Friday, July 30

రామాయణం లో పిడకల వేట

వాలి, సుగ్రీవ, రామ....."తదితరుల" గురించి చర్చ

ఇంత చర్చ అవసరమా? యేమో!

రామాయణ, భారత, భాగవతాల్ని "ఇతిహాసాలు" అన్నారు. అంటే, ఒకప్పుడు జరిగినవిగా 'చెప్పబడుతున్న' "కథలు". 

పురాతన మహర్షులు చెప్పినా, గ్రీకులవంటివారు చెప్పుకున్నా ఇవి ఇతిహాసాలే!

ఇవి తరతరాలుగా, "అనుశృతం గా" వస్తున్నవి. అంటే, "విన్నది విన్నట్టుగా" చెప్పబడుతున్నవి! 

(ఓ సంఘటనకి ప్రత్యక్ష సాక్షులు నలుగురుంటే, నలుగురూ నాలుగు రకాలుగా చెపుతారే--ఇక విన్నది విన్నట్టుగా చెప్పడమంటే--యెన్ని మార్పులూ చేర్పులూ జరిగి వుండవచ్చో వూహించండి!)

ఇలా కథలు చెప్పేవాళ్ళు సందర్భానుసారం పాత్రల్ని ప్రవేశపెట్టడం, (రోజుల తరబడి సాగే ఈ కథ చెప్పడం లో) కొన్ని పాత్రలని మరచిపోవడం, మళ్ళీ యెవరో గుర్తుచేస్తేనో, వాటి సంగతి యేమయిందని అడిగితేనో, మళ్ళీ ఆ పాత్రల గురించి చెప్పడం, ముందు చెప్పినదానికీ, ఇప్పుడు చెప్పేదానికీ వైరుధ్యాలుండడం--ఇవన్నీ సహజమే కదా!

మన విఠలాచార్య హీరో కాల్ షీట్లు దొరకకపోతే, అర్జంటుగా వాడిని ఓ మొసలిగానో, యెలుగుబంటి గానో, తొండగానో, కప్పగానో మార్చి, కథ నడిపించి, హీరో కాల్ షీట్ ఒక్క రోజే దొరికినా, ఆ కథని కూర్పు చెయ్యడానికి హీరో క్లోజప్పులు మాత్రమే తీసుకొని, మిగిలిన సినిమా అంతా డూప్ లతోనూ, జంతువులూ, వాటి వేషాలేసుకున్న మనుషులతోనూ షూట్ చేసేసేవాడు!

ఇక మైథాలజీ అంటే, అప్పట్లో ప్రజల్లో వున్న నమ్మకాలని బట్టి, 'మిథ్య' తో సృష్టించబడినవి. మన పురాణాల సంగతేమోగానీ, గ్రీకు పురాణాలన్నీ ఈ మైథాలజీ క్రిందకి వస్తాయి--అట్లాసు భూమిని మోస్తూండటం, వీనస్, క్యూపిడ్, జియస్ లాంటి కథలు!

ఇక, కథ చెప్పేవాళ్ళ దగ్గరకి వస్తే, అన్నీ "సూతుడు శౌనకాది మహా మునులకి" చెప్పినవే!

ఈ సూతుడు అంటే యెవరు?

అసలున్నది "శుక, శౌనకాది మహామునులు" మాత్రమే! కాబట్టి "సూత మహర్షి" అనేవాడు లేడు!

వీళ్ళల్లో మొదటివాడు "శుకుడే" (చిలక్కి పుట్టినవాడు అని అర్థమేమో!) సూతుడు! 

(శౌనకుడు అంటే, శునకానికి పుట్టినవాడేమో కూడా!)

అందుకే, చిలకలా, తాను విన్నవి మళ్లీ అందరికీ వినిపిస్తూండేవాడు!

(తరవాత యెవరు ఈ కథలు చెప్పినా, "నైమిశారణ్యం లో సూతుడు శౌనకాది మహర్షులకి" చెప్పినట్టు.......అనే మొదలుపెట్టేవారు!)

ఈ విషయం, కొన్ని దశాబ్దాల క్రితమే, పెద్దలచే (ఇంక్లూడింగ్ మాలతీ చందూర్ ఇన్ ప్రమదావనం--జవాబులు) రూఢి చెయ్యబడింది!

మరి ఇప్పటిక్కూడా, "సూత మహర్షి" అంటూ వస్తున్న రచనలెన్నో!

అదలా వుంచితే, వేదవ్యాసుడూ, వాల్మీకి మొదలైనవాళ్లు యెవరూ కాగితల మీదా, అట్టలమీదా, చర్మాల మీదా, రేకుల మీదా, కనీసం తాళ పత్రాలమీదా వ్రాయలేదు కదా?

తరవాత్తరవాత వ్రాసినవాళ్లయినా, తమకి అప్పటికి తెలిసున్న "తెలుగు" లిపి లో నో, ఇంకో లిపి లోనో మాత్రమే వ్రాశారు! ఇలాంటి తాళ, భూర్జర, తామ్ర, శిలా.......వగైరా పత్రాలని, మల్లంపల్లి వంటివారూ, ఇంకొందరు మహామహులూ "పరిష్కరించి" ఈనాడు మనం వ్రాసుకుంటున్న "ముత్యాల్లాంటి" తెలుగు అక్షరాలలో అందించారు!

(వాటిలోనూ కొన్ని అపభ్రంశాలుండవచ్చు--ఉదా:- అన్నమాచార్య కీర్తనలు)

మరి ఈ రోజు మనం ఇన్నిరకాలుగా కొట్టుకోవలసిన అవసరం వుందా?

నన్నడిగితే, ఈ లండాచోరీ (ఈ మాట తప్పైతే నన్ను క్షమించగలరు) అంతా ఇప్పుడెవరికీ తెలియని "సంస్కృత" భాషవల్లే వచ్చింది!

ఒకడు "యత్రనార్యస్తు......." అంటాడు, ఇంకొకడు "యత్ర నార్యన్‌తు........." అంటాడు.

ఒకడు "నైనం ఛిందంతి......." అంటే, ఇంకొకడు "నయనం ఛిందన్‌తి............" అంటాడు.

ఒకడు ".....అభ్యుథ్థానం, థర్మస్య...." అంటే, ఒకడు ".......అభ్యుథ్థానమధర్మస్య......." అంటాడు.

ఇక అంకెల దగ్గరకొస్తే, ఇక చెప్పఖ్ఖర్లేదు...."అష్టోత్తరం"; "పంచ వింశతి"; "షష్టి"; "షష్ఠి".....ఇలాగ. 

(మొన్నీమధ్య గరికపాటివారు చెప్పేవరకూ నాకు షష్టి ల గురించి తెలియదు--ఇదివరకెప్పుడో నా బ్లాగులో తప్పు వ్రాసినట్టు కూడా గుర్తు నాకు!) 

కానీ, అందరూ, అలవోకగా అన్ని శ్లోకాలనీ జనాల (స్వైన్స్) ముందు "ముత్యాల్లా" (అని వారి భావన) జల్లేస్తూనే వుంటారు!

కనీసం ఇప్పుడైనా, "వుభయ భాషా ప్రవీణులెవరైనా" సంస్కృతం --టు-- తెలుగు వ్యాకరణాన్నీ, నిఘంటువునీ వ్రాస్తే, అది అన్నివిధాలా అందరికీ అమోదనీయమైతే, యెంతబాగుండునో!

తీరుతుందంటారా--ఈ ఆశ?

Monday, July 26

అర్రర్రర్రె!

'.....నా తప్పేం లేదండి....'

(శరత్ 'కాలమ్' "ఊప్స్" గురించి టపా చదివాక)

'బీచ్ క్రాఫ్ట్ బొనాంజా' అనే చిన్న ప్లేన్ ను నడుపుకుంటూ, భార్యా పిల్లలతో బీచ్ కి వెళ్తూంటాడొకాయన.....రూల్ బుక్ ప్రకారం నడుచుకుంటూ, ఫ్లైట్ ప్లాన్ ప్రకారమే, తక్కువ యెత్తులో వెళుతూ.....

ఇంకో ప్లేన్ లో ఓ కుర్రాడు, గాలిలో విన్యాసాలు చేసుకొంటూ ఆనందిస్తూ వుంటాడు.....పైకి వెళుతూ, డైవ్ లు కొడుతూ, తలక్రిందులుగా, మళ్ళీ సరిగా.....ఇలా!

ఏ టీ సీ నించి బీచ్ బొనంజాకి కమాండ్ వస్తుంది......."90 డిగ్రీలలో యెడం వైపు తిరిగిపో......వెంటనే!" అని.

ఇంకెవరైనా అయితే, "వెంటనే" అన్న గొంతుకలోని అర్జెన్సీ ని గమనించి, ప్లేన్ ని తిప్పేసి, "తిప్పేశాను" అని చెప్పేవారు.....కానీ, రూల్ బుక్ పాటించే ఆయన, మైక్ లో "రోజర్" అని చెప్పి, తిప్పబోయేలోపల....."బ్యాంగ్!" విన్యాసాలు చేస్తున్న ప్లేన్, ఈ ప్లేన్ ని గుద్దేసి, రెండూ గాలిలో మండి పోతాయి!

ఆఖరుగా, ఓ చిన్న పిల్లవాడు, "డాడీ! నేను చనిపోవాలనుకోవడం లేదు!" అంటూండగా, ఏ టీ సీ లో ప్రసారం ఆగి పోతుంది!

*  *  *

జే ఎఫ్ కె ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లో, ఏ టీ సీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) టవర్ లో, విమానాలని కంటిన్యూగా మోనిటర్ చేస్తూ వుండే డజను పైగా వుండే వుద్యోగుల్లో ఒకాయన, (సీనియర్ అవడం తో, ఆయన మోనిటర్ చేసే యేరియాలో ట్రాఫిక్ అసలే యెక్కువ) కళ్ళు కొంచెం లాగుతున్నాయని, రిలీఫ్ ఇన్స్ పెక్టర్ని రిక్వెస్ట్ చేసి, బయటికి వెళతాడు. చుట్ట వెలిగించుకొని, బాత్రూం కి వెళ్ళి వచ్చి, కారిడార్ లో తన ఇంటి సమస్యలని గురించి ఆలోచిస్తూ, వుండిపోతాడు.

చుట్టతో వేళ్ళు కాలేటప్పటికి తెలుస్తుంది--తను అనుకున్నదానికన్నా కొన్ని సెకన్లు యెక్కువ బయట వుండి పోయానని.

గబగబా తన సీటు దగ్గరకి వెళుతుంటే, మానిటర్ లో అతివేగంగా, ప్రమాదకరం గా దగ్గరవుతున్న రెండు చుక్కల్ని చూసి, మైక్ లాక్కొని ఆఙ్ఞాపిస్తాడు "90 డిగ్రీలలో యెడం వైపుకు తిరిగిపో--వెంటనే" అని!

*  *  *

జరగవలసిన ఘోరం జరిగేపోయింది!

*  *  *

"అయ్యో! నాకు నిజం గానే బుధ్ధి లేదు.....ఆ కాస్తసేపూ నేను యెక్కువ బయట గడిపి వుండకపోతే.....అనుభవం కొంచెం తక్కువైన రిలీవరు తన దృష్టి మానిటరుపై పెట్టి, ఆ చుక్కలని అర్థం చేసుకొని వుంటే.....ఆ విన్యాసాలు చేస్తున్న మూర్ఖుడు రెండు మూడు సెకన్లు ఆలస్యం గా క్రిందకి డైవ్ చేసి వుంటే.....ఆ బీచ్ క్రాఫ్ట్ పైలట్, ముందు పక్కకి తిరిగి, తరవాత "రోజర్" అని వుంటే......" ఇలా అనేక "ఐతే" లతో కుమిలిపోతూ వుంటాడు--ఆ వుద్యోగి!

ఓ నలభై నించి 35 యేళ్ళ క్రితం, నేను ఇంగ్లీష్ నవలలు చదవడం మొదలుపెట్టిన కొత్తలో చదివిన--ఆర్థర్ హెయిలీ వ్రాసిన--"ఎయిపోర్ట్" నవల లోనివీ భాగాలు. (నాకు గుర్తున్నంతవరకూ వ్రాశాను--తప్పులు వుండవచ్చు)

*  *  *

గత పది పదిహేను రోజులుగా పత్రికలలో విమానాలకి "తృటిలో తప్పిన ప్రమాదాలు" అని తరచూ చదువుతున్నాం! "హెడాన్ కొలిజన్" తప్పడం, రన్ వే మీద ఓ ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంటే, ఇంకోటి ల్యాండ్ అవుతూ, రెక్కలు తగలకుండా తప్పించుకోవడం, దిగుతూండగా టైర్లు పేలి పోవడం, బయలుదేరుతూండగా అండర్ క్యేరేజ్ లో మంటలు రావడం--ఇలా అనేకం!

ముఖ్యం గా కింగ్ ఫిషర్, స్పైస్ జెట్ లాంటి వాటికి ఈ ప్రమాదాలు యెదురవుతున్నాయి!

ముఖ్యం గా ప్రైవేట్ ఎయిలైన్స్ కి అనుమతి ఇచ్చేముందు, మన రన్ వేలూ, ఏ టీ సీ లూ, ఎన్ ఎల్ ఎస్ లూ, స్టాఫ్ పరిస్థితీ--ఇవన్నీ యెవరైనా ఆలోచించారా లేదా అని నాకో డవుటు.

మన రైళ్ళు చూస్తే అలాగ వున్నాయి--కొన్ని వందలమందిని చంపుతూ! ఇక ప్లేన్లు కూడా అయితే--(అమంగళము ప్రతిహతమగు గాక)!"

మన మంత్రులూ, అధికారులూ, వుద్యోగులూ కనీసం మనసులోనైనా "ఊప్స్" అనుకుంటున్నారా? ఆ వుద్యోగి మనసులో పడ్డ నరకబాధలో వందో వంతైనా పడుతున్నారా?

పైకి తేలరుగానీ, అంతకన్నా యెక్కువే పడుతూ వుంటారు! అదేదో సినిమాలో ముళ్ళపూడి వ్రాసినట్టు "అనుభవిస్తారు.....అంతకి అంతా అనుభవిస్తారు!"

.........మళ్ళీ ఇంకోసారి

Thursday, July 22

తెలుగోడు


బాబ్లీ-2

"లాఠీలకు వెరవకుండా, అక్కడి పోలీసుల దురుసు ప్రవర్తనను సహించి, సాహసంతో బాబ్లీని అడ్డుకునేందుకు తెలుగుదేశం చేసిన పోరాటాన్ని హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను" అన్నారట రోశయ్య--తెలివైనవాడు కదా.

నోటితో మెచ్చుకుంటూ, నొసటితో వెక్కిరించడం అంటే ఇదే.

వాళ్ళు వెళ్ళింది అడ్డుకోడానికీ, పోరాటానికీ కాదు--అఖిలపక్షం లోగా వాస్తవ పరిస్థితిని చూడడానికి అన్న విషయాన్ని యెంత తెలివిగా పక్కదారి పట్టించాడో చూడండి!

ఇంకా, 1995 నించీ మీరేమీ చెయ్యకపోవడం వల్లే సమస్య ముదిరింది--అంటూ యెదురుదాడి మామూలే.

"బాబ్లీ గురించి పత్రికల్లో చూసేదాకా ప్రభుత్వానికేమీ సమాచారం లేదు" అని పదే పదే వారి ప్రభుత్వం అసెంబ్లీ లో ప్రకటించిన విషయాన్ని మరిచిపోతున్నారు. 2005 లో లేని సమాచారం 1995 లో యెలా వుంటుంది ప్రభుత్వం దగ్గర?

ఆ తరవాత మరో పదమూడో, పదిహేడో ప్రాజెక్టులగురించి కూడా ఇలాగే ప్రకటించారు--అసెంబ్లీ లో!

జనాల ఙ్ఞాపక శక్తి చాలా తక్కువ అనే వాళ్ళ నమ్మకం.

ఇక మన గుంటూరు ఎం పీ రాయపాటి, "మంగళవారం వుదయం నేను అధినేత్రిని కలిసి, చెపితేనే, ఆవిడ మరాఠా ముఖ్యమంత్రితో మాట్లాడి, 'సమస్య జటిలం కాకుండా చూడాలని' ఆదేశించినట్టూ, 'మరాఠా ముఖ్యమంత్రిని ఓ రకం గా మందలించారు' అనీ, స్వకుచమర్దనం చేసుకుంటూ, పళ్లికిలిస్తున్నారు.

మంగళవారం వుదయం 9-00 లోపే, ఇంకా చాలా మంది 'వేప్పుల్లలతో' దంతధావనం చేస్తూండగానే, పూర్తిగా కాలకృత్యాలు తీర్చుకోకుండానే వాళ్ళని పోలీసులు చితకబాదారని పత్రికలూ, టీవీలూ చూపించాయి.

మరి ఆవిడ నిద్రలేచి, బాత్రూముకి కూడా వెళ్ళకుండానే, మన రాయపాటి 'ఆవిడని కలిసి........'అని మనని నమ్మమంటాడు.

పైగా 'సమస్య జటిలం కాకుండా' అంటే, వాళ్ళని చావబాది, బస్సులెక్కించమని అర్థమా; అదికూడా ఆవిడే చెప్పిందా అన్న విషయం లో ఈయనేమీ మాట్లాడడం లేదు.

బాబూ! మీకంత సీనే వుంటే, ఇలాంటి సమస్యలే వచ్చేవి కాదు అంటున్నారు మన తెలుగు వాళ్ళు. అవునా?

ఇక, ఒకప్పుడు తననుతాను 'మరాఠా సింహం' గా అభివర్ణించుకున్న ముసలి రాజకీయ పందికొక్కు బాల్ ఠాక్రే, "బాబేమన్నా మీ ఇంటల్లుడా? వాడికి ఆంధ్రాలోనే జైలుగుడ్డలు వేసి, మన జైల్లో చిప్పకూడు యెందుకు తినిపించలేదు?" అని ఘుర్ఘురించాడట వాళ్ళ ముఖ్య మంత్రిని!

అఫ్ కోర్స్--వాడి ప్రతి పక్ష పాత్ర వాడు పోషిస్తున్నాడు--రక్తి కట్టేలా! 

సొంత కొడుకే వాణ్ణి గుడ్డలూడదీసి చితక్కొట్టినంతపని చేసినా వాడికి బుధ్ధి రాలేదు--రాబోదు! వాణ్ణేమీ అనఖ్ఖర్లేదు మనం.

"తెదేపా యాత్రని రాజకీయాలతో ముడిపెట్టడం సరి కాదు. అలా అయితే, మధు యాష్కీ సుప్రీం కోర్టులో కేసు వెయ్యడమూ రాజకీయమేనా?....వుప యెన్నికలకూ, తెదేపా బాబ్లీ చూసేందుకు వెళ్లడానికీ సంబంధం లేదు" అంటూ అమూల్యం గా తన అభిప్రాయాన్ని ప్రకటించారు--'కాకా' వెంకట స్వామి. 

"....నేతలను హైదరాబాదు పంపడం 'ఆమె నిర్ణయమే' అయి వుండవచ్చు అని భావిస్తున్నా" అని మళ్ళీ సన్నగా నొక్కుతూ, తన వీర విధేయతని చాటుకున్నారు.

ఇక 'నాందేడ్' ఎంపీ, భాస్కరరావు పాటిల్, "వాళ్ళని వాళ్ళే కొట్టేసుకుని, గాయ పడ్డారు. తరవాత పోలీసులపై దాడి చెయ్యడం తో 'యెనిమిది మంది'...కాదు కాదు..'ఆరుగురు పోలీసులు' గాయ పడ్డారు" అని చెప్పాడట!

"ఆంధ్రా నించి పైసాకూడా తీసుకోలేదు.....సుప్రీం కోర్టు గేట్లు పెట్టద్దనలేదు....." అంటూ అవాకులూ చవాకులూ పేలాడట!

ఇలాంటి బఫూన్ వెధవలకి వోటు వేసిన నాందేడ్ ప్రజలని--కాదు వోటర్లని--అనాలి!

ఇక మన గౌరవనీయ హైకోర్టు, "తెదేపా అధినేత చట్టాన్ని వ్యతిరేకించవచ్చా? శాంతి భద్రతల సమస్యను సృష్టించవచ్చా? అన్నీ తెలిసిన వ్యక్తి అక్కడికెందుకు వెళ్ళారు? ఇది ప్రచారం కోసం దాఖలు చేసినట్లుగా వుంది!" అనే కాకుండా, "ఈ కేసులో అవసరమైతే (పిటిషనరు కి) జరిమానా కూడా విధించాల్సి వుంటుంది" అని వ్యాఖ్యానిస్తూ బెదిరించింది(ట).

"ప్రి జుడిస్" కి చక్కని వుదాహరణ కదూ ఇది?



Wednesday, July 21

తెలుగోడు

బాబ్లీ

చంద్రబాబు యాత్ర "సుఖాంతం" అయి, కేర్ హాస్పిటల్ కి చేరింది.

రోశయ్య, 'మహారాష్ట్ర పోలీసులు కాస్త అతిగా ప్రవర్తించినట్లు అనిపిస్తోంది' అనలేదింకా!

చిన్నా చితకా కాంగీరేసు రా నా లు మాత్రం, "చంద్రబాబు అరెస్టు అయితేనే ఆత్మహత్యలు చేసుకొంటున్నారట. ఇక చనిపోతే (పాపం శమించుగాక) యెన్ని లక్షలమంది చనిపోతారో?" అనివ్యాఖ్యానిస్తూ, ప్రజలు వీళ్ళనీ, వీళ్ళ వ్యవహారాన్నీ చూసి, దేనితో నవ్వుతున్నారో చూడడం లేదు.

జేపీ కూడా, చంద్రబాబుది రాజకీయం అనడానికి వీల్లేదు అంటున్నాడు.

మామూలుగానే, నాక్కొన్ని సందేహాలు.

1. 2004 ఆగష్టు లో బాబ్లీ శంకుస్థాపన జరిగినప్పుడు, అధికారం లో వున్న వై యెస్, "మహారాష్ట్ర ముఖ్యమంత్రిని మందలించమని సోనియా ని అడగడం బాగోదు కదా?" అనీ, "ఓ రెండుమూడు లక్షల మంది తో మహారాష్ట్ర మీద యుధ్ధానికి వెళ్ళలేము కదా?" అనీ వ్యాఖ్యానించి, మనరాష్ట్రం '....క్రిందికి' నీళ్ళు చేరుతున్నా, మిన్నకుండిపోయారని వీళ్ళు (కాంగీరేసులు) మరిచిపోయారా?

2. జడ్ ప్లస్ కేటగరీ లో వున్న చంద్రబాబు రక్షకులు, ఆయన మీద లాఠీ చార్జీ జరిగి చొక్కా చిరిగి పోతే, పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆయన చుట్టూ రక్షణ వలయాన్ని నిర్మించారట. మిగిలిన నాయకుల అంగరక్షకుల్ని పోలీసులు తరిమికొడుతూంటే, పొలాల వెంబడి పరుగెత్తారట!

యెందుకలగ?

==> ఓ అంగ రక్షకుడు, తన తుపాకీని గాలిలోకి పేల్చి, పోలీసుల్ని హెచ్చరిస్తే, వాళ్లు ఆగిపోయేవారు కదా?

ఇంకా వాళ్లు ఆగకపోతే, ఓ నలుగురైదుగుర్ని వేసేస్తే, ఇంకా మాట్లాడితే, నాందేడ్ కలెక్టర్నీ, ఎస్ పీ నీ కూడా వేసేస్తే, యెలా వుండేది?

(చట్ట ప్రకారం, అంగరక్షకులు చేసే పనికి నాయకులే బాధ్యత వహించాలంటారా? మన రా నా లకి, కేసులూ, కోర్టులూ యేమీ కొత్త కాదు కదా? గాంధీగారు మన రా నా లకి ఆదర్శం కానీ, అంగరక్షకులకి కాదు కదా?)

3. 'పిలుపు తక్కువయ్యింది' అని అలిగి వెళ్ళలేదు అని చెప్పిన చిరంజీవి, ఇప్పుడు '23న అఖిలపక్షం వుండగా వెళ్ళడం ఆయన తొందరపాటే' అంటున్న చిరంజీవి, నిజం గా యాత్రకి వెళ్ళి వాళ్ళతో వుండి వుంటే--యేమి జరిగేది?

ఆయన అభిమానులూ, కార్యకర్తలూ ఈపాటికి యేమి చేసేవారు?

(ఇంకా సందేహాలు వున్నాయి గానీ, ఇవే ముఖ్యమైనవి)

ఇక చెయ్యవలసింది?

రెండురోజుల్లో ప్రథానితో జరగవలసిన అఖిలపక్షం భేటీని ఇంకో మూడు రోజులు పొడిగించి, 26 కి మార్చారు.

ఇక విపక్షాలన్నీ, ఈ భేటీని బహిష్కరించండి. ప్రథానీ, అధిష్టానం దిగి వచ్చి, అఖిలపక్షాన్ని హైదరాబాదులోనే కలవమనండి--జరిగిందానికి క్షమాపణ చెప్పాక!

ఆ భేటీ కి మరాఠీ ముఖ్యమంత్రిని కూడా రప్పించమనండి. 

వాడు రాగానే, అంగ రక్షకులతోసహా విమానాశ్రయం లోనే బంధించి, బందెలదొడ్లో పెట్టి కుళ్ళబొడవమనండి.

అప్పటిదాకా, కాంగీరేసుల్తో అన్ని అధికార, అనధికార సమావేశాల్నీ బహిష్కరించండి.

యేం జరుగుతుందో చూడండి.
 

Monday, July 19

అంతర్రాష్ట్ర....

.....దురన్యాయం
"మేమేమైనా టెర్రరిస్టులమా? బాంబులూ తుపాకులూ తెచ్చామా? ఇక్కడకి రావడానికి పాస్ పోర్టూ, వీసా కావాలా? ప్రాజెక్ట్ చూస్తే తప్పేమి వుంది? యెందుకు అరెస్టు చేస్తారూ?"
ఇవీ చంద్రబాబు లేవనెత్తిన ప్రశ్నలు. అన్నీ సబబుగానే వున్నాయి కదా?

జరిగే పనులూ, గొడవలూ జరుగుతూనే వుండగా, ఈయన యేమి సాధిద్దామని అక్కడికి వెళ్ళాడో, ఆ ప్రాజెక్ట్ ని చూడనిస్తే ఆ ముఖ్యమంత్రికేమి నష్టమో--ఇలాంటివన్నీ రాజకీయ రాక్షసులకి తప్ప సామాన్యులకి అర్థం అవుతాయనుకోను.

ఈ విషయాలు పక్కన పెడితే--

ఇదివరకు తెదేపా నేతలు వెళితే, సరిహద్దుల్లో వాళ్ళ జనాలని సమీకరించి, పోలీసులని మోహరించి, వీళ్ళమీద లాఠీలతో వీరవిహారం చేశారు.

ఇప్పుడు కూడా, నిన్న (18-07-2010) పోలీసులకి కొంత బిజీ తగ్గాక, మీడియా వాళ్ళని యేదో వంకతో వాళ్ళ రాష్ట్రం లో కొంత దూరం తీసుకెళ్ళి, వాళ్ళు వెనక్కీ ముందుకీ కదలడానికి వీల్లేకుండా చేసి, అదే సమయం లో సరిహద్దుల్లో అందోళన చేస్తున్న జనాలనీ, మీడియా వాళ్ళనీ--చితక బాదారు. మన రాష్ట్రం లో చాలా దూరం లో పొలం పనులు చేసుకుంటున్నవాళ్ళని కూడా బాదారుట.

మామూలుగా కూడా యెవరినీ ఆ సరిహద్దు దాటకుంటా కట్టడి చేసేశారు ఇన్నాళ్ళ నించీ!

ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి, వాళ్ళ అధినేత్రి దగ్గరకి వెళ్లి, ఇంకా కొన్ని మెలుకువలు నేర్చుకొని మరీ వచ్చారట.

నా దృష్టిని ఆకర్షించిందేమిటంటే, పత్రికలవాళ్ళతో 'మహారాష్ట్రకి స్వయం ప్రతిపత్తి గురించి మా మధ్య మాటలు జరగలేదు' అని ఆయన అన్నాడట.

ఇవన్నీ చూస్తుంటే, సమీప భవిష్యత్తులోనే, రాష్ట్రాలు కూడా--(దేశం నుంచి) "సోదరుల్లా విడిపోదాం" అనే పరిస్థితి దాపురించేందుకు ఆ పార్టీ పెద్ద యెత్తున కుట్ర చేస్తోందేమో అనిపిస్తూంది.

మరి యేమవుతుందో! 

Friday, July 16

వినోదం

మానసికానందం

శివ గారి సాహిత్యాభిమాని లో పైరసీ గురించి టపా చూశాక, ఇది వ్రాయాలనిపించింది.

మొన్న AVS టపా మీద నా టపా లో '............చిరాకు వచ్చింది' అని వ్రాస్తే, యెవరైనా అడుగుతారేమో అనుకున్నాను--యెందుకు? అని.

ఇదివరకు థియేటర్లో సౌండ్ సిస్టం లో ఓ విప్లవం 'dts' సౌండ్. పాత సౌండ్ సిస్టం ల కన్నా చాలా స్పష్టం గా వినిపించి, వినడానికి ఆహ్లాదం గా వుండేది.

తరవాత వచ్చిన 'డాల్బీ' సిస్టం తోనే వచ్చింది తంటా.

సాహిత్య అభిమాని బ్లాగులో చెప్పినట్టు, పాటలు వస్తే విపరీతమైన సౌండ్ రావడం, యెవరో తలుపు తోస్తే, చెవులు చిల్లులుపడే శబ్దం రావడం--ఇలాంటివి. ఇంకా ఓపక్క స్పీకర్లని రెండో మూడో ఆఫ్, ఆన్ చెయ్యడం లాంటివి స్వయం గా చేస్తున్నారో, ఆటోమేటిక్ గా ఆ సిస్టం లో అవుతాయో నాకు ఇప్పటికీ తెలియదు.

ఇక మాడరన్ ట్రెండ్ అంటే, దుబాయ్ వాళ్ళ ట్యూనులని దిగుమతి చేసుకొని, పాడే వాళ్ళ గొంతుల్ని నొక్కేసి, అదేదో సీనారేకు మీద దువ్వెన్న తో గీకితే వచ్చే కీచు గొంతుకలా రికార్డు చెయ్యడం, అన్నిభాషలనీ మిక్స్ చేసేసి, యేదో పాడించేసి, వెనకాల సోఁయ్ సోఁయ్, అనో, డోఁయ్, డోఁయ్ అనో, ఈఁ ఈఁ ఈఁ అనో, ఊఁ ఊఁ ఊఁ అనో మోతెత్తించడం. 

ఓ సినిమాలో లక్ష్మీపతి గొంతు 'తారురోడ్డు మీద రేకు డబ్బా తో గీసినట్టు వుంటుంది' అనిపించారు--హాస్యం గా బాగానే వుంది. 

మరి సంగీతం లో ఈ వెర్రి తలలు యేమిటో!

శ్రీ రామదాసు సినిమాని ఎంజాయ్ చెయ్యలేకపోడానికి సౌండ్ సిస్టం మొదటి కారణం. 

కథని వక్రీకరించడం రెండో కారణం.

మూడోది--హాస్య తొట్టి గ్యాంగ్. ముఖ్యం గా జయప్రకాష్ రెడ్డి--ఆయన లేకుండా వుంటే సినిమా ఇంకా చాలా బాగుండేది.

పాత భక్త రామదాసులో తానీషా--శ్రీ పసల సూర్యచంద్ర రావు--ని ఓ సారి చూడండి యెక్కడైనా దొరికితే!

(ఇదివరకు అదే కథ తో మళ్ళీ తీసిన సినిమా విడుదల అయితే, దాంతోపాటు పాత సినిమాని కూడా విడుదల చేసేవారు--ప్రేక్షకులు రెండూ కంపేర్ చేసుకుంటారనే వుద్దేశ్యం తోనేమో! ఉదా:- కొత్త దేవదాసు, పాత దేవదాసు)

మళ్ళీ ఇంకోసారి.

Sunday, July 11

సినీ పరిశ్రమ

పైరసీ

డియర్ AVS!


లక్కీగా ఆర్టిస్ట్ అవడం కాదు--లక్కీగా హిట్ అవడం. ఇక బ్యాంకింగ్ రంగం లో లక్ యెలా వుంటుందో నాకు తెలియదు.

ఇక రొయ్యల చెరువులూ, చేపల చెరువులూ, పొగాకు చుట్టలూ, బీడీలు పరిశ్రమల్లో కోట్లు సంపాదించి, సినిమాలు తీసి, వందల కోట్లు సంపాదించాలనుకున్నవాళ్ళు యేమయ్యారో, మీకు తెలిసేవుంటుంది.

పైరసీవల్ల సినిమా పరిశ్రమ నష్టపోతూంది అనేదానికి అన్నానుగానీ, వ్యక్తిగతం గా మీ సినిమాలు ఢాం అంటే, నాకు 
సంతోషం కాదు కదా? 

'యేవి మంచి సినిమాలో తెలియాలంటే.......'--అఖ్ఖర్లేదు. మీరన్న "అల్లూరి సీతారామ రాజు" సినిమా చూసి బయటికొస్తున్న నన్ను అభిప్రాయం అడిగితే, "పిక్చర్ ఆఫ్ ది డికేడ్" అని చెప్పాను. 

మళ్ళీ హాస్యం గా అంటున్నారా అని అడిగినవాళ్ళకి, "ఇది నిజం" అని నొక్కి చెప్పాను.

ఇప్పటికీ అది "పిక్చర్ ఆఫ్ ది మిలీనియం" గా వుంది. 

రండి, యెన్ని పైరసీ సీడీలు విడుదల చేస్తారో--థియేటర్ లోనూ రిలీజు చెయ్యండి.....కలెక్షన్లు యెలా వుంటాయో చూడండి.

దాదాపు 20 యేళ్ళ తరవాత మళ్ళీ థియేటరు కి వెళ్ళి, "శ్రీ రామదాసు" చూశాను--చిరాకు వచ్చింది అంటే నమ్మరేమో మీరు!

ఇక ఇండస్ ట్రీ గురించీ, వాల్ పోస్టర్లు అంటించేవాళ్ళగురించీ, యెవరెంత బాధపడినా, కొన్ని అనివార్యం.

ఈ రోజు బ్లాగుల్లో చూస్తున్నట్టు, ఒకప్పుడు వెలిగిన రేడియో మెకానిక్ లు యేమి చేస్తున్నారు? ఆడియో క్యాసెట్లూ, రికార్డర్లూ, టూ ఇన్ వన్ లూ, వీడియో ప్లేయర్లూ, రికార్డర్లూ, ఇవన్నీ యేమయిపోయాయి? యెన్ని లక్షలమంది వుపాధి పోగొట్టుకున్నారు? 

గాడ్రెజ్ కంపెనీ తన ఆఖరి టైప్ రైటర్ ఫ్యాక్టరీని కూడా మూసేసిందే? 

చెప్పాలంటే ఇంకా చాలా వున్నాయి--కష్టించేవాడికి ఇది కాకపోతే, మరోటి! 

'.......యెవరూ యేడవరు ' కరెక్టే! కానీ యేమి తీసినా కనీసం నేలటిక్కెట్టు అయినా కొనుక్కొని చూశారు జనాలు! యెందుకంటే అప్పట్లో వాళ్ళకి వున్న ఒకే ఒక్క 'ఎంటర్టెయిన్ మెంట్' అదే కాబట్టి!

ఇప్పుడుకూడా, మేం కోట్లు పెట్టి తీస్తాం, యెంత చెత్తగా వున్నా మీరు వేలు ఖర్చుపెట్టి చూడల్సిందే--తక్కువరేటుకి వచ్చేవి చూడద్దు--అంటే!?? తియ్యడం మానేస్తే పోలా? ఇండస్ ట్రీని మూసేస్తే పోలా?

ఇక--ఈ santhi యెవరో--చిలక పలుకుల్లా లక్ గురించీ, బ్యాంకింగ్ రంగం లో లక్ గురించీ మాట్లాడుతున్నారు. 'తుత్తి ' అన్న ఆయన మేనరిజం 'హిట్' అయ్యింది--సినిమా అంత గొప్పది అంటే నేనొప్పుకోను. మరి నేను వ్యక్తిగత విషయాలేమి చర్చించానో తమరే చెప్పాలి.

WitReal, deepu లాంటి వాళ్ళు తెలుగు వ్రాయగలిగీ, ఇంగ్లీ-తెలుగు లో యెందుకు బ్లాగుతున్నారో నాకు తెలీదు.