Sunday, March 7

ప్రభుత్వ పథకాలు

జా.గ్రా.ఉ.హా. పథకం

గ్రామాల్లో పనులు లేని సమయం లో కూలీలకు ఉపాథికి భరోసా ఇవ్వడానికి ఈ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకం ప్రవేశపెట్టారు.

దీని వుద్దేశ్యం కూలీలకు ఉపాథి దొరకని రోజుల్లో, ప్రభుత్వం కనీసం 100 రోజులపాటు తనే పని కల్పించి, వారికి కూలీ చెల్లిస్తుంది.

మంచి పథకమే కదూ?

విచిత్రమల్లా, ఈ పథకం యెక్కడా సరిగా అమలు కావడం లేదు.

ఉదాహరణకి, ఓ మండలం లో గత యేడాది 293 పనులు యెంపిక చేస్తే, ఒక్కపనీ ఇప్పటివరకూ ప్రారంభం కాలేదట.

మళ్ళీ ఈ యేడాది మరో 353 పనులు యెంపిక చేశారట.

మరి ఇటీవల అదనపు సం యుక్త కలెక్టర్ గా వచ్చిన ఎం. వి. శేషగిరిబాబు, ఈ పనులన్నీ వెంటనే ప్రారంభించి పూర్తి చెయ్యాలని అదేశాలు ఇచ్చి, వాటి అమలుకోసం ప్రతి రోజూ సమీక్షిస్తూ, క్రింది అధికారుల సెల్ ఫోనులకి ఫోన్లు చేస్తున్నారట.

ప్రస్తుతం ఆ మండలం లో కూలీలకు పుష్కలం గా ఉపాథి దొరుకుతోందట--ముమ్మరం గా జరుగుతున్న వ్యవసాయ పనుల వల్ల.

మరి మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులు యేం చేస్తారు?

ఆ పనుల్లో వున్నవారినే వేటాడి, కొంతమందిని బ్రతిమలాడి, యెక్కువ డబ్బులిస్తామని చెప్పి, కొన్ని పనులు ప్రారంభింప చేశారట.

అవి పూర్తయ్యేదెప్పుడో?

గణాంకాలు మాత్రం, ఈ నెలలో ఇన్ని పనులు ప్రారంభించాం అంటూ ప్రభుత్వానికి చేరి పోయాయి!

పథకాలు వర్థిల్లు గాక!

No comments: