Sunday, September 13

అధిష్టానం మార్కు.....

 
ముఖ్యమంత్రెవరు? 

రాజశేఖర రెడ్డి కరువు ప్రకటనకి రోకలి నానేస్తే, ఇప్పుడు అధిస్టానం ఆయన తరవాత ముఖ్యమంత్రెవరు అని తెలియడానికి మళ్ళీ రోకలి నానేసిందట!  

అది పూర్తిగా నానగానే, సీల్డు కవరు పంపిస్తారట!  

ఈ లోపల రాజ్యాంగేతర శక్తి ఒకాయన పొద్దున్నే ఢిల్లీ కి మళ్ళీ రాత్రికి హైదరాబాదుకీ ప్రయాణాలు సాగిస్తున్నాడు. అక్కడ ఒక్కో అరగంటో, గంటో 'చిన్న అధిష్టానాల 'తోనూ, వీలైతే ఇంకో అరగంటో యెంతో 'పెద్ద అధిష్టానాల 'తోనూ సంప్రదింపులు సాగించి, హైదరాబాదు వచ్చాక 'అంతా సవ్యంగానే వుంటుంది--మీరందరూ నోరెత్తనంతవరకూ!' అని అందరినీ సవరదీస్తున్నాడు!  

ఇంత డ్రామా యెందుకో? కాంగ్రెస్ సంస్కృతి తెలియంది యెవరికి? 

ఆ వచ్చే సీల్డుకవర్ లో 'శ్రీమతి రాజశేఖర రెడ్డి ' పేరు వ్రాసి, సీ ఎల్ పీ లో ఆవిడ యెన్నిక కాగానే--'ఆంధ్ర ప్రదేశ్ తొలి మహిళా ముఖ్యమంత్రి!' అనీ, 'ఓ స్త్రీ కి ఆ పదవి ఇవ్వడం లో అధిష్టానం త్యాగనిరతి ప్రశంసనీయం!' అంటూ ప్రకటనలు వెలువడి, పులివెందులనించి ఆవిడని పోటీకి దింపినా--ఆశ్చర్యపడక్కర్లేదు!  

(సానుభూతి కార్డూ పని చేస్తుంది, మిగిలిన సామాజిక వర్గాలూ, అసమ్మతులూ మాట్లాడరు--పరిపాలనకి రాజ్యాంగేతర శక్తులెలాగూ వుంటాయి!)  

బహుశా రోకలి మంగళవారానికి నానచ్చు అంటున్నారు!  

చూద్దాం!


3 comments:

Anonymous said...

I think your guess will be right

A K Sastry said...

Dear Anonymous!

I wish it will not be right and better senses to prevail upon the concerned politicians!

Thank you.

A K Sastry said...

Dear Amma Odi!

చాలా సంతోషం!

ధన్యవాదాలు!