా పండితుడు, బహుభాషా కోవిదుడు, మన తెలుగు తేజం పీ వీ నరసిం హా రావు--"ఆ రోజుల్లో" యెంతటి మానసిక హింస అనుభవించాడో వూహించగలమా?  


ఆయనకి రాజకీయ పార్టీల సంగతీ, ముఖ్యం గా బీజేపీ సంగతీ, కల్యాణ్ సింగ్ గురించీ, చాలా బాగా తెలుసు--కానీ, ఆయన చేస్తున్న వుద్యోగం--పార్టీలని తిట్టడమో, దేబిరించడమో కాదు! ప్రధాన మంత్రిత్వం!  


పైగా, భారతదేశం లోని 'బ్యూరాక్రసీ' నియమాలకి కట్టుబడి వున్నవాడు! 


అందుకే 'భారత ప్రభుత్వానికి' బీజేపీ నుంచీ, రాష్ట్రప్రభుత్వం--కల్యాణ్ సింగ్ ప్రభుత్వం--దగ్గరనించీ, ప్రతీ క్షణం నివేదికల్ని--మౌఖికం గా, లిఖిత పూర్వకం గా--అందుకొంటూ, ప్రతీ క్షణం యేమి జరిగిందో దస్త్రాల్లో నిక్షిప్తం చేశారు! (కావాలంటే ఆయన స్వయం గా వ్రాసిన పుస్తకం చదవండి!)  


బై ది బై, మన 'లిబర్హాన్ కమిషన్' పీవీని యేవిధం గానూ తప్పు పట్టలేదు కదా--ఇప్పుడు 'అధిష్టానం'--ఇంతకాలం-- వోట్లకోసం, వోట్ బ్యాంకుల కోసం, అంటరానివాడిగా చూసిన పీవీ కి ఈ రోజు సరైన న్యాయం చేస్తుందా? అంత దమ్ము వారికుందా?  


'చేటపెయ్య' సోనియాని ముందు పెట్టుకుని, చిదంబరాలూ, పిళ్ళైలూ, ముఖర్జీలూ, మొయిలీలూ, అహ్మద్ పటేళ్ళూ, వయలార్లూ, శరద్ పవార్లూ ఆడుతున్న నాటకాలకి, వారికి వత్తాసు పలికే 'యాదవ్' లకీ, మిగిలిన వాళ్ళకీ, ప్రజలు ఫుల్ స్టాప్ పెట్టే రోజు యెంతో దూరం లేదు.  


దానికోసమే నిరీక్షణ!




Saturday, December 5

స్వాతంత్ర్యోద్యమం



వందేమాతరం ఉద్యమం


చరిత్రలో లిఖించబడిన ప్రకారం, అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1905 జూలై 7న, ‘పరిపాలనా సౌలభ్యం’ పేరిట బెంగాల్ ను రెండు రాష్ట్రాలుగా విభజించాడు.  


దీన్ని భారతీయులు వ్యతిరేకించారు. పెద్ద ఉద్యమం జరిగింది. దీన్నే ‘వందేమాతరం ఉద్యమం’ అని వ్యవహరించారు. ఉద్యమం లో పాల్గొన్నవాళ్ళు సామూహికం గా బంకిం చంద్ర చటర్జీ వ్రాసిన వందేమాతరం గీతాన్ని గానం చేసేవారు.  


ఆంగ్లేయులు తమ ‘విభజించి పాలించు‘ పధ్ధతి ప్రకారం—హిందూ ముసల్మానులని విడదీయాలని కుట్ర పన్నారు—అనే బలమైన భావనతో పెద్ద యెత్తున ఈ ఉద్యమం జరిగింది—దేశమంతటా!  


దీనికి ‘లాల్, బాల్, పాల్’ త్రయం గా పేరొందిన లాలా లజపతి రాయ్, బాల గంగాధర తిలక్, బిపిన్ చంద్ర పాల్ నాయకత్వం వహించారు.  


1906 నుంచి 1911 వరకూ ఆంధ్రదేశం లో కూడా విశేషం గా, ఉధృతం గా ఈ ఉద్యమం జరిగింది. ఇందులో భాగం గా—విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం, ఆంగ్లపాఠశాలలు మాని, జాతీయ పాఠశాలలు స్థాపించడం, ఆంగ్ల న్యాయ స్థానాల బహిష్కరణ, శాంతియుత శాసనోల్లంఘనం, పన్నుల చెల్లింపుకి నిరాకరణ—ఇలా అనేకవిధాలుగా సాగింది ఆ ఉద్యమం!  


ఇదే మొదటి పెద్ద జాతీయోద్యమం—మన దేశం లో!  


ఆ రోజుల్లో జోక్ యేమిటంటే, యెవరైనా యే మామిడికాయలో బేరం చేస్తూ, “వందేమాత్రం?” అని అడిగితే, అడిగినవాళ్ళని సైతం పోలీసులు అరెష్టు చేసేవారట—ఆ ప్రశ్న "వందే మాతరం” లా వినిపించి!  


మరి ఈ రోజున కొన్ని ముసల్మాన్ సంఘాలు ‘వందే మాతరం పాడడానికి వీల్లేదు‘ అని “ఫత్వా” జారీ చేస్తున్నాయట.  


దీనికి కేంద్రమంత్రులు కూడా వత్తాసు ట.  


యెంత సిగ్గులేని జాతి అయిపోయింది మనది!  


ఈ రోజు కూడా, మన సైనిక దళాలు కవాతు చెయ్యడానికి మహాకవి ఇక్బాల్ వ్రాసిన ‘సారే జహాన్ సే అచ్చా……’ ట్యూన్ నే వాయిస్తారే? దానికి యేమతం వాళ్ళూ వ్యతిరేకత కనబరచలేదే?  


అసలు ‘ముస్లిం సోదరులు‘ అంటూ ఓ ప్రత్యేక జాతిని సృష్టించి, ఆ పేరుతోనే ఫలానా మతస్థులని వ్యవహరిస్తున్న పేపర్లనీ, టీవీ చానెళ్ళనీ ప్రజలందరూ బహిష్కరిస్తే యెంత బాగుండును!  


మన 'ఈనాడు' ఆ దిశలో ముందడుగు వేస్తుందని ఆశిద్దామా?