Saturday, April 3

వివాహ......

సహజీవనం

ఈ మధ్య మన సర్వోన్నత న్యాయ స్థానం సహజీవనాలని సమర్థించింది.

ఇంతకు ముందు నా టపాల్లో సహజీవనం లో వున్న లాభాలని చర్చించడం జరిగింది. మన ప్రభుత్వం 'మైత్రీ కరార్' లని చట్టబధ్ధం చేస్తే బాగుండును.

సహజీవనం మాటెలా వున్నా, 'రాధాకృష్ణులు కూడా' అని న్యాయస్థానం ప్రస్తావించడాన్ని గురించి పిసుక్కుంటున్నారు కొంతమంది స్వాములూ, పీఠాధిపతులూ!

ఆ మాటకొస్తే, 8 మందిని వివాహం చేసుకున్న కృష్ణుడు, మరో పదహారువేల ఒక్క మంది స్త్రీలతో సహజీవనం చేసేవుంటాడు (రాధ తో కలిపి).

ఆ పదహారువేలమందీ 'గోపికలు' అని కొంతమందీ, జరాసంధుడి చెరలోంచి విడిపించిన కన్యలు అని కొంతమందీ స్వాములూ, పీఠాధిపతులూ అంటారు.

ఈ మధ్యలో సందట్లో సడేమియా గా సానియా మీర్జా ఒకతి వచ్చింది--తనకి ఇంతకుముందు జరిగిన నిశ్చితార్ధం రద్దు చేసుకొని, పాకిస్తాన్ పౌరుడు, ఆ దేశం తరఫున క్రికెట్ ఆడే షోయబ్ ని పెళ్ళి చేసుకుంటానంది.

ఓ స్త్రీ తన కన్యాత్వాన్నీ యెవరితో పోగొట్టుకోవాలో, యెవరితో సంసారం చెయ్యాలో పూర్తిగా ఆమె ఇష్టం అని మరిచిపోయిన వాళ్ళు--ఇండియాలో నీకు మగాడే దొరకలేదా? అని అడుగుతున్నారు!

ఆమె ఇప్పటికే అతడితో అనేకసార్లు కొన్ని కొన్ని రోజులపాటు సహజీవనాలు సాగించింది అని కూడా వార్తలు వచ్చాయి.

అది ఆమె ఇష్టం--కాని పెళ్ళి మాత్రం భారతీయుణ్ణే చేసుకోవాలి అని అనేవాళ్ళని యేమనాలి?

మూర్ఖాగ్రేసర చక్రవర్తులు అనచ్చేమో!

No comments: