Saturday, March 3

నా గురించి........

మరో.......సింహావలోకనం - 2


మరి సాధించిందేమిటి? అంటే.....

నా వొక్కడి గొప్ప అని చెప్పనుగానీ, కొంతమంచి జరిగింది. ముఖ్యంగా నాలుగు విషయాల్లో.

  • రైల్వేల విషయంలో, విజిలెన్స్ దర్యాప్తులు జరిగి, కొన్ని చర్యలు తీసుకొన్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ల విషయంలో, తత్కాల్ విషయంలో కొంత సంస్కరించారు. (ఇప్పుడు మళ్లీ "నాలుగు నెలల" ముందే రిజర్వేషన్ అంటున్నారు. అది అంత అవసరం అనిపించడం లేదు నాకు).


  • తి తి దే వారు కూడా దర్యాప్తులూ అవీ జరిపి, కొన్ని సంస్కరణలు తెచ్చారు. ముఖ్యంగా అప్పటి ఈవో ఐ వై ఆర్ కృష్ణారావు గారు, సేవా టిక్కెట్ల విషయంలో, ప్రత్యేక దర్శనాల విషయంలో, క్యూలైన్ల విషయంలో కొంత సౌకర్యం కల్పించారు. భక్తి ఛానెల్ ని సంస్కరించారు. 


  • మన తెలుగు విషయంలో, ఈనాడు వారు కొంత మారారు/మార్చారు. ఇంకా చాలా చోట్ల తెలుగులో కొంత అభివృధ్ధి జరిగింది.


  • ఆర్ బీ ఐ వారు కొన్ని చర్యలు తీసుకున్నారు. మొన్ననే, ముథూట్, మణప్పురం లాంటి సంస్థల విషయంలో కొన్ని చర్యలకి శ్రీకారం చుట్టారు.


ముఖ్యమైనవి ఇవి. చిన్నచిన్నవాటి గురించి వ్రాయడం లేదు.

ఈ విషయాల్లో నాతో యేకీభవించినవారికీ, ఆ టపాలు తగినవారి దృష్టికి తీసుకెళ్లినవాళ్లకీ, చర్యలు తీసుకొనే భాగ్యం కలిగించినవారికీ మా మనః పూర్వక కృతజ్ఞతలు.

ఇలాగే కొనసాగాలని నా ఆకాంక్ష.

No comments: