Tuesday, May 11

'చొప్పించబడ్డ వార్తలు '

చెల్లింపు వార్తలు

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 'చెల్లింపు వార్తల'పై మరిన్ని అధికారాలు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి కట్టబెట్టాలని సూచించిందట. ప్రెస్ కౌన్సిల్ చట్టాన్ని సవరించాలని ప్రభుత్వానికి సూచించిందట.

కొన్ని వార్తా సంస్థలు తమ పత్రికలోని వార్తల స్థలాన్ని అమ్ముకుంటున్నాయని ఆ కమిటీ తన నివేదికలో వెల్లడించిందట.

ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి, పార్లమెంటు వ్యవస్థకు పెనుముప్పని హెచ్చరించిందట.

సవరణ చట్టాన్ని వెంటనే తీసుకు రావాల్సిన అవసరముందని స్పష్టం చేసిందట.

ప్రెస్ కౌన్సిల్ ఉపకమిటీ ఇచ్చిన నివేదిక పై యేం చర్యలు తీసుకున్నారో తెలెపాలని మంత్రిత్వ శాఖని కమిటీ కోరిందట.

మరి శాఖ యేం చెపుతుందో!

No comments: