Saturday, October 16

మన ఋణ వ్యవస్థ

"సూక్ష్మ" ఋణాలు - 5


"ఇదేదో రొచ్చు గుంటలా కనపడుతోందే.......అది కూడా 'పేధ్ధది '........భలే బాగుంది.......రండ్రా.......అందరూ చేపలు పట్టేద్దాం!" అంటూ తయారయిపోతున్నారు మన రా నా లు. 

ఒకడేమో, "ఈ సూ ఋ సంస్థల 'యజమానుల్ని వురి తీయాలి', వీళ్లకీ రాహుల్ కీ సంబంధమేమిటో తేల్చాలి" అంటాడు.

ఇంకోడేమో, "దీనంతటికీ చంద్రబాబుదే బాధ్యత...వాడిని వురి తీయండి" అంటాడు.

మరోడు, వసూలు కోసం వచ్చే వాళ్లని "చీపురుకట్టలు తిరగేసి" తరిమి కొట్టండి--అంటాడు.

సామాన్యుడంటాడూ--"వొరే! మీ చుట్టాలూ, తైనాతీలూ నూటికీ నెలకీ మూడు రూపాయల వడ్డీకిచ్చి, వసూలుకోసం వచ్చినాళ్లని ప్రజలు "చీపురుకట్టలతో" తరిమికొట్టాలేంట్రా?" అని!

యెవడి గోల వాడిది!

ఈ లోపల రాష్ట్ర ప్రభుత్వం (మాననీయ ముఖ్యమంత్రి రోశయ్య) గురువారం (14-10-2010) న మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి వర్గం భేటీ అవుతుంది అని ప్రకటించారు.

ఆయన బుధవారం రాత్రే, బ్యాంకరులు, కొందరు మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు(ట). ఈ సమావేశం లో, ము మం "బ్యాంకులనుంచి సకాలం లో ఋణాలు అందకపోవడం, అందినవి అవసరాలకు యేమాత్రం సరిపోవకపోవడం" వల్లే, సూ ఋ సంస్థలు విజృంభించాయంటే....

బ్యాంకర్లు, "బహుళ ఋణాల వూబిలో ఇరుక్కోవడం వల్లే 'పావలా వడ్డీ' ఋణాలని సహితం పేదలు సకాలం లో చెల్లించలేకపోతున్నారు" అన్నారట! (నిజానిజాలు ముంజేతి కంకణమేగా!)

గురువారమే (14-10-2010) సమావేశామవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ ఎల్ బీ సీ) నిర్ణయించిందట! 

ఈ ఎస్ ఎల్ బీ సీ కి సారధ్యం వహించేది రాష్ట్రం లో లీడ్ బ్యాంకు గా వ్యవహరిస్తున్న బ్యాంకే! (నిజానికి ఈ లీడ్ బ్యాంకుల వ్యవహారం, అడాప్టెడ్ విలేజీల వ్యవహారం, బ్యాంకు శాఖలని తెరుచుకొని, మూసుకొనే వ్యవహారం, వడ్డీ రేట్ల వ్యవహారం, ఏ టీ ఎం లని యేర్పరచుకొనే వ్యవహారం--ఇలాంటి వాటినన్నీ రిజర్వ్ బ్యాంకు యెప్పుడో పది పన్నెండేళ్ల క్రితమే యెత్తేసింది!)

కా......నీ....ఈ బ్యాంకులలో వుండే (ఇసుమంతైనా అవగాహన లేని) "బ్యూరోక్రాట్లు" అన్ని విషయాలనీ "రిజర్వ్ బ్యాంకు" మీదకి తోసేస్తూంటారు! వారి చేతికి మట్టి అంటుకుంటుందేమో అని భయంతో!

ఫైనల్ గా, చివరాఖరికి మన లాంటి వాళ్లు యెంత మోసపోతున్నామో తెలుసుకోడానికి--ఈనాడు ఆదివారం అనుబంధం లో (10-10-10) న ప్రచురితమైన 'ఉమాబాల చుండూరు ' వ్రాసిన "అపాత్రదానం" కథ చదవండి.

ఇందులో ఒకావిడ, వాళ్ల పనిమనిషి మీద జాలిపడి, (వాళ్ల నాన్న తనకి ఇచ్చిన, తను అపురూపంగా దాచుకొంటున్న 1500 రూపాయల సొమ్ముని) ఆమె యేడో క్లాసు చదివే కూతురుకి పుస్తకాల నిమిత్తం దానం చేసేస్తుంది! 

ఆ తరవాతోరోజు, ఆ పని మనిషి, "మా అమ్మాయి పెద్దమనిషి అయిందటమ్మా!" అంటే, ఆవిడకి అమాంతం సెలవిచ్చేసి, 'పసుపూ, కుంకం, చీరా, జాకెట్టు గుడ్డా వున్న కవరునిచ్చేసి' ఆనందిచిన ఆ "మధ్య తరగతి" అమ్మ, క్రింది తరగతి కి చెందిన పని మనిషి చేసిన "ఖర్చులని" చూసి (విని) మూర్చపోయినంత పని చేసి "అయ్యో! అపాత్రదానం చేశానా?" అనుకుంటుందట!

అదండీ సంగతి!



No comments: