Monday, November 21

కొలతలూ......3



......మానాలూ

ఇంకా, దమ్మిడీనే 'పైస' అని కూడా అనేవారేమో. యాగాణీ అంటే రెండు పైసలు అనుకుంటా. (ఈ నాణాలు నేను చూడలేదు. యెన్ని గవ్వలైతే ఒక పైసాగా పరిగణించేవారో కూడా నాకు తెలీదు).  

అప్పట్లో, పెద్ద కాణీలు, జార్జి 5 త్ కింగ్-ఎంపరర్ బొమ్మతో వుండేవి. ఆయన భారతదేశానికి వచ్చినప్పుడే "గేట్ వే ఆఫ్ ఇండియా" ఆయనకి స్వాగతం చెప్పడానికి అప్పటి బొంబాయిలో నిర్మించారు(ట). విశ్వకవి రవీంద్రుడు ఆ సందర్భంగానే, "జనగణమన" వ్రాశాడు అని కొంతమంది వ్రాసిన చరిత్ర!  

రెండో ప్రపంచ యుధ్ధం రోజుల్లో, పొదుపు కోసం చిన్న సైజు కాణీలూ, తరవాత "చిల్లు కాణీలు" ప్రవేశపెట్టారు. అంటే యేమీలేదు--కాణీలో మధ్యభాగాన్ని తొలగించి, అంచుమాత్రమే ముద్రించేవారు. ఆ కాణీలని పిల్లల మొలత్రాళ్లలో కూడా కట్టేవారు--దిష్టి తగలకుండా(ట)! 

తరవాత, జార్జి 6 త్ తో కూడా కాణీలు ఇతర నాణాలూ వచ్చాయి. స్వతంత్రం వచ్చాక, ఆ చిన్న కాణీల మీద  పరుగెడుతున్న గుర్రం బొమ్మ ముద్రించేవారు.

కాణీ పైన వుండే అర్థణా దగ్గరనుంచీ, రూపాయి వరకూ చివర 'కాసు' చేర్చేవారు--అర్థణాకాసు, అణాకాసు......ఇలా. 

ఇంకా, అణాకాసుని 8 వృత్తాకార కోణాలతో, వెనుకవైపు చక్కటి డిజైన్ మధ్య ఇంగ్లీషులో వన్ అణా అనీ, తెలుగులో ఒక అణా అనీ ముద్రించేవారు! ఇవి దేశవ్యాప్తంగా చలమణీలో వుండేవి అని మరిచిపోకండి--అదీ అప్పట్లో తెలుగుకి వున్న గుర్తింపు. 

ఇప్పుడు ఒక రూపాయి, రెండు రూపాయలూ, ఐదు రూపాయలూ నాణాలన్నీ ఒకే సైజులో గుండ్రంగా ముద్రించేబదులు, ఇలా చక్కటి డిజైన్లలో ముద్రిస్తే యెంత బాగుండును? మళ్లీ అలాంటి అందమైన నాణాలని చూడగలమా? దువ్వూరివారేమంటారో! 

ఇంక, అణా కి 12 పైసలు. రూపాయికి 16 అణాలు--అంటే, రూపాయికి 192 పైసలు. 

లెఖ్ఖల్లో, 1000 పైసలని, రూపాయలూ, అణాలూ, పైసలూ లోకి మార్చమనీ--ఇలా మా ప్రాణాలు తీసేవారు! (మీరెవరైనా చెయ్యగలరేమో ప్రయత్నించండి!)

(బ్రిటిష్ వాళ్ల పౌండ్ కి 20 షిల్లింగులు, ఒక్కో షిల్లింగుకి 12 ఓ 16 ఓ పెన్నీలు వుండేవి. ఆ లెఖ్ఖలు కూడా మమ్మల్ని చంపేవి! తరవాత వాళ్లు కూడా పౌండ్ కి 100 పెన్నీలుగా మార్చుకున్నారు--ఇంటర్నేషనల్ కరెన్సీగా మారాక)

ఇంకో చిత్రమేమిటంటే, నిజాం పాలనలోనేకాదు....మనకి స్వతంత్రం వచ్చాకా, నిజాం రాష్ట్రం మన దేశంలో విలీనం చెయ్యబడ్డాక కూడా, "తెలంగాణా వంద" చాలకాలం చెలామణీలో వుండేది. అంటే వంద వస్తువులు అంటే వాళ్ల లెఖ్ఖ 192!

(మా పెద్ద దొడ్డ, పెళ్లికాగానే భర్తతో నిజాం పాలనా కాలంలోనే హైదరాబాదు వెళ్లిపోవడంతో పక్కా తెలంగాణా భాషా, యాసా, కట్టూ బొట్టూ, ఆచారాలు వచ్చేశాయి ఆవిడకి. ఆవిడ, మనకి ఆవకాయలకోసం మామిడికాయలు 'మన వంద' 3 రూపాయలకి ఇస్తున్నారంటే, "మాకూ మూడు రూపాయలే--కానీ, తెలంగాణా వంద! ముక్కలు కొట్టి కూడా ఇస్తారు!" అని మా అమ్మని వుడికించేది! తనకి పిల్లలు చిన్నగా వున్నప్పుడే భర్తృవియోగం కలగడంతో, ఆవిడే మార్కెట్ కి వెళుతూండేది. తేడా అల్లా ఆవిడ చెప్పులు వేసుకొనేది కాదు. దాంతో మార్కెట్లో అందరూ "ఆంధ్రావాలీ" అని గుసగుసలు పోయేవారట. పిల్లలైతే, గేలి చేస్తున్నట్టుగా చిత్రంగా చూస్తూ వెనుకబడేవారట! అలా అని ఆవిడని యెవరూ అవమానించడమో, వివక్ష చూపడమో జరిగేది కాదట! ఇప్పటి "ప్రత్యేక తెలంగాణా వాదులకి" ఈ విషయాలు తెలుసోలేదో మరి)

యెక్కడో ములిగి యెక్కడో తేలాం అనుకుంటా. 

కరెన్సీ, నాణాలూ గురించి ఈ మాత్రం చాలనుకుంటా.

.....కొనసాగింపు మరో టపాలో

కొలతలూ......2



......మానాలూ

మనదేశంలో 20వ శతాబ్దం మొదట్లో కూడా, గవ్వలకి కూడా (చిల్లి గవ్వలకీ, గుడ్డి గవ్వలకీ కూడా!) విలువ వుండేది!

ఢిల్లీ పరిపాలకుడు షేర్షా సూరీ అనుకుంటా--దేశం మొత్తమ్మీద "నాణాలని" ప్రవేశపెట్టాడు. 

సముద్ర గుప్తుడూ వగైరాలు అప్పట్లో బంగారునాణాలు చలామణీలోకి తెచ్చారు.

బ్రిటీష్ వాళ్లు ద్రవ్యం "లీగల్ టెండర్" ప్రవేశపెట్టి, నాణాలూ, నోట్లూ ముద్రించేవారు (అంతకు ముందు నోట్లు లేవు--ఒక్క తుగ్లక్ విడుదలచేసిన 'తోలు' నోట్లు తప్ప!).

మా చిన్నప్పుడు "విచ్చు రూపాయి" అని ఖచ్చితంగా ఒక్క తులం వెండితో ఒక రూపాయి నాణాలు వుండేవి. ఒక సారి మా వైజయంతీ హాలులో నేను సినిమా టిక్కెట్లు తీసుకొన్నప్పుడు చిల్లర తిరిగి ఇస్తూ, ఓ వెండి రూపాయిని కూడా మామూలు వాటితో ఇచ్చేశాడు. (అది ఇప్పటికీ మా అమ్మగారు తన డబ్బుల పెట్లో జాగ్రత్త చేశారు!)

మహమ్మదీయ రాజులు ప్రవేశపెట్టిన నాణాల్లో అతి చిన్నది "దమడీ" (దమ్మిడీ) అనుకుంటా. తరవాత కాణీ, యాగాణీ--ఇలా వుండేవనుకుంటా నాణాలు. (దమ్మిడీ ముండకి యాగాణీ క్షవరమా? అనే సామెత అప్పుడు పుట్టింది--ఇప్పటికీ వాడుకలో వుంది!)

నా చిన్నప్పటి నాణాలూ, నోట్లూ విషయానికొస్తే.......

ద్రవ్యానికి (డబ్బుకి) మానం :

2 కాణీలు = ఒక అర్థ అణా
2 అర్థణాలు = ఒక అణా
2 అణాలు = ఒక బేడ
2 బేడలు = ఒక పావలా
2 పావలాలు = ఒక అర్థ రూపాయి
2 అర్థరూపాయలు = ఒక రూపాయి

ఒకరూపాయి నాణాలూ, నోట్లూ కూడా వుండేవి. తరవాత రెండూ, ఐదూ, పదీ, వందా, వెయ్యీ--మాత్రమే నోట్లు వుండేవి. పాత సినిమాల్లో ఇవన్నీ చూడొచ్చు.....వినొచ్చు!  

.....కొనసాగింపు మరో టపాలో

Sunday, November 20

కొలతలూ......


(వీ సాంబశివరావు అనే ఒకాయన భాగవతం మీద రీసెర్చ్ చేసి, సాంఖ్య శాస్త్రంలో యెంతో కృషి చేస్తున్నారు. ఆయన నన్ను మన పాతా, కొత్తా, మానాలు, కొలతలగురించి, వాటిని
"మార్చడం" గురించీ "సూత్రాల"కోసం అడిగారు. చాలా సంతోషం. అందుకే ఈ టపాలు. వీటిల్లో యేమైనా తప్పులు వ్రాసినా, విజ్ఙ్ఞులు నా దృష్టికి తీసుకురావాలని నా మనవి.)

మా చిన్నప్పుడు = ఈ గుర్తుని "ఈజ్ ఈక్వల్ టు" అంటే "ఖచ్చితంగా సమానం" అని వ్యవహరించేవారు. అప్పటికి నానోలు కాదుకదా, మైక్రో వగైరాలు కూడా లేవు. డెసిమల్ స్థానాల్లో కూడా మొదటి రెండింటినీ గుర్తించి, మిగిలినవి వదిలేసేవారు. తరవాత్తరవాత, ఇంకా ఖచ్చితమైన లెఖ్ఖలు అవసరం పడడంతో, మా పిల్లల చదువులు వచ్చేసరికి, అదే గుర్తుని "ఈక్వల్స్" అనడం మొదలెట్టారు--అంటే "సమానం అవుతుంది" అని! అంతేగానీ, ఖచ్చితంగా సమానం అని కాదు!

మరి నిజమేకదా?

బ్రిటిష్ వాళ్లనుంచి మనకి స్వాతంత్ర్యం వచ్చాక పది పన్నెండేళ్లవరకూ వాళ్ల ఎఫ్.పీ.ఎస్ పధ్ధతినే (ఫుట్; పౌండ్; సెకండ్) అనుసరించేవారు మనదేశంలో. 1959 లో అనుకుంటా "మెట్రిక్" పధ్ధతి సీ.జీ.ఎస్ (సెంటీ మీటర్; గ్రామ్; సెకండ్) కి మార్చారు మన ప్రభుత్వంవారు. అప్పుడే "నయా పైసా"లు వచ్చాయి. తరవాత ఇందిరాగాంధీ టైములో అనుకుంటా, "నయా" తొలగించారు!

మనదేశంలో అప్పటి కొలతలకి సంబంధించిన మానం : (ద్రవాలకి కూడా)

2 అరగిద్దలు = ఒక గిద్ద
2 గిద్దలు = ఒక అరసోల
2 అరసోలలు = ఒక సోల
2 సోలలు = ఒక తవ్వ
2 తవ్వలు = ఒక శేరు
2 శేర్లు = ఒక అడ్డ లేదా మానిక
(5 శేర్లు = ఒక వీశ--తూకంలో)
2 అడ్డలు = ఒక కుంచం
24 కుంచాలు = ఒక బస్తా

దూరానికి మానం :

12 అంగుళములు = ఒక అడుగు
3 అడుగులు = ఒక గజము
220 గజములు = ఒక ఫర్లాంగు
8 ఫర్లాంగులు = ఒక మైలు

అప్పటి "తూకాలకి" సంబంధించిన మానం ఇదివరకు నా టపా.....

http://krishnasree.blogspot.com/2008/11/4-2-1-2-1-2-2-1-2-1-2-1-2-1-8-1-20-1.html

లో వ్రాశాను.

.....కొనసాగింపు మరో టపాలో

కొనసాగింపు.....


మానాల గురించి

(వీ సాంబశివరావు అనే ఒకాయన భాగవతం మీద రీసెర్చ్ చేసి, సాంఖ్య శాస్త్రంలో యెంతో కృషి చేస్తున్నారు. ఆయన నన్ను మన పాతా, కొత్తా, మానాలు, కొలతలగురించి, వాటిని "మార్చడం" గురించీ "సూత్రాల"కోసం అడిగారు. చాలా సంతోషం. అందుకే ఈ టపాలు. వీటిల్లో యేమైనా తప్పులు వ్రాసినా, విజ్ఙ్ఞులు నా దృష్టికి తీసుకురావాలని నా మనవి.) 

మా చిన్నప్పుడు = ఈ గుర్తుని "ఈజ్ ఈక్వల్ టు" అంటే "ఖచ్చితంగా సమానం" అని వ్యవహరించేవారు. అప్పటికి నానోలు కాదుకదా, మైక్రో వగైరాలు కూడా లేవు. డెసిమల్ స్థానాల్లో కూడా మొదటి రెండింటినీ గుర్తించి, మిగిలినవి వదిలేసేవారు. తరవాత్తరవాత, ఇంకా ఖచ్చితమైన లెఖ్ఖలు అవసరం పడడంతో, మా పిల్లల చదువులు వచ్చేసరికి, అదే గుర్తుని "ఈక్వల్స్" అనడం మొదలెట్టారు--అంటే "సమానం అవుతుంది" అని! అంతేగానీ, ఖచ్చితంగా సమానం అని కాదు!

మరి నిజమేకదా?

బ్రిటిష్ వాళ్లనుంచి మనకి స్వాతంత్ర్యం వచ్చాక పది పన్నెండేళ్లవరకూ వాళ్ల ఎఫ్.పీ.ఎస్ పధ్ధతినే (ఫుట్; పౌండ్; సెకండ్) అనుసరించేవారు మనదేశంలో. 1959 లో అనుకుంటా "మెట్రిక్" పధ్ధతి సీ.జీ.ఎస్ (సెంటీ మీటర్; గ్రామ్; సెకండ్) కి మార్చారు మన ప్రభుత్వంవారు. అప్పుడే "నయా పైసా"లు వచ్చాయి. తరవాత ఇందిరాగాంధీ టైములో అనుకుంటా, "నయా" తొలగించారు! 

మనదేశంలో అప్పటి కొలతలకి సంబంధించిన మానం : (ద్రవాలకి కూడా)

2 అరగిద్దలు=ఒక గిద్ద
2 గిద్దలు=ఒక అరసోల
2 అరసోలలు=ఒక సోల
2 సోలలు=ఒక తవ్వ
2 తవ్వలు=ఒక శేరు
2 శేర్లు=ఒక అడ్డ లేదా మానిక
(5 శేర్లు=ఒక వీశ--తూకంలో)
2 అడ్డలు=ఒక కుంచం
24 కుంచాలు=ఒక బస్తా

దూరానికి మానం :

12 అంగుళములు = ఒక అడుగు
3 అడుగులు         = ఒక గజము
220 గజములు     = ఒక ఫర్లాంగు
8 ఫర్లాంగులు        = ఒక మైలు

అప్పటి "తూకాలకి" సంబంధించిన మానం ఇదివరకు నా టపా.....


లో వ్రాశాను.

.....కొనసాగింపు మరో టపాలో

Wednesday, November 16

బాలల.......



......చదువులు

బాలల దినోత్సవం రోజున--14-11-2011 న--ఈనాడులో శ్రీధర్ కార్టూన్....కాస్త నవ్వు పుట్టించినా, కళ్లనీళ్లు గిర్రున తిరిగాయి. అందులో....

ఓ పిల్లాడు ప్రథానిని "అప్పుడు పేదవాళ్లకు లాంతర్లూ, కిరోసిన్, పుస్తకాలూ, చదువూ....అందుబాటులో వుండేవా సార్?" అని అమాయకంగా, దీనంగా, హాచ్చెర్రెంగా అడుగుతున్నాడు!

నిజంగా, తన తలపాగాని అలాగే వూడదీసి, ఆ చిప్పలో నీళ్లు నింపుకొని, అందులో దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనిపించాలాయనకీ.....అది చూస్తే.

"మీరలా అనడాన్‌కి గుట్కా లేదు....రూల్స్ వొప్పుకోవు.....మన అధిష్టానమ్మ పెర్మిషన్ లేకుండా అలాంటి నిర్ణయాలు దీసుకోరాదు. కోర్ కమిటీలో చర్చించాక, మీకు ఆదేశాలిస్తాం...అంతవరకూ, తలపాగా తగిలించేస్కొని, వెయిట్ చెయ్యండ్రి" అని కి కు రె అన్నట్టు ఆయనకి వినిపించిందేమో! ఆయన ఆ పని చెయ్యడానికి ప్రయత్నించలేదు. 

నా అయిదో యేట, విజయదశమినాడు, మా నాన్నగారి ఆధ్యాత్మిక గురువు చల్లా కృష్ణమూర్తి శాస్త్రి (ఆయనపేరే నాకు పెట్టారు.) చేత నా అక్షరాభ్యాసం మొదలై, అదేరోజు, జీడీఎం (గోదావరి డెల్టా మిషన్) ఎలిమెంటరీ స్కూలుకి (పసుపుగోచీ అలాగే వుంచుకొని, దానిమీద నిక్కరు చొక్కా వేసుకొని, చంకలో పలకతో, అప్పటికే ఆ స్కూల్లో చదువుతున్న మా అన్నయ్య స్నేహితులతో, పరుగు పరుగున స్కూలుకి వెళ్లడం నా కళ్లకి కట్టినట్టు కనిపిస్తూంది....ఇప్పటికీ!) వెళ్లి, ఒకటో తరగతిలో, పిల్లలందరికీ పప్పు బెల్లాలూ, కణికలూ, ఐదారుమందికి పలకలూ, సీనియర్ విద్యార్థులకి యెక్కాల పుస్తకాలూ పంపిణీ పూర్తయ్యాక, మరియా టీచర్ నా పలక మీద "అ, ఆ" అని వ్రాసిచ్చి దిద్దుకోమని చెప్పడం, వెనుక ఖాళీగావున్న ఓ "నేలబల్ల" మీద కూర్చొని, నేను దిద్దడం మొదలెట్టడం...పావుగంటైనా నేను దిద్దుతూనే వుండడం...ప్రక్కనున్నవాడు 'తీసుకెళ్లి టీచరుకి చూపించు' అనడం, నేను (అప్పటికే ఆవిడ చుట్టు మూగి వున్న పిల్లల్లో కాస్త చోటుచెసుకొని) పట్టుకెళ్లి  చూపించడం, ఆవిడ అవి చెరిపేసి, మళ్లీ "అ, ఆ" లు వ్రాసిచ్చి దిద్దమనడం.....నా మూడో యేటనే అ ఆలు నేర్చేసుకొని వుండటంతో ఆ "చదువు"ని ఎంజాయ్ చెయ్యడం.....! ఇవన్నీ ఇప్పటికీ "డేజావూ" నాకు!

.......మరోసారి.