Tuesday, May 26

'దాల్ మే కుచ్ కాలా'

".....ముంబయికి చెందిన 'నేషనల్ రిఫైనరీ' నుంచి 54.93 లక్షల రూపాయల విలువైన 145 కేజీ ల బరువుగల బంగారు, వెండి నాణాలు ఎయిర్ ఇండియా విమానం ద్వారా హైదరాబాదు లోని 'పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్' కి రవాణా అవబోతుండగా వాటిల్లోంచి, ఓ వంద కేజీల బంగారు, వెండి నాణాలు దోచుకోబడ్డాయట! ఎయిర్ ఇండియా భద్రతాదళ వుద్యోగిని కారుతో తొక్కి చంపేశారట! ఇంకో రవాణా కేంద్ర వుద్యోగి గాయ పడ్డాడట!

ఇదేదో 'పిచ్చి కథ ' లా లేదూ?

1. బంగారు నాణాలూ, వెండి నాణాలూ చెలామణిలో లేవు (కదా?)
2. ఈ రోజుల్లో బ్యాంకులు అమ్ముతున్న 'కాసుల 'ని నాణాలు అంటున్నా, అవి నిజంగా నాణాలు కాదు!
3. వెండి నాణాలు బ్యాంకులు కూడా అమ్మడం లేదు.
4. రిఫైనరీ అంటే, ముడి చమురుని శుద్ధి చేసేది! మరి ముడి చమురులో బంగారు, వెండి నాణాలు దిగబడ్డాయా?
5. పిడిలైట్ వారు ఫెవికాల్ లాంటి జిగుర్లు తయారు చేస్తారు-- మరి వీరికి బంగారు నాణాలూ, వెండి నాణాలెందుకో? కొంపతీసి వీటితోనే జిగుర్లు తయారు చేస్తున్నారా యేమిటి?

జవాబులేని ఈ ప్రశ్నలకి, ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారా?

చూద్దాం!

No comments: