Sunday, September 6

రాజకీయం

రాచకం


ఇవాళతో నాలుగు రోజులుగా మన రాష్ట్రం లో ప్రభుత్వం లేదు! (వుంటే, ఇడుపులపాయ ముందు 15 కిలోమీటర్ల మేర 'ట్రాఫిక్ జాం' అవకపోను!)  


సంతాపదినాలు అయ్యేవరకూ 'అధిష్టానం' ఆలోచించదట.  


ఈ లోపల కాకాలు బాకాలు మొదలెట్టారు!  


హనుమంతుడికి రక్తం వుడికిపోతోందట!  


కేకే సాగిలపడిమరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయ్యాలంటున్నాడు!  


'అనుభవం లేకపోయినా ఫరవాలేదు జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి--రాజీవ్ ప్రథాని అయినప్పుడు ఆయనకి అనుభవం లేదు కదా?' అన్నాడు కాకా.  


'రాజీవ్, ఇందిరల కుటుంబం దేశం కోసం త్యాగం చేసింది. నా రక్తం వుడుకుతోంది!' అన్నాడు వీ హెచ్!  


రాజీవ్ యేమి త్యాగాలు చేసి ప్రథాని అయ్యాడో? ఇందిరని కుట్రదారులు చంపడం రాజీవ్ త్యాగమా?  


వై యెస్ ని కూడా యే తీవ్రవాదులో చంపేసివుంటే, అప్పుడు జగన్ త్యాగం చేసినట్టేనేమో--ఈయనకి అభ్యంతరం లేకపోనేమో మరి!  


'123.....133 లెఖలు కాదు--మెజారిటి వుంటే తీర్మానం చేసి, దేశాన్ని అమ్మేద్దామా? సభలో ఎమ్మెల్యేలెంతమంది మద్దతు ఇచ్చినా, సోనియా కాదంటే అది శిరోధార్యం! (వాళ్ళు నోరుమూసుకోవాలి)' అని ప్రజాస్వామ్యానికి కొత్త భాష్యాలు చెపుతున్నాడు కేకే!  


ఇలాచేసే, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని రెచ్చగొట్టింది ఇందిర--వీళ్ళ దన్ను చూసుకొనే! అప్పుడే మరిచిపోయారా?  


నందో రాజా భవిష్యతి!  

No comments: