Friday, May 20

మా మూడో హనీమూన్ అనే.......-10



మొన్నటి మా యాత్ర

# పటౌడీ--ఇదొక పట్టణం. ఓ కోట, అందులో మహమ్మదీయ నవాబులతో పరిపాలించబడేది. బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని పరిపాలిస్తున్నరోజుల్లోనే, ఈ కోట ఓ వెలుగు వెలిగింది. ఆ రోజుల్లో పటౌడీ నవాబు "అఖ్తర్ ఆలీ ఖాన్" (సీనియర్ పటౌడీ అంటారు) మన దేశ క్రికెట్ జట్టుకి సారధి. (మన తెలుగువాడు సీ కే నాయుడు కూడా అప్పట్లో మన జట్టుకి సారధి!)పటౌడీ జూనియర్ "మన్సూర్ ఆలీ ఖాన్" కూడా మన క్రికెట్టు జట్టుకి సారధి గా వ్యవహరించాడు. ఆయనే బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా టాగోర్ (ఆవిడ హిందూ--బెంగాలీ) ని వివాహం చేసుకొన్నాడు. నేటి హీరో "సైఫ్ ఆలీ ఖాన్" (వీడు పటౌడీ అని పెట్టుకోలేదెందుకో!) వాళ్ల కొడుకు. 

ఇప్పుడు వాళ్ల పేలస్ ని ఫైవ్ స్టార్ హోటల్ గా మార్చేశారు. అప్పుడప్పుడూ వాళ్లు వచ్చి, అక్కడ బస చేసి వెళుతూంటారట. మేము ఆ కోటని బయటినించే చూశాము. పేలస్ ని చూడ్డానికి ప్రయత్నించాము.

(ఆ విషయాలు ఇంకోసారి.)

ఢిల్లీలోనే సఫ్దర్జంగ్ హాస్పిటల్ దగ్గరలోనే ఓ "ఉడిపీ" హోటెల్ వుంది అనీ, కరోల్బాగ్ ఆర్యనివాస్ తరవాత అంత ఫేమస్ అనీ, అక్కడ టిఫిన్లు చేసి వెళదామనీ మా చెల్లెలు ప్రపోజల్. తీరా డ్రైవరుకి ఆ హోటెల్ రూట్ తెలియదట. తన సెల్ లో తనకి తెలిసున్నవాళ్లందరినీ అడిగేసి, చాలా ఖష్ట పడుతున్నాడు.

నేను, "మాకు ఆకళ్లు లేవు, వద్దులే, ముందు మీ యింటికి చేరే మార్గం చూడు" అనేశాను. 

వాళ్ల వూళ్లో రోజు విడిచి రోజే కరెంటు వుంటుంది. అదీ పగలు వుండదు. అందుకని వాళ్లు ఎల్ పీ జీ తో పనిచేసే గీజరు పెట్టుకొన్నారు. దాంతో వాళ్ల అమ్మాయి వేడి చేసి వుంచిన నీళ్లతో మా స్నానాలకి యేర్పాట్లు చేసేశారు. ఇల్లంతా నీట్ గా సర్ది వుంది. పాపం మా చెల్లెలు పిల్లలూ, వాళ్ల నాన్నా యెంత కష్టపడ్డారో! వాళ్లకి మేము తెచ్చిన కానుకలు అందించేశాము--యెంత సంతోష పడ్డారో--ఆ చిరు కానుకలకే!

అప్పటికి 11-30 అయ్యింది. వాళ్లు నడిపిస్తున్న స్కూల్ హాస్టల్ నించి మాకు టిఫిన్లు తెచ్చేశారు మా బావగారు. పూరీ, కాలీఫ్లవర్/బఠాణీ సబ్జీ. లాగించేశాము.

అక్కడనించీ, "అక్కా! యేమి వండమంటావు?"

"చెల్లీ! సింపుల్గా పప్పు చేసి, చారు పెట్టెయ్యి. వూరగాయలు తెచ్చాము--టమాటా, గోంగూరా, కందిపొడీ, చల్ల మిరపకాయలూ, వడియాలూ......"

"మరి పప్పులోకి యేం వెయ్యమంటావు? టమాటానా, దోసకాయా.....ఇంకా మామిడికాయలు రావడంలేదు మాకు....!"

"అవేమీ వద్దు. ముద్దపప్పు చేసేయ్యి. నేను చల్ల మిరపకాయలూ, వడియాలూ వేయించేస్తాను. వదిన చారు పెట్టేస్తుంది."

"అయ్యో! మీరందరూ అవన్నీ చేసేస్తుంటే, చారు పెట్టలేనా! నేను పెట్టేస్తానమ్మా!" అని మా ఆవిడ.

వంటలు పూర్తయ్యేసరికి 2-00! ఈ లోపల మా బావగారు వాళ్ల స్కూలు హాస్టలు నించి, భోజనం లోకి ఓ యాభై "రోటీ"లూ, క్యాప్సికం/టమాటా కూరా, క్యాబేజీ/ఆలూ కూరా పట్టించుకొచ్చేశారు!

నేనూ, మా కాకినాడ బావగారూ--"అయ్యబాబోయ్!" అనేశాము!

మా కాకినాడ చెల్లెలుకి నేను పెట్టిన పేరు "పెసరట్ల పేరమ్మ". ఆట్లు వేసేసి అందరికీ తినిపించేస్తుంది. తను ఆఖరున యేమైనా మిగిలితే తింటుంది. అలాగే, అందరినీ మాటల్లో పెడుతూ, పనిలోపనిగా అన్నమూ, కూరలూ, పచ్చళ్లూ వగైరా వడ్డించేస్తూ, పీకల్దాకా మింగబెట్టేస్తుంది......మొదటిరోజు అలాగే బలయ్యిపోయాము మా ఇద్దరు బావగార్లతోసహా!

భోజనాలయ్యేటప్పటికి మూడున్నర! నాకు బయట హాల్లో పడకకి ఇచ్చిన మంచం మీద  కొంచెం యెండ పడుతూంటే, నా కాళ్ల సాక్స్ తీసేసి, ఆ యెండలో నా కాళ్లు పెట్టుకొని కాసేపు పడుక్కున్నాను.     

..........ఇంకా తరువాయి.

Wednesday, May 18

మా మూడో హనీమూన్ అనే.......-9



మొన్నటి మా యాత్ర

ఢిల్లీ లో పడ్డాం అని చెప్పనుకదా. అక్కడనుంచీ వెయిటింగ్. రెండుగంటలు దాటిపోయింది. మళ్లీ ఫోను చేస్తే, మా చెల్లెలు "ఇక్కడ హైవేలో పొగమంచు వల్ల ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అరగంటనుంచీ వెయిట్ చేస్తున్నాం. కాసేపట్లో క్లియర్ అయ్యేలా వుంది. ఇంకో గంటలో వచ్చేస్తాను" అని చెప్పింది.

ఇక్కడ చలిలో మా పాట్లు మేము పడుతూ, (మగాళ్లం అరగంటకోసారి కాఫీలు తాగుతూ...ఆడవాళ్లు నడవలేక, కాఫీలు తాగలేక అపసోపాలు పడుతూ) నిరీక్షించాము. 

గంటా గడిచింది. మళ్లీ ఫోను. "ఇంకో అరగంటదాకా క్లియర్ అయ్యేలా లేదు. మీరోపని చెయ్యండి. ఓ టాక్సీ మాట్లాడుకొని మాకు యెదురు వచ్చెయ్యండి!" అని. 

సరే! నేనెలాగూ క్రింద ఎంట్రన్స్ గేటు దగ్గరకీ, వెయిటింగురూముకీ మధ్య తిరుగుతూ, అప్పటికే ఓ అర పెట్టి సిగరెట్లు తగలేశాను. (వెయిటింగు రూములో నిషేధం మరి!) క్రిందకి వెళ్లి టాక్సీ ల కోసం చూస్తూ, అప్పుడే వచ్చి యెవరినో దింపిన ఓ టాక్సీ వాణ్ని (అప్పటికే టాక్సీ స్టాండులో వున్న వాళ్లని అడిగితే, చాలా యెక్కువ డబ్బులు అడుగుతారు) కుదరగడుతూండగా, మళ్లీ ఫోను.

"మా డ్రైవరు చాకచక్యంగా వేరే దారిలో వచ్చేస్తున్నాడు. ఇంక టాక్సీ వద్దు" అని.

యెట్టకేలకి 7-45 కి మా చెల్లెలు, వాళ్ల బావగారి అబ్బాయి, డ్రైవరులతో వచ్చి, అందర్నీ వాటేసుకొని, వాళ్లు మాకు పాదాభివందనాలు చేసేసి, భయంకర అనుభవాలు చెపుతూ, ఆలస్యానికి సారీలు చెపుతూ, "మీకేమీ అసౌకర్యం కలగలేదు కదా?" అని నొచ్చుకొంటూ, సామాను వాళ్ల "బొలేరో" లో వేసి, యెక్కాము అందరూ.

పొగమంచు ఇంకా యెక్కువగా వున్నా, ప్రయాణం బాగానే సాగుతూంది హైవేలో--ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వరకూ. ఇంక "గురుగామ్" దగ్గరకొచ్చేసరికి, జామ్ ఇంకా క్లియర్ కాలేదు. అడ్డం పడినవి అన్నీ "రెడీమేడ్ కాంక్రీటు" వ్యాన్లే--ప్రముఖ కంపెనీలవి! 

మళ్లీ గురుగామ్ వూళ్లోంచి, అడ్డదారుల్లో వెళుతూ, మళ్లీ ఢిల్లీ ఎంట్రన్సు చేరి, ఇంకో కచ్చా రోడ్డు ద్వారా, మారుతీ ఫేక్టరీ, హీరో హోండా ఫేక్టరీ, అనేక రైల్వే స్టేషన్లూ, యార్డులూ దాటుతూ, # "పటౌడీ" చేరేసరికి 9-00 అయిపోయింది. అక్కడనుంచీ, రోడ్డు బాగుంది. వాళ్ల వూరు ఇంక 51 కిలోలే. (ఇంతాచేసి, ఢిల్లీ నుంచి హర్యాణాలో వున్న వాళ్ల వూరు "షేర్ పూర్" కేవలం 150 కిలోలు మాత్రమే!)

9-30 కల్లా వాళ్ల వూరు, వాళ్లింటికి చేరాం.

బొలేరో దిగి, ఇంట్లోకి వెళుతూ, అలవాటు చొప్పున బయట చెప్పులు వదిలేసి, ఇంట్లో అడుగుపెట్టానా.....అరికాళ్ల దగ్గరనించి తొడలదాకా "ఫ్రీజ్" అవడం మొదలెట్టాయి. నా వెనక్కాలే మా ఆవిడ నన్ను ఫాలో అయిపోతుంటే, ఖంగారుగా మా చెల్లి "వొదినా! చెప్పులు వదలొద్దు! అన్నయ్యా! వేసేసుకో! అప్పుడు లోపలికి రండి!" అనగానే, మళ్లీ చెప్పులు వేసేసుకొని, ఇంట్లో ప్రవేశించాం.  

..........ఇంకా తరువాయి.

Friday, May 13

ప్లాస్టిక్ వినియోగం-2



సంచులపై నిషేధం

ప్రపంచ వ్యాప్తంగా, "ఫాసిల్ ఫ్యూయెల్స్" (మరో మాటలో చెప్పాలంటే--పెట్రో వుత్పత్తులు) అత్యధికంగా "తగలేసే" దేశం అమెరికా.

ఇప్పటికీ, వాళ్ల దేశాధ్యక్షుడు కూడా, తన విశ్రాంతి సమయంలో "చెట్లు నరుకుతాడు" తన యింట్లో "ఫైర్" కోసం! అది వాడికి "పేస్ టైమ్"!

మన దేశంలో, ఓ నలభై యేళ్ల క్రితమే, "ఓజోన్ పొరకి" చిల్లు పేరుతో, అమాయక గిరిజనులు అడివిలో యెండుపుల్లలు యేరుకొస్తూంటే, కేసులు పెట్టేవారు! "పొగలేని పొయ్యిలని" కనిపెట్టి, ప్రచారం చేసి, సబ్సిడీతో వాటిని ఇచ్చీ, ఇలా చాలా వేషాలు వెయ్యడం మొదలెట్టారు.

(మీకు అనుమానమైతే, అప్పటి "సన్‌డే"; "ది వీక్"; "ఇండియా టుడే"; "ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ" లని వెదికి చూడండి--నెట్ లో దొరక్కపోవు)

ఈ రోజున, అమెరికాలో ప్రతీ "5 సెకన్లకీ" సుమారు "60 వేల" ప్లాస్టిక్ సంచులని వినియోగిస్తున్నారట! అంటే సెకనుకి 12 వేలు! అంటే రోజుకి, నెలకి, సంవత్సరానికి--యెన్నిమిలియన్లు?

మరి మనకెందుకండీ--ప్లాస్టిక్ సంచుల నిషేధం?.....గొంతులూ, గుడ్డలూ చించుకోడానికీ, వుద్యోగులు దండుకోడానికీ కాకపోతే?

పర్యావరణం వెర్రితో వింతపోకడలు పోతున్నాము మనం.....టూరిష్టు స్థలాలతో సహా!

ఆలోచించండి!  

Thursday, May 5

ఈనాడు/న్యూస్ టైమ్



రామోజీరావు

వార్తా పత్రికలు చదవడం నేర్చుకున్నప్పటి నుంచీ, "ఆంధ్ర పత్రిక" చదివేవాడిని. ఆ పత్రిక ఆగిపోయాక, "ఆంధ్ర ప్రభ". 

ఈనాడు పత్రిక మొదటి సంచిక/సంపుటి నుంచీ అదే చదువుతున్నాను తెలుగులో. (ఇంగ్లీషులో కొన్నాళ్లు "న్యూస్ టైమ్" చదివేవాణ్ణి.....చక్కగా కంటికింపైన "ఫోంట్స్" తో, పొందిగ్గా వెలువడే ఆ పేపర్, ఇప్పటికీ "ది బెస్ట్!". కొన్ని వూళ్లలో అది దొరకకపోవడంతో మానేశాను. ఇప్పుడు వెలువడుతోందో లేదో మరి.)

అందుకే, ఈనాడులో కూడా "పెయిడ్ న్యూస్" వస్తోందని బాధపడ్డాను. వారికేమి ఖర్మ అని?! 

ఇప్పటికీ, కొన్ని ఆడంబరాలూ, భేషజాలూ లేకపోతే, "క్రెడిబిలిటీ" సరిపోయినంతగా వార్తలు ఇచ్చేది ఈనాడు వొక్కటే.

కానీ, ఇప్పుడు కొందరు విలేకర్లు అధికారులతో "కుమ్మక్కై" వాళ్లగురించి గొప్పవార్తలే వ్రాస్తున్నారు. 

గత మూడురోజులుగా, మా ఆర్డీవో ఆఫీసుల్లో జరుగుతున్న తతంగాన్ని వారి దృష్టికి తెచ్చినా, ఇప్పటివరకూ అధికారులని నిలదియ్యలేదు! వార్త రాలేదు!

ఇంకా, రామోజీరావు ది యూనివర్సిటీల్లో డాక్టరేట్ కోసం "రీసెర్చ్" చెయ్యవలసిన వ్యక్తిత్వం.

తెలుగు వాళ్లలో చట్టబధ్ధంగా మొట్టమొదటి కోటీశ్వరుడు ఆయన. యే పని చేపట్టినా, యే రంగం లోనైనా,  నిబధ్ధతతో, చక్కగా ప్రణాళిక రచించే వాళ్లని "రిక్రూట్" చేసుకొని, "సక్సెస్" అనే పిరమిడ్ పైనే నిలిచాడు యెప్పుడూ! (అలాంటివాళ్లకు కూడా కొన్ని "ఫెయిల్యూర్స్" వుండే వుంటాయి--నాకు గుర్తు లేవు).

2001 లో అనుకుంటా, ఆయన మొత్తం యేడో, పదకొండో (బుడుగు లెఖ్ఖల్లో) "ఈనాడు" యెడిషన్లని హైదరాబాదులో కూర్చొని, "టచ్ స్క్రీన్" తో "ఆవిష్కరించడం", వెంటనే పేపర్లు ప్రింటయి వస్తున్నట్టు టీవీలో కనిపించడం (చెన్నై యెడిషనే కొంచెం ఆలస్యం అయిందనుకొంటా--సాంకేతిక కారణాలతో) "అత్యద్భుతం"!

అలాంటి "సక్సెస్" గురూ కి పాదాభివందనాలు!

(ఇప్పటికే యెక్కువ వ్రాసేశాననుకుంటా. వుండవిల్లి యేమంటాడో? మార్గదర్శి ఫైనాన్సియర్స్ మీద పడ్డాడుగానీ, "ముథూట్"; "మణప్పురం" ల మీద పడే ధైర్యం వుందా?)

Wednesday, April 20

మా మూడో హనీమూన్ అనే.......-8



మొన్నటి మా యాత్ర

$భోజనాలు

ఓ రాత్రీ, ఓ పగలూ అప్పటికే ప్రయాణించడంతో ప్యాంట్రీ కారు వాడికి నా సంగతి కొంత బాగానే తెలిసింది. రాత్రి 'డిన్నర్' అంటూ వాడో పుస్తకం, పెన్సిలూ పట్టుకొని వచ్చేసరికి వాడిని విషయించేశాను. "డిన్నర్లో యేమి ఇస్తావు? యెప్పుడు ఇస్తావు? రోటీ చావల్ అయితే యెంతా? వట్టి రోటీనే అయితే యెన్ని ఇస్తావు? యెంతా? వట్టి చావల్ అయితే యెన్ని కప్పులు ఇస్తావు? కూరలు ఇస్తావా? వూరగాయే గతా?" ఇలా ముత్యాల ముగ్గులో మాడా లాగ! 

వాడు బెదిరిపోయి, రెండు భోజనాలు--రోటీలతో, రెండు భోజనాలు వట్టి చావల్ తో అని చెపితే......ఒక ప్లేటులో రెండు+రెండు=4 చపాతీలూ, సబ్జీ తెచ్చాడు--100 రూపాయలకి! సరే, మరి చావల్ మాటేమిటి అంటే, మళ్లీ రొట్టెలు లేకుండా, చావల్ తోనే రెండు ప్లేట్లు తెచ్చాడు--ఒక్కోటీ 80 రూపాయలకి!

అలాగే అడ్జస్ట్ అవ్వక తప్పింది కాదు మరి!

*వెయిటింగ్ రూములకి

ఒకటో ప్లాట్ ఫామ్‌కీ, బయటికి వెళ్లడానికి క్రిందికి దిగవలసిన మెట్లకీ మధ్యలో వున్నాయి వెయిటింగ్ రూములు. ముందు ఓ చిన్న రూము--వాష్ బేసిన్ల గట్లతో. ఆ ప్రక్కన పార్టిషన్. దాని వెనకాల యేముందో చూడలేదు నేను. వాష్ బేసిన్ల దగ్గర కొంతమంది పళ్లు తొమేసుకొంటున్నారు. సబ్బులతో ముఖాలు కడిగేసుకుంటున్నారు. ఆ రూముకి బోర్డు యేమీ లేదు. (బహుశా--ఆ మ కా వాళ్లకోసమేమో?)

తరవాత "జనరల్" రూము. విశాలంగా వుంది. ఫేన్లూ గట్రా వున్నాయి. స్టీలు బెంచీలు వున్నాయి....వాటిమీద పడుకోకుండా ప్రతీ సీటుకీ మధ్య 4 అంగుళాల యెత్తు స్టీలు గోడలు కూడా వున్నాయి. కిటికీల వద్ద కూడా కొంచెం యెత్తుగా గట్టుల్లా వున్నాయి. మేము వెళ్లేసరికి, అలాంటి కిటికీ గట్టు మీద అప్పటివరకూ నిద్రించినవాళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. దానిముందు వున్న స్టీలు బెంచీ ఖాళీగానే వుంది. సరే. కిటికీల దగ్గర లగేజీలు పెట్టుకొని బెంచీమీద కూర్చొన్నాం. 

ఆ రూముకి ప్రక్కనే "జంట్స్" రూము వుంది. జనరల్ లో టాయిలెట్లూ వగైరాలు లేవు. అందుకని ఇంకేదైనా రూములోకి వెళ్లవలసిందే. మేము మిక్సెడ్ డబుల్స్ కావడంతో, జనరల్ లోనే కూర్చొన్నాము. 

దాని ప్రక్కనే, "లేడీస్" రూము వుంది. వివరణ అఖ్ఖర్లేదుగా.

ఇక్కడ విశేషమేమిటంటే, వెయిటింగు రూములు యెంత వెడల్పుతో వున్నాయో వాటి ముందు "కారిడార్" అంత వెడల్పూ వుంది! అంటే, కావాలంటే ఇంకో నాలుగు వెయిటింగ్ రూములు కట్టొచ్చు! లేదా వున్నవాటినే పెద్దవి చెయ్యొచ్చు! (మన బుర్రోవాదులకి ఇలాంటివి తట్టవు కదా! యెంత 'వేస్ట్' ఐతే అంత మంచిది గుత్తేదారులకి మరి!) 

ఆడవాళ్లు లేడీస్ కి వెళ్లి, బ్రష్ లూ, అవీ చేసేసి వచ్చారు. కాఫీలు అక్కడకి రావు కదా? నడవలేరు, మెట్లు దిగలేరు, యెక్కలేరు! మరెలా? ప్లాట్ ఫామ్ ఒకటి మీదగానీ కాఫీ షాప్ లేదు! అవసరం అలాంటిది. యెక్కడలేని వోపికా తెచ్చుకొని, వెళ్లి, కాఫీలు తాగి వచ్చారు. పైగా, కాఫీ చాలా బాగుంది! మీరూ వెళ్లండి అని సలహా!

మేము తక్కువ తిన్నామా? జంట్స్ లోకి వెళ్లి, పనులయ్యాక మెట్లు దిగి, క్రిందకి....బయటికి వెళ్లే మార్గంలో వెళ్లి, అక్కడ ఓ 24 గంటల రెస్టారెంట్ వుంటే, అందులో సెల్ఫ్ సర్వీస్ కాఫీలు కొనుక్కొని, కూర్చొని, ఆస్వాదిస్తూ త్రాగి, వెనక్కి వచ్చాం. 

విషయమేమిటంటే, ఈ వెయిటింగ్ రూములు కనీసం స్లీపర్ క్లాస్ టిక్కెట్లు వున్నవాళ్లకే. కానీ యెవడూ చెక్ చేసిన పాపాన పోవడం లేదు. "సర్వమంగళ తన మాంగల్యమునెంత మదినమ్మినిదో!" అన్నట్టు. యే టెర్రరిస్ట్ అయినా...!....పాపము శమించుగాక!

#ఇంకో విషయం వ్రాయడం.

పగలు జర్నీలో మన రాష్ట్ర సరిహద్దుల్లో యెక్కడో ఒక ముసలవ్వ (కనీసం 60 యేళ్లు వుంటాయి) యెక్కింది--ఓ పెద్ద బుట్టని ఇద్దరు మగాళ్లు మోసుకొచ్చి, యెక్కించగా. ఆబుట్టలో ఓ ఐదారు వందల కమలాఫలాలు (సంత్రాలు) వుంటాయి--రకరకాల సైజుల్లో, రకరకాల 'పండిన' స్థితుల్లో. చాకచక్యంగా వాటిని --ఒకే సైజువి, బాగా పండినవి కొన్నీ, కొంచెం తక్కువ పండినవి కొన్నీ--ఇలా వేరే ప్లాస్టిక్ కవర్లలో ఓ ఐదేసి చొప్పున సర్దేసి, పట్టుకొచ్చి, "బాబూ! సంత్రాలు! ఇరవై రూపాయలకే!" అంటూ అమ్మొచ్చింది. అప్పటికి ఓ రాత్రీ, ప్రొద్దున్నా ప్రయాణం చేసి, ప్యాంట్రీ కార్ వాడు పెట్టిన టిఫిన్లు తినీ, కాఫీ టీలు తాగీ, జిహ్వ చచ్చిపోయి వున్నారేమో--అందరూ కొనేశారు. మళ్లీ ఆవిడ రెండో రవుండ్ తిరగడం, మళ్లీ అందరూ కొనెయ్యడం! మధ్యాహ్న భోజనాలు అయ్యాక కొంత గేప్. మళ్లీ ఆవిడ, కొంచెం పెద్ద సైజు పళ్లనీ, కొంచెం తక్కువ పండిన వాటినీ ఐదేసి చొప్పున పట్టుకొచ్చి, "బాబూ! సంత్రాలు! 15 రూపాయలకే!" అంటూ వస్తే, మళ్లీ అందరూ......హాం ఫట్! సాయంత్రం 4 గంటలకల్లా బుట్ట ఖాళీ చేసుకొని, డబ్బులని రొండిలో దోపుకొని, దిగి వెళ్లిపోయిందామె! నిజంగా, ఆ వయసులో ఆమె కష్టానికీ, తెలివికీ తగిన ఫలితం వచ్చిందా.......అంటే.....యేమో! ఆ పైవాడికే తెలియాలి!

..........ఇంకా తరువాయి.

Saturday, April 16

మా మూడో హనీమూన్ అనే.......-7



మొన్నటి మా యాత్ర

ఇంక ఆ రాత్రి $భోజనాలు చేశాక, నిద్రపోయాం. రాత్రి పదింటికే చలి మొదలయ్యింది. ఫ్యాన్లు కట్టేసి, పేంట్లు, చొక్కాలు, స్వెట్టర్లూ, సాక్సూ, జర్కిన్లూ, మఫ్లర్లూ, శాలువాలూ  వగైరాలతో బందోబస్తు చేసి దుప్పట్లు ముసుగేసినా, ఇంకా వణికిస్తున్న చలి. తెల్లవారుజామున 3 గంటలకే రైలు నిజాముద్దీన్ చేరాలి. అప్పుడు హడావిడిగా యెందుకని, ముందే అన్నీ సర్దేసుకున్నాము. 

ఈ ఆడవాళ్లు అసలు నిద్రపోతేనా! అలారం పెట్టుకొన్నది రెండున్నరకి. మధ్యలో యేవేవో మెస్సేజిలూ వాటి సౌండ్లూ, లేచి చూసుకోడాలూ, గుడగుడలూ. మమ్మల్ని కూడా లేపేశారు--రెండున్నర లోపలే! (నాకు ఇంకో నాలుగు సిగరెట్లు యెక్కువ ఖర్చయ్యాయి.)

అలా మొత్తానికి కొంచెం లేటుగా 4 గంటలకి చేరింది రైలు. ఢిల్లీలో పడ్డాం. లగేజీలు దింపుకొని, అక్కడవుండే మా మూడో (ఆఖరి) చెల్లెలుకి ఫోను చేద్దును కదా--డ్రైవరు ఇప్పుడే వచ్చాడు. నేను బయలుదేరి వస్తున్నాను. మీరు వెయిటింగ్ రూములో వుండండి. యెంతోకాదు....ఓ రెండుగంటల్లో వచ్చేస్తాను--అంది. 

సరే, మళ్లీ 180 రూపాయలకి పోర్టరుని మాట్లాడుకొని, ఒకటో ప్లాట్ ఫామ్ ప్రక్కన వుండే *వెయిటింగ్ రూములకి చేరాము. (ఆ స్టేషనుకి బయటికి వెళ్లడానికి రెండువైపులా మార్గాలు వున్నాయి. మేము దిగినది 'నిజాముద్దీన్ ' వైపు అంటారు. ఇంకోవైపుని 'సయ్యద్ కాలేషా' అనో యేదో అంటారు). 

మరిచాను దారిలో ఇంకో #చిన్న విషయం వ్రాయడం.

..........ఇంకా తరువాయి.

Saturday, April 9

మా మూడో హనీమూన్ అనే.......-6



మొన్నటి మా యాత్ర

......ఓ పోలీసు......@"యేం చేసి వచ్చారు?" అంటూ!

@ "పిచ్చోడిలా వున్నావే! యేమి చేసి వస్తారు?"

(సంభాషణ హిందీలో జరుగుతూంది).

"స్మోక్ చేసి వచ్చారు."

"మీరు చూశారా?"

"చూడక్కర్లేదు. మీ జేబులోని సిగరెట్టు పెట్టే చెపుతూంది" అంటూ, ఆ పెట్టెని తీసేసుకొని, తన పేంటు జేబులో పెట్టేసుకున్నాడు.

(ఆ సమయంలో మా పెట్టెలోని టాయిలెట్లలో యెవరో వుండడంతో, వెస్టిబ్యూల్ దాటి, ప్రక్క పెట్టెలోని టాయిలెట్లోకి వెళ్లాను. మా సంభాషణ వెస్టిబ్యూల్ లో జరుగుతోంది.)

"జేబులో పెట్టె నేరం కాదుకదా?"

"ఇక్కడ బోర్డు చూడండి--250/- రూపాయల జుర్మానా!"

"అది 'పబ్లిక్ ప్లేసులో' తాగిన వాళ్లకి. టాయిలెట్లో తలుపు వేసుకున్నాక, అది నా ప్రైవేట్ ప్లేసు. అది నేరం అని యెవరు చెప్పారు? పైగా నువ్వు చూడలేదు కదా?"

"ఇప్పుడే చలాన్ వ్రాయగలను. 250/- కట్టండి."

"నీదగ్గర రుజువేముందని కట్టమంటావు? సిగరెట్టు పెట్టె నీజేబులో వుంది!"

(అప్పుడే పెట్టెలో టీలు అమ్మేవాడొకడు అక్కడికి వచ్చాడు. ఆ పోలీసు తనజేబులోంచి ఆ సిగరెట్టు పెట్టెని తీసి, మళ్లీ నా చొక్కాజేబులో పెట్టడం చూశాడు. నేను వాణ్ని అడిగాను)

"బాబూ! నువ్వేమి చూశావో వ్రాస్తాను. సంతకం పెట్టు" 

"మధ్యలో నన్ను ఇరికించకండి బాబూ" అంటూ వాడు వెళ్లిపోయాడు. 

(అక్కడ చీకటిగా వుండడంతో వాడి నేం ప్లేట్ కనిపించడంలేదు.)

"అసలు నీ పేరేమిటి? నువ్వు డ్యూటీలోనే వున్నావా? నీ ఐడీ కార్డు యేది?"

"అవన్నీ అడిగితే, ఇప్పుడే కేసు వ్రాసేసి, వచ్చే స్టేషనులో ఆర్పీఎఫ్ వాళ్లకి అప్పగిస్తాను!"

"యేమని వ్రాస్తావు కేసు?" (యెదురుగా కనిపిస్తున్న ప్రయాణీకులని కూడా అడిగాను.) "బాబూ! మీరుకూడా చూశారుకదా? సిగరెట్టుపెట్టెని నా జేబులో పెట్టబోయాడు. పైగా కేసు అంటున్నాడు! ఇందాకా జరిమానా అన్నాడు."

"సరే! జుర్మానా కట్టెయ్యండి. కేసు వ్రాయను."

"నేను లుంగీ, షర్టులో వున్నాను. నాదగ్గర డబ్బుల్లేవు. అయినా, అసలు నీ బాధ యేమిటి? నేను నిజంగా నేరం చేసినా, ప్రథమ తప్పిదం క్రింద వార్నింగ్ ఇచ్చి వదిలెయ్యాలి, మళ్లీ అదే నేరం చేస్తే పట్టుకోవాలి."

"సరే. వదిలేస్తాను. పదినిమిషాల్లో జరిమానా కట్టండి! లేకపోతే వచ్చే స్టేషనులో......"

"డబ్బులకోసం మా ఆడవాళ్లదగ్గరికి వెళ్లానంటే, గొడవ అవుతుంది. అందరూ వచ్చేసి దెబ్బలాడతారు. నీ కేసు సంగతి యేమవుతుందో చూసుకో!"

"సరే. ఓ పావుగంటలో ఓ 100 తెచ్చి ఇవ్వండి. లేకపోతే.....! మీ బెర్త్ నెంబరు చెప్పండి."

"నాది ఇవాళ అంటే 04-03-2011 న, విశాఖ-హజ్రత్ నిజాముద్దీన్ దక్షిణ్-లింకు ఎక్స్ ప్రెస్ లో, ఎస్ 2 లో బెర్త్ నంబరు 65" కాస్త గట్టిగానే, అందరూ వినేలా చెప్పాను.

(నిజానికి ఈ "కరప్ట్" వాళ్లందరూ పేరూ, డెజిగ్నేషన్ అడగ్గానే లొంగిపోతారు. కానీ మనం కూడా అనువుగానిచోట అధికులమనరాదు కదా? ఆర్పీఎఫ్ వాళ్లు కేసులు పెట్టడానికి ఈ స్టేషను కాదని ఆ స్టేషనూ అంటూ, మన ప్రయాణాన్ని ఆపేసి, తిప్పడం పేపర్లలో చదువుతూ వుంటాము కదా? అందుకని, కామ్‌గా మా ఆవిడని అడిగి, ఓ వంద తీసుకెళ్లి, వాడి జేబులో పెట్టాను.)

"మీ పెట్టె మీరు తీసేసుకోండి!" అని నా జేబులో పెట్టబోయాడు. 

"నీదగ్గరే వుంచు. మళ్లీ అవసరం వచ్చినప్పుడు తీసుకొంటాను కదా!"

"నేను ఇంకో గంటలో రైలు దిగిపోతాను. ఈ లోపల మీ యిష్టం."

"మరి రాత్రి భోజనం సంగతి తరవాత మాటేమిటి?"

(అప్పటికి ఝాన్సీ స్టేషన్ రాబోతూంది. ఆరూ యేడు లోపల వచ్చేస్తుందని మా ప్రక్కవాడు--మమూలు టిక్కెట్టు కొనుక్కొని, రిజర్వేషన్ బోగీ యెక్కినవాడు--చెప్పాడు.)

"మీరు యెలాగైనా కాల్చుకోండి--కానీ పోలీసులెవరూ లేకుండా చూసుకొని కాల్చండి!" అని అమూల్యమైన సలహా ఇవ్వడం కొసమెరుపు. తరవాత వాడెప్పుడు దిగిపోయాడో నేను చూడలేదు. వాడి సలహా మాత్రం పాటించాను.   

..........ఇంకా తరువాయి.

Thursday, April 7

మా మూడో హనీమూన్ అనే..... -5



మొన్నటి మా యాత్ర

విజయవాడ దాటాక, టిఫిన్లూ, పెరుగన్నాలూ లాగించాక, నిద్రకి పడ్డాం. నాకు సాధారణంగా కారు/రైలు/బస్సుల్లో నిద్ర రాదు. అలాంటిది ఆ రోజెందుకో, భలే నిద్ర పట్టేసింది. 

మర్నాడు ప్రొదున్న, ఆడవాళ్లిద్దరూ బ్రష్ చేసేసి, ఆరింటికే ఒకసారి కాఫీ వస్తే తాగేశారు. తరవాతెప్పుడో నిద్రలేచిన మాకు 10-30 దాకా కాఫీ రాలేదు....టీ వాడు మాత్రం నిమిషానికోసారి.....తాగుతారా? ఛస్తారా? అన్నట్టు మా చుట్టే తిరిగాడు. 

అప్పటికి మహారాష్ట్రలోనో యెక్కడో తేలాం. 

నాష్తా అంటూ "వెజ్ కట్లెట్; సమోసా; బ్రెడ్ పకోడా" అని అరుస్తూ ఒకడు తిరిగాడు అంతసేపూ. ఈటార్సీ దాటామనుకొంటా. 

అప్పుడొకడు వచ్చాడు--"రోటీ భాజీ" అంటూ. నాలుగు ప్లేట్లు 80 రూపాయలకో యెంతకో 
కొనుక్కొని, అందరూ తినేశాం. (ఐ ఆర్ సీ టీ సీ వాళ్లు టిక్కెట్లలో మోసం చేస్తున్నారు--చర్య తీసుకోండి అంటే, వాళ్లని కేటరింగు నించి కూడా తప్పించి, మమతాదీ ఫేవరెట్లకి 'ప్రైవేటు ' కేటరింగ్ కి ఇచ్చేశారు--అదీ మన దౌర్భాగ్యం!)

ఇంకో గంటలో, "లంచ్?" అంటూ ఒకళ్లిద్దరు తిరగడం మొదలెట్టారు. టైము ఇంకా 12 కూడా కాలేదేమో. "లంచ్ లో యేమిస్తావు?" అనడిగాను (కానీ యెప్పుడిస్తావు అనడగలేదు!) "చపాతీ, సబ్జీ--యా చావల్, దాల్" అన్నాడు. సరే అనుకొని, రెండు చపాతీ సబ్జీ చెప్పాను. ఐదు నిమిషాల్లోనే హాజరు! 

ఆడాళ్లనిద్దరినీ తినెయ్యమన్నాను--వాళ్లు ఆకలికి తట్టుకోలేరుకదా అని. ఓ పావు గంట తరవాత కూడా, "లంచ్?" వాళ్లు తిరుగుతున్నారు! సరేలే, ఇంకేమీ దొరకదేమో అని, రెండు చావల్, దాల్ కి ఆర్డరు ఇచ్చాను. అప్పుడుకూడా, యెప్పుడిస్తావు అని అడగలేదు. 

మళ్లీ పది నిమిషాల్లోనే ప్రత్యక్షం! మా బావగారు పాపం, టేబ్లెట్లు వేసుకోవాలంటే తినక తప్పదని, తినేశారు--ఇంతకీ అది మన "పోపన్నం!" దాల్ పేరుతో ఓ నీళ్ల ద్రావకం, ఓ చిన్న వూరగాయ పౌచ్ ఇచ్చాడు! వాటికి రెండింటికీ 80 రూపాయలు! (నేను తిననే లేదు!)

మధ్యాహ్నం రెండు గంటలకి మళ్లీ మా వాళ్లు ముగ్గురూ కాస్త పెరుగన్నం తిన్నారు. (అప్పటికి ఇంకా 'బస్తాల ' అవసరం రాలేదు.)

నేను మళ్లీ నిద్రకి పడ్డాను.నాలుగింటికి మెలుకువ వచ్చింది. ఓ సిగరెట్టుకాల్చుకొద్దామని టాయిలెట్ కి వెళ్లాను. పని అయిపోయాక బయటికి వద్దును కదా........ఓ పోలీసు......@"యేం చేసి వచ్చారు?" అంటూ!  

..........ఇంకా తరువాయి.

Saturday, April 2

మా మూడో హనీమూన్ అనే..... -4



మొన్నటి మా యాత్ర

(ఇలా అయితే యాత్ర విశేషాలు యేడాదైనా తెమలవుగానీ, టూకీగా వ్రాసేసి, వివరణ అవసరమైనచోట్ల * గుర్తో యేదో వేసేసి, వేరే వ్రాస్తాను. సరేనా?)  

.......రైలు కూత వినపడింది* కదా?

*"రైలు కదిలిపోతూంది! యెక్కెయ్యండి" అని గోల. ఇంతకీ అది ప్రక్క లైనులోంచి వెళ్లిపోయిన ఓ గూడ్స్ రైలు! గూడ్స్ రైలు కూతకీ, ప్యాసింజరు రైలు కూతకీ (కారుకూతలకీ, రైలు కూతలకీ) తేడా చాలామందికి తెలియదు. తీరా నేను చూసేసరికి అప్పుడే మా రైలుకి సిగ్నలు ఇచ్చారు. వెంటనే యెక్కేశాను. 

అయినా, ఈ రైళ్లలో దిగి యెక్కడాలూ, సిగ్నళ్లు ఇవ్వడాలూ, కూతలు వెయ్యడాలూ, యే యే స్టేషన్లలో లగేజి లోడింగులు జరుగుతాయి, అక్కడ అవి అయ్యేవరకూ బ్రహ్మదేవుడు చెప్పినా రైళ్లు కదలవూ, యెక్కడెక్కడ, యెన్నెన్ని రైళ్లూ, గూడ్స్లూ, ఇంజన్లూ క్రాసింగులు అవుతాయి, అవతల లైన్లో యే రైలుని వొదిలారూ, మన రైలు యెప్పుడు వదులుతారూ--వగైరాలన్నీ నాకు 30 యేళ్లు వచ్చేటప్పటికే అవుపోశన పట్టేశాను. అందుకే నాకు భయం లేదు యెక్కలేకపోతానని!

రైలు నెమ్మదిగా బయలుదేరి, రాత్రి పదిగంటల ప్రాంతంలో విజయవాడ చేరింది. అప్పటిదాకా ఆకళ్లు యెవరికీ లేవు. (ఐదారుసార్లు కాఫీలు లాగించాము కదా!) కానీ, ఇంక నిద్రపోవాలికాబట్టి, తినెయ్యాలి. అక్కడ షెడ్యూల్డ్ స్టాప్ 20 నిమిషాలు. క్రిందికి దిగి, ప్లాట్ ఫామ్ మీద చూస్తే, ఓ వంద గజాల దూరం లో "ఇడ్లీ, వడా, దోశా" అని అరుస్తున్నారు. 

దిగబోతూ అందరినీ అడిగాను--యేమి తెమ్మంటారు? అని. "మాకేమీ వద్దు" అని కోరస్! నేను మాత్రం టిఫిన్ తెచ్చుకోదలిచి, ఓ వెండర్ని అడగ్గానే, 9 X 4 తగరం ప్లేట్లలో ప్యాక్ చెయ్యబడ్డ "వడా, దోశ" ని చూపించి, 25 రూపాయలు ఇమ్మన్నాడు. 

యెందుకైనామంచిదని రెండు ప్యాకట్లు తీసుకున్నాను.  

ఇదివరకు, ప్రతీ ప్లాట్ ఫామ్ మీదా, వేరే వేరే తట్టల్లో ఇడ్లీ, వడా, దోశా, పులిహోర, పెరుగన్నం--ఇలా అమ్మేవారు. ఓ ఆకులో రెండు ఇడ్లీ, రెండు వడా పెట్టించుకొని, నీళ్ల చట్నీ వేయించుకొని, అది కారిపోకుండా పెట్టెలో తమవాళ్లకి ఇవ్వడానికి యెన్నో ఫీట్లు చెయ్యాల్సి వచ్చేది!

విజయవాడ స్టేషన్ క్యాంటీనంటే--ప్రపంచం మొత్తమ్మీద 'అదుర్స్!' 

విజయవాడలో నెలకి వందా రెండువందలు జీతం సంపాదించుకొంటూ, అద్దెలు భరించలేనివాళ్లు--స్తేషన్లోనే వుంటూ, టిఫిన్లూ, భోజనాలూ చౌకగా తింటూ కాలం వెళ్లబుచ్చేవారు! ఇప్పుడా క్యాంటీనుకి అంత సీను వుందో లేదో చూసే భాగ్యం ఈ మధ్య కలగలేదు.

ఇప్పుడు, ఇడ్లీ, వడా, దోశా--మనిష్టం కాదు--వాళ్లు "వడా-దోశా"; "ఇడ్లీ-పులిహోరా"; "బ్రెడ్-పెరుగన్నం" లాంటి చిత్రమైన కాంబినేషన్లలో--యేమి పెడితే అది తినాల్సిందే! ఇక @చట్నీదో ప్రహసనం. పైగా, ఆ ప్యాకెట్లమీద ఆ రోజు తారీఖూ, ఎం ఆర్ పీ స్టాంప్ చేసి వున్నాయి! (ఎం ఆర్ పీ 20/- అయితే, వాడు 25/- వసూలు చేసి నన్నే మోసం చేసాడన్న విషయం తినే ముందు తెలిసింది!)   

..........ఇంకా తరువాయి.

Friday, April 1

మా మూడో హనీమూన్ అనే..... -3



మొన్నటి మా యాత్ర

హమ్మయ్య. 

రైలు (అన్నట్టు రైలు మన తెలుగు శబ్దమేకదూ? లేక "ధూమశకటం" అందామన్నా, ఇప్పుడు బొగ్గులూ లేవు, ధూమం లేదు మరి. డీజెల్ కి తెలుగు పేరు పెట్టబడినట్టు లేదు--ఆ శకటం అందామన్నా) బయలుదేరింది. 

బ్యాగులూ గట్రా సీట్ల క్రిందకి తోసేసి, అవసరమొచ్చేవి ప్రక్కనే పెట్టుకొని, హేండ్ బ్యాగులు ఆడవాళ్ల ప్రక్కన పెట్టుకొని, 'అందరికీ' ఫోనులు చేసేసి 'బండి యెక్కేశాం, కదిలిపోయింది, మళ్లీ తరవాత చేస్తాం' అని చెప్పేసి (ఇదివరకు యెవరినైనా బండి యెక్కించి, 'చేరగానే కార్డు ముక్క రాయండి' అనేవారు--ఆ కార్డు ముక్క చేరితే సంతోషం, లేదా చేరక ....స్తారేమిటీ...అని ఓ ధీమా వుండేది. ఇప్పుడా ధీమా కరువై, గంటగంటకీ మనం చెయ్యకపోతే వాళ్లే ఫోను చేసేసి, హమ్మయ్య అనుకొంటూ రాత్రంతా గడిపేస్తారు. తెల్లవార్లూ కంపార్ట్ మెంట్లో అందరి సెల్లులూ మోగుతూనే వుంటాయి--ముచ్చటైనవేకాదు భయంకరమైన రింగ్ టోన్లతో సహా--మాట్లాడుతూనే వుంటారు), కాస్త రిలాక్సుడుగా కూర్చొనే సరికి, "చిన్నన్నయ్యా! బావగారు బ్రెడ్ తెచ్చారుగానీ, జామ్ మర్చిపోయారు. తరవాత అరిటిపళ్లు కూడా కొనుక్కుంటే బాగుంటుంది" అని ఓ సలహాత్మక సూచన. 

ఇంతలో వచ్చింది--యేమిటీ? మూర్చా?--కాదు రాజమండ్రి.....అంటే నిజంగా మనదగ్గరకి వచ్చింది అనికాదు.....మన రైలు రాజమండ్రి అనే వూర్లో వున్న స్టేషనుకి చేరింది.....అని! 

సరే.....పళ్లూ అవీ అంటూ రైలు దిగబోతే, మా ఆవిడ "యేమండీ.....మీరు దిగొద్దు. కిటికీ ప్రక్కకి వస్తే కొందాము.....అంతే!" అనీ, చెల్లెలు కూడా "వొద్దు......దిగొద్దు....మళ్లీ యెక్కడం కష్టం" అనీ సతాయింపు. 

అయినా మనం వింటామా! రాజమండ్రిలో యెంత ముష్టి రైలు అయినా ఓ 10 నిమిషాలు ఆగకపోదు. ఆ టైములో ప్లాట్ ఫామ్ మూడుసార్లు చుట్టి రావచ్చు! అందుకని దిశేశా (ఇది మా మనవడి మాట--దిగేశా కి బదులు). 

తీరా చూస్తే, మనది ఇంజను ప్రక్క బోగీ! అంటే ప్లాట్ ఫామ్ కి ఓ చివర--ముష్టివాళ్లు పడుక్కొని విశ్రాంతి తీసుకొనేచోట ఆగుతుంది. వెనక్కి నడుచుకొంటూ వెళితే, ఓ అర ఫర్లాంగు దూరం లో "కిసాన్" వాళ్ల స్టాల్. ఇంకో ప్రక్క ఓ బండీ, దానిమీద అరటిపళ్లూ. ఆకు పచ్చ అరటిపళ్లు తగ్గాయి ఈ మధ్య యెందుకో. అలాంటివే పసుపుపచ్చవి వస్తున్నాయి. 

డజను 40 కి బేరమాడి (నా మొహం! బేరమేమిటీ.....అన్నీ ఫిక్సెడ్ రేట్లు.....కొనౌపోతే నీ ఖర్మ!) రెండు డజన్లు తీసుకొని, ఇంకో ప్రక్కన వున్న "కిసాన్" వారి స్టాల్ కి వెళితే, ఓ డజను యెండిపోయిన యాపిల్స్, ఈకలు పీకేసిన కోళ్లలా వ్రేళ్లాడగట్టబడ్డ రెండో మూడో అనాసపళ్లూ మాత్రం వున్నాయి. జామ్ లూ గట్రా యేమీ లేవు. సరే, వెనక్కి నడిచి, కిటికీలోంచి పళ్లు అందించేలోగా రైలు కూత వేసింది! 

..........ఇంకా తరువాయి.

Wednesday, March 30

మూడో హనీమూన్ అనే.... - 2

మొన్నటి మా యాత్ర

మాది ఓ చిన్న చక్రాల సూట్ కేస్; ఓ బిగ్ షాపర్ లో రెండు దుప్పట్లూ, లుంగీ, టవలూ వగైరా రైల్లో వాడుకునే వాటితో--అంతే లగేజి.

కాకినాడలో మా చెల్లెలుదీ, బావగారిదీ రెండు చిన్న ఎయిర్ బ్యాగులు. అంతే. తరవాత, కాకినాడలో షాపింగ్ చేసి, మా ఢిల్లీ చెల్లెలు ఆదేశం ప్రకారం--వాళ్ల అత్తగారూ, తోటికోడళ్లూ వాళ్లకి మేము పెట్టవలసిన బట్టలూ, తను మాకు పెట్టవలసిన బట్టలూ (అక్కడ మంచి చీరలూ వగైరా దొరకవు కాబట్టి), తనకో వాచీ వగైరాలు కొనేసి, ఇంకో పెద్ద ఎయిర్ బ్యాగ్ నింపేశారు. 

అది కాకుండా, వెళ్లేది ఢిల్లీ వైపు కాబట్టి, మన తిండి దొరకదు అని ఇంకో బిగ్ షాపరూ! అందులో........

(నేను అంటానూ--మర్నాడు పొద్దున్న వరకూ అంధ్రాలోనే వుంటాము, ప్యాంట్రీ కార్ కూడా వుంది.....యెంతైనా వాడు పెట్టేవి కాస్త తినబుల్ గానే వుంటాయి కాబట్టి అన్నీ మోసుకెళ్లఖ్ఖర్లేదూ అని. మా బావగారేమో--నాకసలు తిండి ప్రాబ్లెం లేదు--ప్రతీ స్టేషన్లోనూ "బ్రెడ్ ఆమ్‌లెట్" దొరుకుతుంది--అని ప్రకటించేశారు. ఆయన చిన్నప్పటినించీ వాళ్ల నాన్నగారి వుద్యోగరీత్యా యెప్పుడూ రైలు ప్రయాణాలు చెయ్యడంతో, ఆకలికి మండినప్పుడు ఆమ్‌లెట్లు తినడం అలవాటు చేసుకొన్నారు! ఆయనవీ, వాళ్ల నాన్నగారూ, అమ్మగారూ వాళ్ల ప్రయాణాలగురించి వ్రాయాలంటే ఓ పెద్ద గ్రంథమౌతుంది!)

ఇంక సమస్యల్లా ఆడవాళ్ల గురించే. ఇద్దరూ ఒకలాంటివాళ్లే! మా ఆవిడ మసాలా వాసన దూరం నించి సోకినా, చేతిలో వున్నది పారేస్తుంది! చెల్లెలైతే, "పార్టీల్లోనూ అక్కడా అయితే మొహమాటానికి యెంగిలి పడతాం. మన ఇంట్లోనూ, ప్రయాణం లోనూ యెలాగ?" అంటుంది. అందుకని, బయలుదేరిన రోజు రాత్రీ, ఆ మర్నాడు ప్రొద్దున్నా, ఆ రాత్రీ కి సరిపడా అన్నం వండేసి, పెరుగులో కలిపేసి, ఓ పెద్ద కేసెరోల్ లో పెట్టేశారు. (తరవాత్తరవాత ఆ కేసెరోలే 8, 9 మంది ఆకలి తీర్చింది మరి!)

అది కాకుండా, మా బావగారు కాకినాడలో ఓ ప్రసిధ్ధ దుకాణం లో ఓ బస్తాడు--కారప్పూసా, మిక్స్చరూ, జంతికలూ, చెగోడీలూ వగైరా--అన్నీ అరకేజీలనుకుంటా--ఇంకా బ్రెడ్డులూ (స్లైస్డూ, ఫ్రూటూ, బన్నులూ) 
........నింపేశారు. అక్కడకి ఓ సూట్ కేసూ, మూడు ఎయిర్ బ్యాగులూ, రెండు బిగ్ షాపర్లూ, ఆడవాళ్లిద్దరివీ రెండు బస్తాల్లాంటి హేండ్ బ్యాగులూ--అవీ మా లగేజి.

మా డ్రైవరు చాకచక్యం పుణ్యమా అని అంత లగేజీతో మేం నలుగురూ మా అల్టో కారులో సామర్లకోట చేరాం అన్నమాట. అక్కడేమో మా బండి మూడో ప్లాట్ ఫాం మీదకి (అంటే ప్రక్కకి) వస్తుంది! మళ్లీ కూలీలకి ఓ వంద రూపాయలకి బేరమాడి, (రైలు రాగానే వాళ్లే మా కంపార్ట్ మెంటులో లగేజి యెక్కించేలా) ప్లాట్ ఫాం మీద ఓ కిలో మీటరు నడిచి (కంపార్ట్ మెంట్ ఇంజను దగ్గరే వుంటుంది మరి!), రైలు రాగానే దాంట్లో పడ్డాం.

..........ఇంకా తరువాయి.

Monday, March 28

మూడో హనీమూన్ అనే



మొన్నటి మా యాత్ర  

ఈ మధ్య ఒకటి రెండు తప్ప, వరసగా టపాలు వ్రాయలేకపోయాను. యెందుకంటే.....మీరు సరిగ్గానే వూహించారు.....దేశమ్మీద తిరగడానికి పడ్డాను. 

హర్యాణాలో వుంటున్న మా ఆఖరు చెల్లెలు యెప్పటినించో రమ్మంటుంటే, వుద్యోగం లో సెలవలు లేవని వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు వుద్యోగానికి గుంటకట్టి గంటవాయించాను కాబట్టి, సరదాగా తిరిగొద్దామని బయలుదేరాను. 

మా రెండో చెల్లెలు, బావగారు కాకినాడ నుంచి బయలుదేరతామనడం తో, మార్చి 3వ తారీఖున "నిజాముద్దీన్ లింక్/దక్షిణ్ ఎక్స్ ప్రెస్" కి సామర్లకోటనించి నలుగురికీ రిజర్వేషన్ చేయించాను. 

రెండో తారీఖుని మా కారులో బయలుదేరి, ఆ రాత్రి కాకినాడలో చిన్న చిన్న షాపింగులు చేసుకొని, ఆ మర్నాడు మధ్యాహ్నం 3-30 గంటలకి సామర్లకోట బయలుదేరాము. రైలు 4-20 కి. కొంచెం లేటుగా వచ్చి, సుమారు 5-00 కి బయలుదేరింది మా రైలు.

ఢిల్లీ, హర్యాణా, హిమాచల్, యూపీ, రాజస్థాన్లు తిరిగి, మొన్న 24 న మధ్యాహ్నం 2-30 కి తిరిగి సామర్లకోటచేరి, కాకినాడలో ఆ రాత్రి వుండి, మర్నాడు వుదయం బయలుదేరి ఇంటికి వచ్చాము. 

మిగతా ఒక్కొక్క టపాలోనూ వ్రాయడానికి ప్రయత్నిస్తాను. 

Thursday, February 24

ప్లాస్టిక్ వినియోగం



సంచులపై నిషేధం

ఇదొక ప్రభుత్వ, బుర్రోవాదుల వెర్రి!

20 మైక్రాన్ల లోపు మందంగల ప్లాస్టిక్ సంచులని నిషేధించగానే యేమిజరిగింది?

చిన్నసైజు ప్రభుత్వోద్యోగుల పంట పండింది! కొంచెం పెద్ద ఫ్యాన్సీ, కిరాణా, డిపార్ట్ మెంటల్ స్టోర్లూ వగైరాలనించి ఖచ్చితంగా వెయ్యి రూపాయలూ, కొంచెం చిన్న షాపుల నుంచి రూ.500/-, చిన్న చిన్న బజ్జీలబళ్లూ, కూరగాయల దుకాణాలూ, పళ్ల కొట్లూ వగైరాలనించి రూ.250/- యెవరికీ మినహాయింపు ఇవ్వకుండా, వసూలు చేసుకున్నారు!

మరి కేసుల మాటేమిటి?

చుట్టుప్రక్కల పల్లెలనించి పనికోసం పట్టణాలకి వచ్చి, సాయంత్రం తిరిగి వెళుతూ తమ సంపాదనలోంచి కావలసిన వస్తువులు కొనుక్కొని, సంచీ తెచ్చుకోలేదు కాబట్టి, ఓ పావలా పెట్టి ప్లాస్టిక్ సంచీ కొనుక్కొని, దాంతో ఇంటికి బయలుదేరినవాళ్లని, ముఖ్యంగా ఆడవాళ్లని పట్టుకొని, రూ.100/- కడతావా చస్తావా అని బెదిరించి, సంచీలో సరుకులతోసహా "స్వాధీనం" చేసుకొని కేసులు వ్రాశారు!

మళ్లీ ఓ పదిహేనురోజుల తరవాత షాపులని చుట్టేసి, "మేం కవర్లు వాడడం మానేశాం మొర్రో" అంటున్నా, "బోర్డు పెట్టలేదు" అనో, మేమూ కేసులు వ్రాసుకోవాలికదా, ఓ 500 ఇవ్వండి, 250 కి రసీదు ఇస్తాములెండి! అంటూ మళ్లీ దండుకున్నారు.

ఇప్పుడింక, 40 మైక్రానుల వరకూ నిషేధించే యోచన చేస్తున్నారట!

అసలు ఈ "నిషేధం" యెందుకు?

వాళ్లు చెప్పే కారణాలు--పర్యావరణానికి నష్టం కలుగుతుంది అనీ, పశువులు వాటిని తినేసి, చచ్చిపోతున్నాయి అనీ, వాటిలో వేడి వేడి పదార్థాలు పట్టుకెళ్లడంతో, రసాయనిక చర్య జరిగి, ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారనీ--అంతే!

ఈ అంశాలకి తగ్గ ఋజువులు వున్నాయా? వుండవు. పర్యావరణం సంగతి ప్రక్కనపెట్టి, మిగిలినరెండిటి గురించీ మాట్లాడుకొంటే--యే పశువులు చచ్చిపోతున్నాయి? పోషించుకునేవాళ్లెవరూ అంత నిర్లక్ష్యంగా ప్లాస్టిక్ సంచులు కలిపి వాటికి ఆహారం పెట్టరు కదా? యెటొచ్చీ, రోడ్లమీద తిరుగుతూ, ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తూ, రోడ్లప్రక్కన అడ్డమైన చెత్తా తింటూ, రోడ్డు మధ్యన తీరిగ్గా పడుకొని నెమరు వేసుకొనే--యెవరికీ చెందని పశువులేనేమో!

ఇంక, వేడి పదార్థాలవల్ల ఆరోగ్యం చెడిపోయి, హాస్పటళ్లలో పడ్డవాళ్ల సంఖ్య యెంత? రికార్డులేమైనా వున్నాయా?

ఇంక పర్యావరణం విషయానికొస్తే--నిజమేనండీ, వొప్పుకున్నాం--"ప్లాస్టిక్" వల్ల (కేవలం సంచులవల్లనే కాదు!) నష్టం జరుగుతుంది. ఒక ప్లాస్టిక్ సంచి, భూమిలో శిథిలమవడానికి "లక్ష సంవత్సరాలు" పైగా పడుతుందంటారు. సరే. 

దీనికి పరిష్కారంగా, "బయో డిగ్రేడబుల్ ప్లాస్టిక్" కనిపెట్టారు. అంటే, అది భూమిలో తొందరగా శిథిలమైపోతుందన్నమాట. కానీ అది చాలా ఖరీదైన వ్యవహారం! అందుకని దానితో ఇప్పటివరకూ సామాన్యులు వాడే వస్తువులేమీ తయారు చెయ్యబడడంలేదు. 

ఇక రెండో పరిష్కారం, "రీ సైక్లింగ్". అంటే, ఓ సారి వాడేసిన వస్తువులని, మళ్లీ కరిగించి, ఆ ప్లాస్టిక్ తో మళ్లీ కొన్ని వస్తువులని తయారు చేసి అమ్ముకోవడం. 

ఇప్పటికీ, కొన్ని కోట్ల కోట్ల "వాటర్ బాటిళ్లూ"; "కూల్ డ్రింక్ బాటిళ్లూ"; కాఫీ, టీ, మంచినీళ్ల గ్లాసులూ; ప్లాస్టిక్ తోనే తయారవుతున్నాయి. ఇంకా, వాల్ మార్ట్, స్పెన్సర్స్, పీటర్ ఇంగ్లండ్, పార్క్ అవెన్యూ, వాన్ హ్యూసెన్ లాంటివాళ్లూ, బట్టల షాపులవాళ్లూ పెద్ద పెద్ద (పైన తాళ్లతోసహా) ప్లాస్టిక్ సంచులలోనే వాళ్ల వస్తువులని కొనుగోలుదార్లకి ఇస్తున్నాయి! (మన చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఇంకా చిన్న పట్టణాల్లోని బట్టల షాపుల వాళ్లూ--రెండు కర్రలతో, బిగ్ షాపర్ అనబడే--గోగునార, జనపనార సంచులని ఇచ్చేవి. ఇప్పుడు అవి కూడా మానేశాయి అనుకుంటా).

ఇంక, పరుపులూ, దిళ్లూ నించి, ఎఫ్ ఎం సీ జీ లవరకూ, ఎలెక్ట్రానిక్ వుత్పత్తులవరకూ అన్నీ యెంతెంత పెద్ద ప్లాస్టిక్ కవర్లలో అమ్మబడుతున్నాయో అందరికీ తెలుసు! ప్రతీ బడ్డీ కొట్టులోనూ దండలు, దండలుగా వ్రేళ్లాడే వక్కపొడి, గుట్కా (ఈమధ్య సుప్రీం కోర్టు వీటిమీద కళ్లెర్రజేసింది!) షాంపూ, కేశతైలం, లేస్, బింగో, హల్దీరామ్‌స్, ఇంకా స్థానిక వుత్పత్తులు--పచ్చళ్లూ, అప్పడాలూ, జంతికలూ, చెగోడీలూ, పప్పుచెక్కలూ--లాంటివాటిగురించి చెప్పనఖ్ఖరలేదు.

మరి, 20 మైక్రాన్లో యెంతో వున్న సంచులు చేసుకున్న పాపం యేమిటీ?

ఇక్కడో చిన్న లెఖ్ఖ--ఒక పచ్చి అరటిపండు ముగ్గవేస్తే, రెండోరోజుకి (అంటే ఒకరోజులో) పండిపోతుంది. మరి ఓ గోదాములో లక్ష పచ్చి అరటి పళ్లని ముగ్గవేస్తే, అవి యెన్నాళ్లకి పండుతాయి? మామూలు లెఖ్ఖ ప్రకారం లక్ష రోజులేకదా?

........మిగతా మరోసారి.

Monday, February 21

'సీ' నియర్లు



ముగ్గురు ముసలి మూర్ఖులు

ఒకళ్ల రహస్యాలొకళ్లు భలే బయట పెట్టేసుకొంటారు--ఆ ముగ్గురూ!

ఓ సారి ఒకాయన రష్యాలో అధ్యక్ష భవనం ముందర నుంచొని, గట్టిగా, "బ్రెజ్ నెవ్ వట్టి మూర్ఖుడు!" అని గట్టిగా అరిచినందుకు, 1+15 సంవత్సరాలు జైలు శిక్ష వేశారట. అలా యెందుకు అని అడిగితే, అధ్యక్షుణ్ణి తిట్టినందుకు ఒక సంవత్సరం, జాతీయ రహస్యాన్ని బయటపెట్టినందుకు 15 సంవత్సరాలూ అని జవాబిచ్చారట!

అలాగ--మొన్నోసారి కాకా "సోనియా షుడ్ గో" అని అని కరాఖండీగా చెప్పేశాడు. 

వెంటనే, కేకే, ఆయన నోట 'వినరాని మాటలు' వినవలసి వచ్చింది అనీ, ఆయన 'యేమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియని స్థితిలో' మాట్లాడారు అనీ, 'కన్‌ఫ్యూజ్డ్, డిస్టర్బ్ డ్ మైండ్ తో' వున్నట్టు కనిపిస్తోంది అనీ, 2-3 యేళ్లక్రితం కేవీపీ సోనియాకి డబ్బుల మూటలు పంపిస్తే, ఆయన 'అప్పుడే యెందుకు మాట్లాడలేదు?' అనీ, చెరిగేశాడు.

ఇంకోడు--వీ హెచ్, 'రాష్ట్రపతి పదవి ఇవ్వలేదనే అక్కసు తోనే' ఆయన అలా మాట్లాడడనీ, 'ముదిమి మీద పడడంతో' అలా మాట్లాడాడనీ, 'బాగా తిని, అబ్బే యేమీ తినలేదు' అన్నట్టు ఆయన వ్యవహారం వుంది అనీ, రాజ్యసభ సభ్యులుగా తామందరూ 'ఏకగ్రీవంగా' యెన్నిక కావడానికి 'చిరంజీవే కారణం' అనీ, ఒక్క యెన్నికలోకూడా పోటీ చెయ్యని తెరాస తో పొత్తుకు 2004 లో 'నువ్వెలా వెళ్లావు?' అనీ, ఇలా మండిపడ్డారు.

నిన్న (20-02-2011), 'గవర్నరు తెలంగాణా ప్రజలని మానసికంగా హింసించబట్టీ', బయట ప్రజలంతా 'సహయనిరాకరణలో తలమునకలై' వీధుల్లో వుంటే, తన ప్రసంగంలో గవర్నర్ కనీసం తెలంగాణా ప్రసక్తికూడా తేవకపోవడమే వాళ్లకి మానసిక హింస అనీ, బయట వున్నవాళ్లకే అంత బాధ వుంటే, లోపల వున్న ఎమ్మెల్యేలకి యెంతబాధ వుంటుందో కదా, అందుకే వాళ్లు 'అలా చేశారు' అనీ, అలా అని వాళ్లని తాను సమర్థించను అనీ, జేపీ సభలో చర్చిల్ ని పొగిడాడు అనీ, అసెంబ్లీ 'గూండాల అడ్డా'గా మారిందని అన్నాడనీ, అందుకే వాళ్లు 'అలా చేశారు' అనీ, మరి గూండాలూ, వెధవలూ వున్న సభలో ఆయన ఎందుకు వున్నారు? అనీ, ఆయనతోపాటు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావుని కూడా కొట్టినా, దానిగురించి యెవరూ మాట్లాడలేదు అనీ "ఆవేదన చెందారు"ట.

ప్రసంగం అనేది యెవరుచేసినా, తమ వుద్దేశ్యాన్ని సభాసదులకి వెల్లడించడానికే అనీ, తన ప్రభుత్వం అనుసరించబోయే విధానాల గురించిమాత్రమే ఆయన చెపుతాడనీ, అందులో తెలంగాణా గురించో, తోటకూర గురించో మాట్లాడవలసిన అవసరం లేదనీ, అలామాట్లాడాలని కోరే హక్కు యెవరికీ లేదనీ, అంతకు వారం రోజులముందునించీ, తెరాస వాళ్లు గవర్నరు ప్రసంగాన్ని అడ్డుకుంటాము అనీ, ప్రసంగ ప్రతులు చించి వాడి ముఖాన కొడతాము అనీ, ప్రసంగం సాగకుండా బలప్రయోగమైనా చేస్తాము అనీ ప్రకటిస్తున్నారు అనీ, వాళ్ల ప్రజలు చేస్తున్న సహాయ నిరాకరణల్లా, బస్సుల్లో టిక్కెట్టు కొనకుండా ప్రయాణించడమే అనీ, జేపీ యెంతమందికి, యెలాంటివాళ్లకి నాయకుడైనా, గూండాగా మారక తప్పదని హెచ్చరిస్తున్నాననీ, పాలడుగుని కొట్టినా తప్పులేదుగానీ, దాన్ని గురించి మాట్లాడకపోవడం పెద్ద తప్పనీ, ఇలాంటి మాటలవల్ల మీడియా వాళ్లముందూ, ప్రజలముందూ తనకి 'మతిస్థిమితం లేదు' అని ప్రకటించుకుంటున్నాను అనీ--ఆయన మరిచిపోతూంటాడు.

వీటినిబట్టి మనం అర్థం చేసుకోవలసినది యేమిటీ?

"పోవయ్యా! నువ్వేమిటి అర్థంజేసుకొనేది! మేము యేదో మాట్లాడతాం. కోడిగుడ్డుకి ఈకలు పీకడం యెందుకు? రేపు మళ్లీ మేమే ఖండించుకుంటాం.....ఆమాత్రానికి నీ టపా వోటి.....పోవయ్యా" అంటారు ఆ 'త్రయం'. నాకు తెలుసు. 

(వీళ్ల గురించి సోనియాకి యెవరూ సరిగ్గా చెపుతున్నట్టు లేదు. చెప్పివుంటే ఈపాటికి ఒకడు తిహార్ లోనూ, ఒకడు చంచల్ గూడా లోనూ, ఒకడు చర్లపల్లి లోనూ వూచలు లెఖ్ఖపెడుతూ వుండేవారేమో!)

Friday, February 18

సమూల నాశనానికి



శ్రీకారం చుట్టుకొన్నారా?

అజాత శత్రువు లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ మీద లాఠీ దెబ్బలు పడ్డాయి....ఇందిరా గాంధీ మళ్లీ అధికారం లోకి రావడానికి, బురదల్లో యేనుగు మీద "బెల్చి" కి యాత్ర చెయ్యవలసి వచ్చింది.

ఇప్పుడు మరో జే పీ 'తల మీద ' దెబ్బలు పడ్డాయి. మరి చాణక్యుడు నందవంశ నిర్మూలనానికి శపథం చేసినట్టు, ఈయన "ప్రత్యేక తెలంగాణా అంశాన్ని భూస్థాపితం చేసేవరకూ, కే సీ ఆర్ పార్టీని సమూలంగా నాశనం చేసేవరకూ, నా జుట్టు కత్తిరించుకోను" అని యేమైనా భీషణ ప్రతిఙ్ఞ చేస్తాడా?

ఇప్పటికైతే చెయ్యలేదు. ముందు సంగతి చూద్దాం!

Thursday, February 17

స్కామాయణం



కుంభకోణాలు

ఒక దాని గురించి రాద్దామనుకొంటూండగానే ఇంకొకటి బయటికి వస్తూంది!

కామన్వెల్త్, ఆదర్శ్, 2జీ, ఇప్పుడు ఎస్ బ్యాండ్!

ఇంకా రాష్ట్రంలో--జగనే కాకుండా ఎమార్, ఇప్పుడు దిలారా!

మన్మోహనేమో, అమాయక చక్రవర్తిలా మొహం పెట్టి, మీడియా వాళ్లు ఇలా బయటపెట్టుకుంటూ పోతే, మన దేశం 'స్కాముల దేశం' గా ప్రసిధ్ధికెక్కేస్తుంది--మీరు బయట పెట్టొద్దు అంటున్నాడు!

2జీ లో, రాజాకి 'నిబంధనలకి దూరంగా యేమీ చెయ్యద్దు' అని మాత్రమే సలహా ఇచ్చాడట ఆయన. ఆ తరవాతేమి జరిగిందో తనకి తెలియదట. పైగా మీరందరూ "ఆ శెట్టిగారిలా" మాట్లాడితే యెలా? అని విసుక్కుంటున్నాడట!

ఆ శెట్టిగారి కథేమిటి అంటారా? వెనకటికి "ఇవాళ పొద్దున్నే లక్ష రూపాయల నష్టం" అన్నాడట. అదెలా? అనడిగితే, "నేను కొన్న భాగ్యలక్ష్మీ లాటరీ టిక్కెట్టుకి నిన్న తీసిన డ్రా లో లక్ష రూపాయల బంపర్ ప్రైజు తగల్లేదు. మరి రావలసిన సొమ్ము రాకపోవడం నష్టమే కదా?" అన్నాట్ట.

మన్మోహన్ కూడా, రావలసిన 1,76,000 కోట్లు రాలేదని అదంతా నష్టం అంటే యెలాగ? అని క్రొశ్నిస్తున్నాడు!

మరి ఎస్ బ్యాండుకి సంబంధించి, ఓ రెండు లక్షల కోట్లట! ఆ శాఖకి మంత్రి ఆయనేనట! 2005 నించో యెప్పటినించో ఆ వ్యవహారం జరుగుతుంటే, ఇప్పుడింకా ఆ వొప్పందాన్ని రద్దు చెయ్యాలా వద్దా అని కమిటీలు వెయ్యడం లోనే వున్నారు. పైగా కాంట్రాక్టు రద్దు చేస్తే వాళ్లకి నష్టపరిహారం ఇచ్చుకోవద్దూ? అని ఓ వాదన!

ఇంక దర్యాప్తులూ శిక్షల సంగతి ఆ దేవుడే యెరుగు.

మన రాష్ట్రం విషయానికొస్తే, దిలారా వ్యవహారం లో, బొటానికల్ గార్డెన్, బర్డ్ పార్క్, ఇంకేదో నిర్మిస్తామని, స్టార్ హోటెళ్లూ, మల్టీప్లెక్స్ లూ, పబ్బులూ, బార్లూ కట్టేస్తున్నారట. పైగా యెవడాపుతాడో చూస్తామంటూ, గోతులు తవ్వేస్తున్నారట!

ఈజిప్టు తరహా ఆందోళన మన దేశం లో రాదు యెందుకంటే మనది అల్రెడీ ప్రజాస్వామ్య దేశం కదా! అని కూడా మన ప్రథాన మంత్రే సెలవిచ్చారు. యెంత ధీమానో!  

బాగుంది కదూ?

Tuesday, January 18

మన ఆచారాలు - 10

......భోజనాలు

తంబోలా నడుస్తూండగానే, భోజనాల ప్రహసనం ముగియగానే, పదార్థాలని వొబ్బిడి చెయ్యడం మొదలెడతారు--వంటపుట్టీ, అతని సహాయకులూ, నిర్వాహకుల్లో ఆ శాఖ చూసేవారూ. 

సాధారణంగా పదార్థాల్లో తక్కువ తక్కువగా మిగిలేవి--బాగున్న కూరలూ, బండ పచ్చడీ, అన్నం, సాంబారూ. ఇవన్నీ, చుట్టుప్రక్కలవాళ్లకీ, పాత్రలు తోమడానికీ, ఆకులు యెత్తడానికీ వొప్పుకున్నవాళ్లకీ చెల్లించేస్తారు.

ఇంక, యెక్కువగా మిగిలేవి--పులిహోరా, కాస్త కారం యెక్కువైన కూరా, రసం, పెరుగూ! అవి కావలసిన వాళ్లు వాళ్ల ఇళ్ల దగ్గర దింపేసుకుంటారు--పులిహోరా, వుంటే పెరుగూ మాత్రం ముఖ్య నిర్వాహకుల ఇళ్లకి చేరతాయి. (నిర్వాహకులూ, వాళ్ల కుటుంబాలూ వొళ్లు హూనం అయిపోయి వుంటారు కాబట్టి, ఆ రాత్రికి వాటితో సరిపెట్టుకుంటారు!)

ఇవీ, మిగతా పాత్ర సామానూ, టెంటూ వగైరాలు అన్నీ వ్యానుల్లో సర్దించబడి, ఆ తోట ఖాళీ చెయ్యబడేసరికి రాత్రి 8.00 అవుతుంది. 

వ్యానులూ, నిర్వాహకుల వాహనాలూ బయలుదేరతాయి--వీలైతే మళ్లీ యేడాది వస్తామేం? అని తోటకి టాటా చెపుతూ.

మర్నాడు, మిగిలిన బహుమతుల వస్తువులూ, సంభారాలూ తిరిగి ఇచ్చేసి, వాళ్ల ఎకవుంట్లు సెటిల్ చేసి, లెఖ్ఖలు చూసుకొంటే, కటా కటిగా సరిపోతాయి వసూలు చేసిన డబ్బులు. పదో పరకో పడితే, నిర్వాహకులే వేసుకొంటారు, మిగిలితే, మళ్లీ సంవత్సరానికి బ్రాటోవరు.

ఇళ్లకి వెళ్లేవాళ్లు "చాలా బాగా జరిపించారండీ!" అంటూ ఇచ్చే సర్టిఫికెట్ కన్నా నిర్వహకులకి కావలసిందేముంటుంది?

Monday, January 17

విందు భోజనాలు

వంటలూ.....పిండివంటలూ

....పంచభక్ష్యాలూ.....పరమాన్నాలూ!

(యెలాగూ "సుష్టు భోజనాల" గురించి వచ్చింది కాబట్టి--బ్లాగుల్లోకూడా వంటలేనా అని విసుక్కున్న వీడేమిటీ.....వంటలూ అంటూ మొదలెట్టాడు.....అని కొక్కిరించకుండా--చదవండి మరి!)

వంటలు అంటే, మనం రోజూ వండుకుని తినేవి--పప్పూ, కూరా, పచ్చడీ, చారూ/పులుసూ--లాంటివి.

పిండివంటలంటే, ప్రత్యేకంగా, అదనపు రుచీ, అనుభవం కోసం వండుకొనేవి.

వాటిలో......

భక్ష్యాలూ, భోజ్యాలూ, చోష్యాలూ, లేహ్యాలూ, చిత్రాన్నాలు--ఇవీ పంచ భక్ష్యాలు.

ఇంకా పరమాన్నాలు!

భక్ష్యాలు అంటే--బాగా నమిలి తినాల్సినవి--బొబ్బట్లూ, గారెలూ, ఫేణీలూ, పోణీలూ, చక్కిలాలూ--ఇలాంటివి ఇంకా చాలా వున్నాయి.

భోజ్యాలు--అంటే అంత కష్ట పడఖ్ఖర్లేకుండా, తేలిగ్గా నిమిలి, మింగేవి--జాంగ్రీలు, జిలేబీలు, బూరెలు, కజ్జికాయలు--ఇలాంటివికూడా చాలా వున్నయి.

చోష్యాలు అంటే--జుర్రుకొనేవి--కాజాలూ, బాద్షాలూ, చంద్రకళలూ--ఇలాంటివి.

లేహ్యాలు అంటే--నోట్లో వేసుకొని, అంగిటికి అంటించుకొంటేచాలు, కరిగిపోయి గొంతులోకి వెళ్లిపోయేవి--అంటే చప్పరించేవి--రవకేసరి, సత్యనారాయణ ప్రసాదం, హల్వా, కోవా, ఇప్పటి ఐస్ క్రీములూ--ఇలాంటివి.

చిత్రాన్నాలు అంటే, "పులిహోర, యెలిహోర, మెలిహోర, కలహోర, పుళిందుహోర, చక్కెర పొంగలి, పొంగలి, క్షీరాన్నం (దధ్యోదనం)". ఇంకా నేటి పలావులూ, బిర్యానీలూ, ఫ్రైడ్ రైస్ లూ!

పరమాన్నాలు అందరికీ తెలుసు--అన్నం పరమాన్నం, సగ్గుబియ్యం పాయసం, సేమ్యా పాయసం--ఇలా! 

బ్రాహ్మణులూ, క్షత్రియులూ, కోమట్లూ, ఆపైన కమ్మవారూ, కాపులూ....ఇలా అందరూ తమ "కులోచితంగా" శతాబ్దాల తరబడీ ఇలాంటి విందులు ఇస్తూనే వున్నారు--వాళ్ల తాహతునిబట్టీ! తినేవాళ్లు లొట్టలువేసుకొంటూ తింటూనే వున్నారు!

(మరో టపా ఖచ్చితంగా వనభోజనాల ముగింపు గురించే!)

Saturday, January 8

ఆంథ్ర భవితవ్యం

శ్రీకృష్ణ కమిటీ

అయ్యింది! గవర్నరు నరసిం హం గారన్నట్టు, డిసెంబరు 31 తరవాత....జనవరి ఫస్టే వచ్చింది!

వడ్లగింజలో బియ్యపుగింజే వుంటుంది....అని తేల్చింది శ్రీకృష్ణ కమిటీ!

చిన్నపిల్లవాడు సైతం సూచించగల రెండు పరిష్కారాలనీ సూచించడానికి, పదినెల్లు శ్రమించి, డబ్బుచేసిన (చేసుకొన్న) రిపోర్టు ఇచ్చింది! ఇంకా కొన్ని విచిత్రమైన పోకడలు పోయింది--ఆరెండే పరిష్కారాలు అని నిర్ధారించడానికి!

తాను పట్టిన.....మూడే....కాదు....రెక్కలుకూడా వున్నాయి.....అనేవాళ్లకి ఇవన్నీ చెవికెక్కుతాయా?

రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తారట!

నివురుగప్పిన నిప్పు మీద వాయువు చిమ్మద్దురా.....ఒరే! నాశనమైపోతావు! జాగ్రత్త!

ఇది నా శాపం కాదు.....కాంగీల సంస్కృతి!

ఖబడ్దార్!

Wednesday, January 5

మన ఆచారాలు - 5 మీద....2.

వ్యాఖ్యాతలకి....

నా ఇంతకు ముందు 5 టపాలనీ, తరవాతి టపాలనీ కూడా శ్రధ్ధగా చదవండి.....నేనెక్కడైనా 'సుష్టు భోజనాల గురించి' వ్రాశానా?

'.....వదలండి' అన్నది యెవరు? శరత్ దాన్ని అపాన వాయువు అన్నాడంటే అది అతని తప్పా? 

ఇంక ఆ వెధవలకి యెప్పటికప్పుడు సమాధానాలు ఇస్తూనే వున్నాను. యెవరూ మాట్లాడలేదు......మళ్లీ!

మన పంచ ప్రాణాలూ.....పంచ వాయువుల్లో వున్నాయి.....అవి 'ప్రాణ....' వగైరాలు. ఇవి చెట్లనించీ, మనుషులనించీ, జంతువులనించీ, నీళ్లనించీ, రాళ్లూ--నేల నించీ వ్యుత్పత్తి అవుతాయి. 

పల్లెల్లో, ఓపెన్ లెట్రిన్ల నించి ఈ అపానవాయువులు మిగిలిన అన్నివాయువులతో గాలిలో కలిసేవి. ఇప్పుడు అవి లేవు.....ఫలితం.....రకరకాల రోగాలు! 

రాజేష్ జి(ల)గాడి మద్దతుదారు అన్నోన్ వ్రాస్తాడూ...."Andhra పిత్తు (Fart), అపానవాయువు (Fart) శ్రధ్ధు (Fart). Additional references: Amdhra, India, Fart." అని!

ఒరే వెధవా! ఇంటర్నెట్లో సెర్చ్ చెయ్యడం కాదు....అసలు విషయం తెలుసుకో!

'ఆంధ్ర' అంటే, మన భూమి. నువ్వు కెలికింది 'ఆంత్ర'ము . అంటే మన పేగుల్లోనూ అక్కడా వుండేది.

మన ప్రాచీన నాడీనిదానంలో వైద్యుడు తన కుడిచేతి మూడు వేళ్లతో, రోగి చేతి మణికట్టుకి కొంచెం పైన నాడి పట్టుకోడానికి ప్రయత్నం చేస్తాడు. అక్కడ వైద్యుడి వుంగరం వేలుకి నాడి బలంగా తగిలితే, 'వాతం'; మధ్యవేలికి తగిలితే, 'పిత్తం'; చూపుడువేలికి తగిలితే, 'శ్లేష్మం' అనేవారు. అంటే వరుసగా--'చలవ చేసింది'; 'వేడి చేసింది'; 'రెండూ కలిసి, వూపిరితిత్తుల్లో ఖఫం చేరింది' అని! (పిత్తం యెక్కువైతే, పైత్యం అనేవారు! మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య అలాంటి వైద్యుడు...వాతం ఒక పాలు, పైత్యం రెండుపాళ్లు...అంటూ)

(ఇంకా ఈ వైద్యం గురించి, ఫణిబాబుగారు వ్రాసిన 'అగ్నితుండి మాత్రలూ' వగైరాల గురించీ, యెవరైనా అడిగితే ఓ టపా వ్రాస్తాను)

ఇంకోడంటాడూ.....'తన ఙ్ఞాపకాలని గుర్తు చేసుకొంటున్నాడు.... వదిలెయ్యండి....'అని. అంతేగానీ....నేను వ్రాస్తున్నవి పచ్చి నిజాలనీ, మూర్ఖులకి కనువిప్పులనీ వొప్పుకోరు!

'వెధవలూ, పందులూ' అంటూ తిట్టుకున్నారు తప్ప, 'అసలు విషయం' మీద 'ఱొమ్ము విరుచుకుని' నన్నెదుర్కున్న వెధవగానీ, పంది గానీ లేడు.....గమనించండి!


విఙ్ఞులు క్షమించాలి. చిన్న.....కాదు....పెద్ద పొరపాటే! పై వాక్యం వ్రాశాక మళ్లీ దాని వంక చూడకుండా ప్రచురించేశాను. మిత్రులు చెప్పిన తరవాత, రెండు మూడు సార్లు చదివితే, అవును నిజమే కదా.....'యెదుర్కున్న.....' (అందరూ....) అనే అర్థం వస్తుంది కదా? అని.

దాన్ని--'....నన్నెదుర్కున్న మనిషెవడూ లేడు......' అని సవరిస్తున్నా.

మరోసారి క్షమాపణలతో....

......ఇక వన భోజనాల ముగింపే తరవాయి.