Monday, September 13

కబుర్లు

అవీ ఇవీ - 3

గుజరాత్ హోం మంత్రి అమిత్ షా ని పోలీసులు అరెస్ట్ చేస్తామనడం, తరవాత ఆయన కోర్టులో లొంగి పోవడం, ఇదంతా రాజకీయ కుట్ర అని కొందర రా నా లు ప్రకటనలివ్వడం--ఇవన్నీ మామూలు వార్తలే అని నేను పట్టించుకోలేదు.

అసలు విషయం మాడభూషి శ్రీధర్ నిన్న (12-09-2010) ఈనాడులో వ్రాసిన వ్యాసం చదివాక అవగతమయ్యింది!

సొహ్రబుద్దీన్ (బూటకపు) ఎన్‌కౌంటర్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారట. సొహ్రబుద్దీన్ నూ, ఆయన స్నేహితుడు ప్రజాపతి ని తరవాత ఆయన భార్య కౌసర్ బీ ని, --ఓ బస్సులోంచి దింపి తీసుకెళ్లి, కాల్చి, అత్యాచారం చేసి, విషం ఇచ్చీ చంపేశారట పోలీసులు.

అసలు సొహ్రబుద్దీన్, ప్రజాపతి అమిత్ షా అనుచరులేనట. వాళ్లిద్దరూ అనేకమంది పోలీసు అధికారులతో కలిసి, బలంతపు వసూళ్లు లంటి నేరాలకి పాలుపడేవారట. తరవాత యెందుకో వీళ్లకి చెడి, ఎన్‌కౌంటర్ చెయించేశాడట.

ఇంకా అమిత్ షా మీద 197 కేసులు వున్నాయట. కొన్ని వేల గంటల ఫోను సంభాషణలు సాక్ష్యం గా దొరికాయట.

మానవహక్కుల న్యాయవాది ముకుల్ సిన్‌హా, ఆయన భార్య నీర్జారీ, జన సంఘర్ష్ మంచ్ అనే సంస్థ ద్వారా ఈ కేసులన్నీ బయటికి వచ్చేలా చేసి, సీ బీ ఐ సుప్రీం కోర్టులో కేసు పెట్టేలా చేశారట.

ఇదీ--ఓ హోం మంత్రి చరిత్ర.

మనదేశ టెలికామ్ పితామహుడు శాం పిట్రోడా, వచ్చే ముఫ్ఫై యేళ్లలో కాగితం డబ్బు మాయమౌతుందనీ, ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ రూపం లోనే జరుగుతాయి అనీ తన తాజా గ్రంధం లో వ్రాశారట. ఇవన్నీ మోబైల్ ద్వారానే జరుగుతాయని కూడా అన్నారట. సాధ్యమేనా అని సందేహం వున్నా, ఆయన అన్నాడు కాబట్టి నిజం కావచ్చేమో అనిపిస్తుంది.

మహమ్మదీయులు చేసే ప్రార్థనని 'నమాజ్' అంటారు. దాన్ని వాళ్లు ప్రతీరోజూ ఐదు సార్లు చెయ్యాలి. సాధారణం గా పెద్దవాళ్లూ, చాందసులూ తప్ప, మిగిలినవాళ్లందరూ ఇలా ఐదుసార్లు చెయ్యరు. ఈ నమాజ్ ఇంట్లో అయినా, వీధిలో అయినా, ఆసమయం లో యెక్కడ వుంటే అక్కడ చెయ్యచ్చు. ఆడవాళ్లు ఇంట్లోనే చెయ్యాలి.

ఇక పర్వదినాల్లో, సామూహికం గా నమాజ్ చెయ్యడానికి 'మసీదు 'లు యేర్పాటు చేస్తారు. అంటే ఓ ఖాళీ స్థలం లో ఓవైపు, మక్కా యెటువైపు వుందో సూచిస్తూ ఓ గోడకడతారు. దానికి యెదురుగా నమాజ్ చేస్తే సరిగ్గా మక్కా వైపు తిరిగి చేసినట్టు. అంతే. (స్థలం యెక్కువ వుంటే, వంటశాలలూ, భోజన శాలలూ, కార్యాలయాలూ కూడా కట్టచ్చు)

మహాత్ములూ, ప్రవక్తలూ, వాళ్ల అవశేషాలూ సమాధి చేసిన చోట్లని 'దర్గా'లు అంటారు. ఆ దర్గాల్లో, ఆ సమాధుల దగ్గర ఆ మహాత్ములని ప్రార్థిస్తే, కోరికలు తీరుతాయని నమ్మకం. సాధారణం గా అన్ని మతాలవారూ వీటికి వెళ్తారు.

వీటిలో యేకోవకీ చెందని 'తాజ్ మహల్' దగ్గర మహమ్మదీయులు ప్రార్థనలు చెయ్యడం ఇదివరకు లేదు. మరి ఇప్పుడు అక్కడకూడా రంజాన్ సందర్భంగా ప్రార్థనలు చేస్తున్నట్టు పత్రికల్లో ఫోటోలు వచ్చాయి!

ఫరవాలేదు--వాళ్ల మతం లో కూడా మూఢనమ్మకాలు బాగానే వ్యాప్తి అవుతున్నాయన్నమాట.

శుభం! ముబారక్!

No comments: