Sunday, July 26

లాలూ మూర్ఖహ…….


……….అగ్రేసరీ ‘మమత’!
‘తురంతో’ (అంటే హిందీలో తురంత్) పేరుతో కొత్త ‘నాన్ స్టాప్’ రైళ్ళు రేపు ఆగష్ట్ ఒకటి నించీ ప్రారంభిస్తుందట!

ఇప్పటికే ప్రతిపక్షాలవాళ్ళూ, పత్రికలవాళ్ళు విమర్శించినట్టు—ఇదేమైనా సబబైన ఆలోచనా!

హౌరా నించి, ఢిల్లీ దాకా యెక్కడా ఆగకుండా, ప్రయాణించేవారు, ప్రతీరోజూ సగటున యెంతమంది వుంటారు? మరి ట్రైన్ అంతా ఖాళీగా వెళ్ళిపోవలసిందేనా? (బహుశా మమత తన పరివారంతో మొత్తం ట్రైన్ అంతా నింపి, హాయిగా ప్రయాణించొచ్చు అనేమో!)

మనకోటి ఇచ్చారట—హైదరాబాద్ నిజాముద్దీనో యేదో—మరి హైదరాబాద్ లో యే ట్రైన్ చూసినా, కంపార్ట్ మెంట్ కి ఓ పదిమంది కన్నా యెక్కువ వుండరు—మిగిలినవాళ్ళంతా సికింద్రాబాదులోనో, ఆ తరవాత స్టేషన్లలోనో యెక్కుతారు!

మరి ఈ తురంతో ఆ పదేసిమంది ప్రయాణీకులతోనే ప్రయాణించి, నిజాముద్దీన్ చేరితే, రైల్వే లాభాలసంగతి దేవుడెరుగు—మూడో క్లాసు కుర్రాడికి వొచ్చే లెఖ్ఖలైనా రావా మమతాదీకి?

వాడు మేనేజిమెంట్ గురూ గా లెక్చర్లు ఇస్తే, ఈవిడ ‘గణిత గుర్విణి’గా లెక్చర్లు ఇస్తుందేమో ఇక!

ఇండియ దటీజ్ భారత్ ప్రజల్ని ఈ మూర్ఖులనించి దేవుడైనా రక్షించగలడా అని!


No comments: