Sunday, February 28

చరిత్ర

వ్యాఖ్యానాలు


వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు.

నా టపాలో వుదహరింపబడిన 1946 లో జరిగిన అసెంబ్లీ యెన్నికలు మనకి స్వాతంత్ర్యం రాకముందు, ఆంధ్ర ప్రదేశ్ యేర్పడకముందు, అప్పటి (ఉమ్మడి) మదరాసు రాష్ట్రానికి జరిగినవి.

మనదేశం లో 'గవర్నమెంట్ ఆఫ్ ఇండియా' ఆక్టు ప్రవేశపెట్టబడినప్పటినించీ, రాష్ట్రాలకి ప్రతి 5 యేళ్ళకోసారి తప్పకుండా యెన్నికలు జరిగేవి. 

నేను చెప్పానని బాధపడకుండా, మీరు చదివిన స్వాతంత్రోద్యమ చరిత్రనీ, గాంధీ, నెహ్రూ, పటేల్, టంగుటూరి, తెన్నేటి మొదలైన వారి జీవిత చరిత్రలూ గుర్తు చేసుకోండి!

చదవని వాళ్ళు చదవడానికి ప్రయత్నించండి!


డియర్ oremuna!

గాంధీకి అంతనమ్మకంగా చెప్పినవాళ్ళెవరో కూడా మీకు తెలిసేవుంటుందంట! మరి చెప్పరూ?

అదెంత నిజమో అదికూడా చెప్పరూ?

(నా ఈ బ్లాగులో యెందుకో నా కామెంట్లు ప్రకటించబడడం లేదు. అందుకనే ఇలా వేరే టపా గా వ్రాస్తున్నాను. అన్యథా భావించవద్దు. యెవరికైనా కారణం తెలిస్తే, చెపితే సంతోషిస్తాను!)

No comments: