Saturday, November 7

లాలూ మూర్ఖః


అగ్రేసరీ మమత!


రైలు బోగీల్లో బిగించిన 'కక్కుర్తి ' బెర్తులవల్ల యెంత నష్టం జరిగిందో, యెన్ని ప్రాణాలు పోయాయో యవరైనా లెఖ్ఖవేశారా?  


చులాగ్గా అవి తొలగించాలని నిశ్చయించారు!  


ఇప్పుడైనా యేమైనా సుఖం గా వుందా ప్రయాణికులకి? లేదు--యెందుకంటే, కక్కుర్తి బెర్తులకోసం మామూలు పై బెర్త్ ని ఓ ఆరంగుళాలు పైకి జరిపారు! ఇప్పుడు మధ్య వేసిన కక్కుర్తి బెర్త్ ని తొలగించేసి, చేతులు దులుపుకుంటున్నారు--మరి పై బెర్త్ ని ఆరంగుళాలు క్రిందకి యెవరు జరుపుతారు? వాళ్ళ బాబులా?  


అందుకే అన్నది 'లాలూ మూర్ఖః' అని!  


ఇక మమతాదీ--తనభాషలో 'తురంతో' అన్నవాటిని (హిందీలో 'తురంత్ ' అంటే శీఘ్రం గా అని అర్థం! అది వాళ్ళ భాషలో పదాలన్నిటికీ 'ఓ' కారం చేర్చే పధ్ధతివల్ల తురంతో అయ్యింది) మీడియా ఇష్టం వచ్చినట్టు 'దురంతో' (దుః+అంతః--అంటే చెడు అంతము కలిగినవి) అనీ, 'డ్యురాంటో' (ఇదేదో ఫ్రెంచ్ పదం లా వుంటుంది) అనీ పొగిడేశాయి!  


మరి ఈ రోజున, ఆ 'తురంతో' (అత్యధిక దూరపు, మధ్యలో యెక్కడా ఆగని) రైళ్ళకి, 'టెక్నికల్ స్టాపులు ' అని కనీసం 6 చోట్ల కనీసం అరగంటసేపు ఆపుతున్నారట! కానీ, అక్కడ యెవరైనా ప్రయాణికులు దిగిపోవచ్చుగానీ, యెవరూ యెక్కకూడదట! (మరి దిగిపోయేవాళ్ళుకూడా మొదటినించీ చివరివరకూ టిక్కెట్టు తీసుకోవాలో యేమిటో!).  


అలా అయినా, ఈ రైళ్ళన్నీ, 21 నించి 24 శాతం మాత్రమే నిండుతున్నాయట--76% ఖాళీగానే గమ్యస్థానం చేరుతున్నాయట! పైగా అన్నీ ఏ సీ బోగీలేనట! ఇక కనీసం 75 మంది ప్రయాణించవలసిన బోగీల్లో, అటెండెంట్లూ, హెల్పర్లూ, హాకర్లూ, టీ టీ ఈ లూ, 75 బ్లాంకెట్లనీ కప్పుకొని, హాయిగా నిద్రా, ఇతర సుఖాలని అనుభవిస్తున్నారో, యేమిటో!  


అందుకనే అన్నది--అగ్రేసరీ మమత--అని!  


దీనికైనా యెవరినైనా బాధ్యుల్ని చేస్తారా?  


ఇలాంటివాటికి ఓ 'తెల్ల యేనుగు ' ప్రభుత్వ సంస్థ వుంది-- 'సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ' అని! వాళ్ళెప్పుడూ ప్రభుత్వానికీ, యాజమాన్యాలకీ పాదాలొత్తుతూ, చిన్న చిన్న వుద్యోగుల్ని బలిపశువుల్ని చేస్తూ వుంటారు!  


దాని గురించి మరోసారి!



No comments: