Wednesday, November 26

మహిళాలక్షాధికారులు!


మన ముఖ్యమంత్రి గారికి ఉట్టికెక్కలేక పోయినా, స్వర్గానికి యెక్కాలని ఆశ!
(మోటు సామెత చెపితే, ‘పిత్తడానికి శక్తి లేదు గానీ, పాసనాలకి మందు అడిగాడట!)’

‘లక్ష కోట్ల బడ్జెట్’ ‘ముష్టెత్తైనా జలయఙ్ఞం సాగిస్తాం’ ‘భూములమ్మి, నిధులు సంపాదిస్తాం’ లంటి మాటలతో ప్రారంభించిన ఇన్నింగ్స్, ఫాలో ఆన్ తో ముగించాల్సిన పరిస్తితి వొచ్చేట్టుంది!

అసలే ప్రతిపక్షాలూ, పత్రికలూ, కోర్టులూ, ట్రిబ్యునళ్ళూ, ‘కాగ్’, రైతులూ, సెజ్ బాధితులూ, కారిడార్ బాధితులూ తో పాటు సామాన్యులు కూడా (గుత్తేదార్లూ, సెజ్ ల లబ్ధిదార్లూ తప్ప) చీల్చి చెండాడుతున్నారు!

పులి మీది పుట్రలా ఆర్ధిక మాంద్యం—రియల్ ఎస్టేట్ వ్యాపారం పడుకోవడంతో, ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి!

అయినా, మేకపొతు గాంభీర్యం ప్రదర్సిస్తూ—‘చేబదుళ్ళకి వెళ్ళం’ అంటున్న ఆర్ధిక మంత్రి, నకనకలాడుతూ డిపార్టుమెంటులు వుండగా, మన ముఖ్య మంత్రి మాత్రం “కోటి మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాం—పావలా వడ్డీతో!” అంటూ ప్రకటనలు!

యెవరి చెవుల్లో పువ్వులు పెడతారు?

(మహిళా గ్రూపుల గురించి మరోసారి!)

No comments: