Friday, July 3
పిచ్చి పిచ్చి బడ్జెట్లు
Thursday, July 2
'కొవ్వు ' ప్రతినిథులు
‘మంద’……నాధం!ఓ గ్రామీణ బ్యాంకు మేనేజరుని మంద జగన్నాథం ‘మ్యాన్ హ్యాండిల్’ చెయ్యడం ‘దృశ్య మీడియా’ చక్కగా చూపించింది!
Monday, June 22
'వితరణా?'
'గాలి ' దాతృత్వం--2మళ్ళీ గాలి సోదరులు ఇంకో నలభై అయిదు లక్షలు పెట్టి, ఈ సారి శ్రీశైల మల్లన్న 'వాయూలింగానికి ఓ కిరీటం చేయించి ఇచ్చారట! దాన్ని ఇవాళనించీ అలంకరిస్తారట! అదండీ సంగతి!
Sunday, June 14
'వితరణా?'
‘……..ఆయనా! చాలా మంచివాడు—దైవ భక్తీ, పాపభీతీ వున్నవాడు!’ అంటూంటారు సామాన్యం గా యెవరైనా మంచివాళ్ళు అని చెప్పాల్సి వచ్చినప్పుడు.'గాలి ' దాతృత్వం
కానీ, ‘దైవ భక్తి’ అన్నది—సూరదాసూ, తులసీదాసూ, కబీరుదాసూ, రామదాసూ, తుకారాం, జయదేవుడు, చైతన్యప్రభు, గాంధీ—లాంటి వాళ్ళకే సాధ్యమౌతుంది! మనది ‘అవసరార్థం’ భక్తి!
ఇక పాపభీతి అంటారా! శ్రీపతి, షిరిడీ, శబరిమల—ఇలాంటివేకాదు—యే వూరిలోని చెరువుగట్టూ, కాలవగట్టూ వీధిమూలా వేంచేసిన యే దేవుడి గుడి దగ్గర చూసినా అక్కడ మూగుతున్న ‘భక్త’ జనాలే సాక్ష్యం!
మరి మన గాలి జనార్దనరెడ్డి యే బాపతు?
యెందుకంటే, పాపం 45 కోట్లు ఖర్చుపెట్టి, 7 వేలకి పైగా వజ్రాలతో, కోటీ యెనభైమూడు లక్షల ఖరీదైన ఒకే పచ్చతో కూడా ఓ బంగారు కిరీటం చేయించి, శ్రీగిరి శ్రీపతి వేంకటేశ్వర స్వామి కి ‘దానం’ చేశాడట!
ప్రపంచం మొత్తానికే కోటీశ్వరుడు ‘వారెన్ బఫెట్’ తన యావత్తు ఆస్థినీ, ఒక ట్రస్టు కి అప్పగించాడు—మానవ సేవకి ఉపయోగించమని! ఇంకా యేమన్నాడంటే, ‘నా సంతానాన్ని రోడ్డున పడవలసిన అవసరం లేకుండా కావలసినంత మాత్రమే వాళ్ళకు ఇచ్చాను! మిగిలినదంటా ఈ ట్రస్టు కే!’ అన్నాడు!
మా డ్రైవర్ కామెంట్—‘……45 కోట్లు పట్టికేళ్ళి వాడి నెత్తిమీద పెట్టాడట! యెవడికేమి వొరిగింది? దాంతో యెన్ని కోట్ల కుటుంబాలు బాగుపడేవో! ఈళ్ళంతా యెందుకు సంపాదిస్తన్నారో….అదంతా యేమి చేసుకుంటారో!’
ఆయన వయసు 67 యేళ్ళు!
ఇక మనం ‘నో కామెంట్’!
Sunday, June 7
ఓ మంచి విషయం
మనం తలుచుకుంటే, దాన్ని 23 వందల రూపాయలకే అందించగలం—కదా?
Monday, June 1
Racist Australia
ఆస్ట్రేలియా లో భారతీయుల్ని జాత్యహంకారులు మట్టుపెడుతున్నారు.
దానికి వ్యతిరేకంగా భారతీయులు ఆందోళన చేస్తుంటే, నడి రోడ్డున బైఠాయించిన వాళ్ళు ట్రఫిక్ కి అంతరాయం కలిగిస్తున్నరంటూ పోలీసులు వాళ్ళలో ఓ పద్ధెనిమిది మందిని అరెష్ట్ చేసి, మిగిలినవాళ్ళని చెదరగొట్టారు! టీవీల్లో ‘విజువల్స్’ చూశారుగా?
ఆందోళనకారులు (ముందే అనుమతి తీసుకొని) ఓ ముఖ్య రహదారి పై (నాలుగు రోడ్ల కూడలో, మరోటో కాదు!) బైఠాయించారు. (ఆదే ఇండియాలో అయితే—కుడివైపో, యెడమవైపో మళ్ళి, ఇంకో దారి ద్వారా మళ్ళీ మెయిన్ రోడ్డు కి రావడానికి వీల్లేకుండా, వంతెనల దగ్గరో, ఇటూ అటూ కార్ఖానాలు వున్న చోటో బైఠాయిస్తారు—‘ట్రాఫిక్ ఆగితే కదా జనానికీ, ప్రభుత్వానికీ సమస్య తెలిసేది!’ అంటారు చోటా మోటా రాజకీయ రాస్తారోకో నాయకులు!)
బైఠాయించిన వారికి కనీసం ఓ పది గజాల దూరం లో పోలీసులు మోహరించారు. వాళ్ళు మామూలు లాఠీలే ధరించారు. వాళ్ళిచ్చిన టైము అయిపోగానే, ముచ్చటగా ఇద్దరిద్దరు పోలీసులు, ఒక్కొక్క ఆందోళనకారుణ్ణి, వెల్లకిలా రెండురెక్కలూ ఇద్దరూ పట్టుకొని, ఈడ్చుకొంటూ, పోలీసుల దగ్గరికి లాక్కు పోయి, అక్కడ నిలబెట్టి, అరెష్ట్ చేశారు! (తరవాత, స్టేషనుకి తీసుకెళ్ళి మందలించి విడిచి పెట్టారు)
మిగిలిన వాళ్ళని లాఠీలతొ ఝడిపించి, చెదరగొట్టారు!
ఇక మన అరెష్టులకి వస్తే, మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు, ఆజన్మ కక్షలు వున్నట్టు జనాల్ని మోకాళ్ళమీదా, నెత్తి మీదా, పెడరెక్కలు విరిచి వెనక గూళ్ళ మధ్యా, రెండు కాళ్ళ మధ్యా—లాఠీలతోనూ, బూటు కాళ్ళ తోనూ—వీర విహారం చేసే మన పోలీసులూ, నడుములు విరగడం అలవాటైపోయిన మన నారాయణా, రాఘవులూ ప్రత్యక్ష సాక్షులు!
మరి డీజీపీ యదవ్ హయాములో కోంచెం ఇంప్రూవ్ మెంట్ వుంటుందంటారా?
వుంటే అటా, ఇటా? చూద్దాం!
Tuesday, May 26
'దాల్ మే కుచ్ కాలా'
ఇదేదో 'పిచ్చి కథ ' లా లేదూ?
1. బంగారు నాణాలూ, వెండి నాణాలూ చెలామణిలో లేవు (కదా?)
2. ఈ రోజుల్లో బ్యాంకులు అమ్ముతున్న 'కాసుల 'ని నాణాలు అంటున్నా, అవి నిజంగా నాణాలు కాదు!
3. వెండి నాణాలు బ్యాంకులు కూడా అమ్మడం లేదు.
4. రిఫైనరీ అంటే, ముడి చమురుని శుద్ధి చేసేది! మరి ముడి చమురులో బంగారు, వెండి నాణాలు దిగబడ్డాయా?
5. పిడిలైట్ వారు ఫెవికాల్ లాంటి జిగుర్లు తయారు చేస్తారు-- మరి వీరికి బంగారు నాణాలూ, వెండి నాణాలెందుకో? కొంపతీసి వీటితోనే జిగుర్లు తయారు చేస్తున్నారా యేమిటి?
జవాబులేని ఈ ప్రశ్నలకి, ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారా?
చూద్దాం!
Monday, May 18
'ఆఖరి మజిలీ'
మొన్నేకదా అనుకున్నాము--'అల్టిమేట్ డెస్టినీ' చేరక తప్పదు--అని!
'గమ్యాన్ని చేరుకోవడమే ముఖ్యం కాదు--అది చేరుకొనే మార్గం కూడా ముఖ్యమే' అన్న సూక్తికి ఓ మంచి ఉదాహరణ పిరభాకరన్!
పనిలో పని, తమిళనాట యెన్నికలు అయిపోయి, ఫలితాలూ వచ్చేశాయి కదా! ఇక అల్లర్లు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా యేర్పాట్లు చేశారట!
మంచిదేగా!
Sunday, May 17
'కార్టూన్'
'కార్టూన్'!
అంటే, అది యెవరిని ఉద్దేశించి గీసారో, వాళ్ళు కూడా హాయిగా నవ్వుకోవాలి!
ఆర్కే నారాయణ్ లాంటివాళ్ళూ, బాపు లాంటివాళ్ళూ వేసిన కార్టూన్లు చూసి, జవహర్లాల్ నెహ్రూ లాంటి ప్రథానులూ, ముఖ్య మంత్రులూ అలాగే నవ్వుకొనేవారు!
ఈ మధ్య యేమిటో, ఈనాడు కార్టూనిష్ట్ శ్రీధర్ వెర్రితలలు వేస్తున్నాడు!
ఇవాళ (17-05-2009) వేసిన కార్టూన్ చూశారా?
పాపం చిరంజీవిని అల్లు అరవింద్ అడుగుతున్నాడు--"బావా! 'మార్పూ, సామాజిక న్యాయం' అని రెండు సినిమాలు తీద్దామనుకుంటున్నాను, వాటిలో నటిస్తావా?" అనో, ఆ అర్థం వచ్చేలాగానో!
మొదటి విడతో, రెండో విడతో పోలింగు అయిపోగానే, రాశ్శేఖర్రెడ్డి 'పథకాలు ' అమ్ముకుంటున్నట్లో...యేదో కార్టూన్ వేశాడు!
వీటినే కాదూ--'చెడు రుచి ' కార్టూన్లు (కార్టూన్స్ ఇన్ బేడ్ టేస్ట్) అంటారు?
శ్రీధర్! ఈనాడు స్థాయిని తగ్గించొద్దు! (ఓ పక్క ఉండవిల్లి అరుణ్ కుమార్ నెగ్గాడాయె!)
Thursday, April 30
ఆత్తావియో ఖత్రొ
‘ప్రతిపక్షాల అనవసర రాద్ధాంతం’ అంటున్న హెచ్ ఆర్ భరద్వాజ్!
Monday, April 27
తమిళపులి
దెబ్బతిన్న బెబ్బులి?
శ్రీలంక లో తమిళపులి ‘వేలుపిళ్ళై పిరభాకరన్ ‘ పట్టుబడడానికి సమయం దగ్గరకొచ్చిందంటున్నారు!
శాంతికాముకులకీ, తీవ్రవాద వ్యతిరేకులకీ చాలా సంతోషం గా వుంటుంది!
మన దేశం లో తమిళ రాజకీయులకి చాలా బాధగా వుంటోది!
మరి పిరభాకరన్ యెందుకు దెబ్బ తిన్నాడు?
ఒకటే సమాధానం—యే దేశమైనా తన సార్వభౌమత్వానికి సవాలు యెదురైతే, సహించలేదు, సహించ కూడదు!
భౌగోళికం గా, చారిత్రకం గా ఒక దేశం లో వుంటూ, సాంస్కృతిక కారణాలవల్లొ, మత సంబంధమైన కారణాలవల్లొ, వేరే దేశం గా విడిపోతామంటే అది విపరీతం! పైగా దానికి యెంచుకున్న పద్ధతి మరీ ముఖ్యం!
తెల్లవాడి ‘విభజించి పాలించు’ జిత్తులకి తలొగ్గకుండా, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానికి తొందరపడకుండా వుంటే, ‘రెండు డొమీనియన్లు’ కి అంగీకరించకుండా వుంటే, మన పక్కలో బల్లెం—పాకిస్థాన్ తో మనకీ పాట్లు వుండేవి కాదు!
1948 లో పాక్ ని నియంత్రించడానికి జనరల్ కరియప్పకి అవకాశమిచ్చి వుంటే, కాంగ్రెస్ అతి నమ్మకంతో ఐక్యరాజ్య సమితికి పోకుండా వుంటే, మన కాశ్మీర్ సమస్యే వుండేదికాదు!
తరవాత, 1965, 1971 యుద్ధాల గురించీ, ప్రభుత్వం నిర్వాకం గురించీ ముందే మాట్లాడుకున్నాం!
భుట్టో మన దేశం మీద ‘వెయ్యేళ్ళ పవిత్ర యుద్ధం’ ప్రకటించడానికి కూడా ఈ సూత్రమే కారణం!
ఇక పద్ధతులకి వస్తే, తమిళ పులి యెంచుకున్నది—సాయుధ పోరాటం! అదీ ముక్కుపచ్చలారని పిల్లలతో! ఇంకా తీవ్రవాదాన్ని నమ్ముకోవడం!
రాజకీయం కోసం అప్పటిదాకా ‘ఈళం’ కి మద్దతు ఇచ్చిన రాజీవ్, మధ్యలో తెడ్డు జాపినట్టు ‘ఐ పీ కే ఎఫ్’ పేరుతో జొరబడి, చివరకి హత్య చెయ్యబడ్డాడు!
ఇక వాళ్ళ ప్రధాన మంత్రుల్నీ వదల్లేదు వాళ్ళు! హత్యలూ, హత్యా ప్రయత్నాలూ సాగించారు!
వాళ్ళ ప్రభుత్వం యెన్ని సార్లు చర్చలకోసం చెయ్యి సాచినా, యేదో వంకతో దాన్ని తిరస్కరించడం, కాల్పుల విరమణని పాటించకపోవడం లాంటివి కోకొల్లలు!
చివరికి ‘అల్టిమేట్ డెస్టినీ’ కి చేరక తప్పదు కదా?
ఇది ప్రతీ ఉద్యమానికీ, ఉద్యమ నాయకునికీ, ప్రభుత్వాలకీ, విద్రోహులకీ ఓ గుణపాఠం కావాలి!
అయితే బాగుండును!
పీ ఎస్ :- ఇప్పుడే అందిన వార్త--కరుణానిధి చిదంబరం మీదా, చిదంబరం మన్మోహన్ సింగ్ మీదా, మన్మోహన్ సోనియా మీదా, సోనియా భారత ప్రభుత్వం మీదా తెచ్చిన వత్తిడి ఫలితంగా, భారత ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం మీద తెచ్చిన వత్తిడి ఫలించి, ఆ ప్రభుత్వం 'కాల్పుల విరమణ ' ప్రకటించిందట!
కరుణ తన 'నిరాహార దీక్ష ' విరమించారట!
Wednesday, April 22
జీవితం ఉచితం
ఉచితాల గురించి
‘కేపిటలిజం’-- నియంత్రణలేని విపణి వుండాలనీ, విపణిలో పరిస్థితులు ‘సరఫరా—గిరాకీ’ ల మీదే అధారపడాలనీ, సబ్సిడీలూ, ఉచితాలూ వుండకూడదు—అంటుంది!
కానీ, కొన్ని పరిస్థితులకి లోబడి, రాజకీయ లభ్ధి కోసం, అమెరికా లాంటి దేశానికి కూడా తప్పలేదు—కొన్ని ‘ఉచితాలు’ ప్రకటించకుండా!
అమెరికా లో వుండేవాళ్ళకి చాలా ముఖ్యమైనది ‘సోషల్ సెక్యూరిటీ నెంబరు’.
అక్కది ఉచిత పథకాల్లో ఒకటి, ‘సోషల్ సెక్యూరిటీ పధకం’.
దీని కింద, ఉద్యోగం కోల్పోయిన వాళ్ళకి (పింక్ స్లిప్డ్ ఎంప్లాయీస్ అంటారు వాళ్ళని) నెలకి ఇంత అని ప్రభుత్వమే నిరుద్యోగ భృతి ఇవ్వడమే ఈ పథకం!
కొన్ని పరిణామాలవల్ల అక్కడి మాఫియా బలపడి, ‘మనీ లాండరింగ్’ లాంటివి పెరిగిపోయాయి అక్కడ! ‘స్లాట్ మెషీన్లు’, 'వెండింగు మెషీన్లు’ మొదలైనవి వాళ్ళ కంట్రోల్ లోనే వుంటాయి.
ఈ పధకంతో ‘లోన్ షార్కింగ్’ మొదలయ్యింది!
ఇప్పటికే, మనదేశం లో మాజీ ఫ్యాక్షనిష్టులూ, నడమంత్రపు సిరి రాజకీయులూ, మాఫియా లెవెల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. మనీ లాండరింగు కి మంచి ఉదాహరణలు సత్యం రామలింగ రాజూ, వై యెస్ జగన్ కంపెనీలూ!
ఇంక ఉచిత నగదు బదిలీ పధకం వస్తే, మనకి కూడా లోన్ షార్కింగ్ మొదలవుతుంది!
ఇప్పటికే, ప్రైవేటు బ్యాంకులూ, కొన్ని వ్యాపార సంస్థలూ వాటి వసూళ్ళకి గూండాలని ఉపయోగించుకుంటున్నాయి.
ఇక ప్రతీ వూళ్ళోనూ వీధికో డజను చొప్పున వెలిసిన ‘మైక్రో ఫైనాన్స్’ సంస్థలు యెలా విచ్చలవిడిగా అప్పులిస్తున్నాయో, యెలా వసూలు చేసుకుంటున్నాయో తెలుసు కదా?
లోన్ షార్కింగ్ అంటే, ప్రజలకి వచ్చే నియమిత అదాయానికి ఇన్నిరెట్లు అని అప్పు ఇచ్చి, ప్రతీ నెలా ఆ అదాయం రాగానే, వడ్డీ వసూలు చేసుకు పోవడం! అసలు మాట దేవుడెరుగు, వడ్డీ కూడా పూర్తిగా కట్టలేక చేతులెత్తేసి, మాఫియా చేత వికలాంగులుగా చెయ్యబడ్డవారూ, చంపబడ్డవారూ కోకొల్లలు అక్కడ. ఒక మనిషిని నేల మీద బోర్లా పడుకో బెట్టి, మోకాళ్ళ మడతల్లోంచి పెద్ద పెద్ద మేకులు మోకాలి చిప్పలగుండా నేలలో దిగేలా కొట్టేశారంటే—వాళ్ళు యెంత కౄరంగా ప్రవర్తిస్తారో అర్ధం చేసుకోవచ్చు!
మరి మన దేశం లో కూడా అలాంటి పరిస్థితులు రావని నిశ్చింతగా వుండగలమా?
ఇప్పటికే మైక్రో ఫైనాన్స్ వల్లా, గ్రూప్ లెండింగ్ ద్వారా ద్రవ్య సరఫరా పెరిగిపోయి ద్రవ్యోల్బణం పెరిగి పోయింది!
ప్రభుత్వమూ, మీడియా ద్రవ్యోల్బణం రేటు ‘సున్నా’ దగ్గరకి వచ్చేసింది అనీ, వ్యతిరేక ద్రవ్యోల్బణం రావచ్చు అనీ, అది చాలా ప్రమాదకారి అనీ, ఓ ఊదరగొట్టేస్తున్నాయి!
ప్రభుత్వమేమో, కాకుల్లెక్కలు చెపుతూ, రిజర్వ్ బ్యాంకు మీద వత్తిడి తెచ్చి, బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించేలాగ బోళ్ళు చర్యలు తీసుకొనేలాగ చేస్తోంది!
మరి కొన్ని లక్షలు మార్కెట్ లోకి వచ్చేస్తే అప్పుడు ద్రవ్యోల్బణం సంగతేమిటి?
ఉచితాలకి తోడు, ఋణ మాఫీలు కూడా ప్రకటిస్తుంటే, ఇక బ్యాంకుల అప్పులెవరు తీరుస్తారు? బ్యాంకుల లోని ప్రజా ధనానికి భద్రత యేముంటుంది?
పైగా, బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్లు తగ్గుతూవుంటే, ద్రవ్యోల్బణం పెరుగుతూ వుంటే, జనం డబ్బెందుకు దాస్తారూ? యెప్పటికప్పుడు ఖర్చు పెట్టెయ్యరూ!
అలోచించండి మరి!
Wednesday, April 15
ఫ్యాషన్
ఫ్యాషన్
సరిగ్గా నలభై యేళ్ళ క్రితం, మేం పీయూసీ లో వుండగా, మా బిజినెస్ ఆర్గనైజేషన్ ఉపన్యాసకులు చెప్పిన జోక్ ఇది!
(ఆ మహానుభావుడికి అప్పట్లో ఓ 35 యేళ్ళు వుండి వుంటాయి. నీటుగా టక్ చేసుకొని వచ్చి, కుర్చీలో కదలకుండా కూర్చొని, ఉపన్యాసం ఇచ్చేవారు! మేము ఈ మాత్రం వాణిజ్యం గురించి నేర్చుకున్నామంటే, అది ఆయన భిక్షే! నేను చెయ్యెత్తి నమస్కరించేవారిలో ఆయనొకడు. ఆ తరవాత కాలేజ్ ప్రిన్సిపాల్ గా కూడా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇంతకీ ఆయన ఆ సంవత్సరంపాటూ మాకు చెప్పింది—సోల్ ట్రేడర్, పార్ట్ నర్ షిప్, జాయింట్ స్టాక్ కంపెనీలగురించి మాత్రమే!)
ఇక జోక్!
ఒక యువకుడు పారిస్ నగర వీధుల్లో, చంకలో ఓ ప్యాకెట్ పెట్టుకొని వేగం గా పరుగెడుతున్నాడట.
అంతలో ఓ స్నేహితుడు కనిపించి అడిగాడట “యెందుకలా కొంపలు మునిగిపోయినట్టు పరిగెడుతున్నావు?” అని.
పరుగు ఆపకుండానే జవాబిచ్చాడట ఆ యువకుడు—“మా ఆవిడ లేటెస్ట్ ఫేషన్ గౌను తెమ్మంది—పట్టుకెళ్తున్నాను—ఇంటికి చేరేలోగా మళ్ళీ ఫేషన్ మారి పోతే, మళ్ళీ ‘లేటెస్ట్’ ఫేషన్ తెమ్మంటుంది—అందుకే ఫేషన్ మారేలోగా ఇల్లు చేరాలి” అని వగర్చుకుంటూ పరుగు సాగించాడట!
అదీ జోకు!
మరి ఇప్పుడో?
ఈ నాటికికూడా ఫేషన్ రాజధాని పారిస్ మాత్రమే అంటే అతిశయోక్తి కాదు కదా?
Sunday, April 12
......ఉచితం
జీవితం ఉచితం
మహాభారత యుద్ధం లో శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా అన్నాడు.
“ఏమయ్యా! అనవసరమయిన బెంగలు పెట్టుకోక నన్నే నమ్ముకుని ఉండు. నీ పనులన్నీ నేనే చేస్తాను.” అని.
తమిళనాడు ముఖ్యమంత్రిగారు దాదాపు అలాంటి హామీనే తమిళ ప్రజలకు ఇచ్చారు. “మీరేమీ అందోళనలు పడక నాకే ఓటు వెయ్యండి. మీ అవసరాలన్నీ నేను తీరుస్తాను.” అని.
ఫ్రజలు ఆయనకు ఓటు వేశాక ఆయన ఇటీవలే పదేళ్ళ లోపు పిల్లలందరికీ ఉచితంగా భోజనాలు ఏర్పాటు చేశారు. ఆపని కోసం ప్రభుత్వ సిబ్బంది నానా హైరానా పడుతూ కృషి చేస్తున్నారు. కొందరు గిన్నెలు, గరిటెలు, మూకుళ్ళు, విస్తళ్ళు, కొనే పని మీద వున్నారు. కొందరు పిల్లలు కూర్చోడానికి షెడ్లు కడుతున్నారు. మరికొందరు ఆవాలు, ధనియాలు, పప్పులు కొనుక్కొచ్చే హైరానాలో వున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల వయస్సులు సరిగ్గా లెక్కవేసుకొని అక్కడ భోజనాల బంతుల్లో పిల్లల్ని కుర్చోపెట్టే హడావుడిలో ఉన్నారు.
ఇదిలా ఉండగా మరొక ఉచిత సౌకర్యం ముఖ్యమంత్రిగారు చేస్తున్నారు—అక్టోబరు రెండవ తేదీ నుంచి పిల్లలందరికి పళ్ళపొడి ఉచితంగా ఇస్తారు. దీని కోసం 48 లక్షలు ఖర్చు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఈ ఉచిత పళ్ళపొడి దక్కడానికి పిల్లల పళ్ళు త్వరగా ఊడిపోకుండా జాగ్రత్త పడతారు. అందరూ పళ్ళు తోముకుని – ముఖ్యమంత్రిగారు రాగానే చిరునవ్వుల్తో కనిపిస్తారని నా నమ్మకం. మా ఆవిడ ఈ వార్త చదివి, “ఉచితంగా పెద్దలకి వక్కపొడి ఇస్తే బాగుణ్ణు” అంది. అప్పుడు నాకనిపించింది – రాబోయే కాలంలో ముఖ్యమంత్రిగారు ఆయా వయస్సుల వాళ్ళకి వక్క, కారబ్బూంది, సున్నుండలు, మిరపకాయబజ్జీలు, కోడి పలావు, చివరగా ఉచిత బ్రాంది సదుపాయాలు చేస్తారని ఆనంద పడ్డాను.
అయితే మంచి వెనుక ఏదో ఒక లోపమో చెడో జరగవచ్చు. దాన్ని ఎవరు ఆపలేరు. అప్పుడే పప్పుధాన్యాలు దొంగతనంగా అమ్ముకుంటున్న ఒక మనిషి అరెస్టయ్యాడట. ఆబాధ భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడట. ఏపనీ చెయ్యకుండా మందుకొట్టి మొదట్లో కూర్చున్న పిల్లల తండ్రి రెండు పూట్లా ఈ సంతర్పణలకి పిల్లల్ని పంపి ఇంటి దగ్గర చిన్న సైజు “అన్న దుకాణం” తెరిచినా ఆశ్చర్యం లేదు. అన్నీ ఉచితంగా దొరికిన పేద వాళ్ళు ఏంచేయాలో తెలీక సరదాగా చిల్లర దొంగతనాలూ, సరదా హత్యలూ, చిన్న చిన్న దోపిడీలు చేసినా తప్పులేదు. సుఖం మనిషికి ధైర్యాన్నిస్తుంది. నిరుద్యోగులకి బోనస్ లు లభించే స్కీము ఆధారం చేసుకుని – చిన్న సైజు గుండాయిజం నీగ్రోలు వుంటున్న ప్రాంతాల్లో అమెరికాలో ప్రారంభమయిందని మనం చదువుకున్నాం. రాత్రి పదిగంటలకి మద్రాసు నగరంలో కొన్ని ప్రాంతాల్లో నడవడం కూడా కష్టమని అస్మదాదులకి తెలుసు.
మనిషికి ఏదో ఒకటి సాధించడం అన్నది తృప్తినిస్తుంది. సాధించాలన్న కృషే జీవితం. ఏం సాధించాలో తెలీని సందర్భంలో ఎంతో సంపన్నమైన స్థితిలో వున్నవారు ఆత్మహత్య చేసుకోవడం మనం వింటున్నాం. పేదవారిని పేదగా వుంచడం ఎవరి వుద్దేశ్యం కాదు కాని, ప్రతి వ్యక్తి కష్టపడే అవకాశం, కష్టపడితే ఫలితం దక్కే అవకాశం ప్రభుత్వం కలిపిస్తే, ఏదో ఒక పని చేయాలన్న తపన. చేసిన ప్రతిఫలం సమాజానికీ, దేశానికీ దక్కుతుంది.
లేదా ముఖ్యమంత్రుల్ని ఎన్నుకుంటే – ఉచితంగా భోజనం, పళ్ళపొడి, గావంచా, సినిమా టిక్కెట్లు – లభిస్తాయన్న అలసత్వంలో ప్రజలు పడితే – వాళ్ళు తిరుగువాటు కాలాన్ని ఏం చెయ్యాలో తెలీక జేబులు కొట్టడం ప్రారంభిస్తారు.
* * *
—ఇది శ్రీ గొల్లపూడి మారుతీ రావు 27 యేళ్ళ క్రితం, అంటే 10-9-1982 న, “ఆంధ్ర జ్యోతి” లో ‘జీవనకాలం’ అనే శీర్షిక క్రింద వ్రాసిన వ్యాసం!
మరి అప్పటికీ ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా?
రాలేదంటే దానికి బాధ్యులెవరు?
మనమేమీ చెయ్యలేమా?
ఇవాళ టివీల్లో ప్రసారమైన జయప్రకాష్ నారాయణ్ ప్రసంగ పాఠాన్ని వినండి!
సత్తా జనాస్సుఖినోభవంతు!
Saturday, April 11
వినతి
నేను నా ఇంటికి కొన్ని అలంకరణలు, మార్పు చేర్పులు చేయించిన కారణంగా నా 'సిస్టం' ని భద్రం చెయ్యవలసి రావడం మూలాన, ఈ మధ్య వ్రాయలేక పోయాను!
క్షంతవ్యుణ్ణి!
ఇదిగో! ఇక్కడనించీ, వీలైతే ప్రతీ రోజూ......!
ధన్యవాదాలు!
Tuesday, March 10
మిధ్య
“25,00,00,000” కోట్లు!
ఆసియా డెవలప్ మెంట్ బ్యాంకు అంచనాల ప్రకారం క్రితం యేడాదిన్నరలో ‘హరించుకుపోయిన’ ప్రపంచ సంపద (ట)! ఇది నిజం అంటోందట ఏ డీ బీ!
అసలు నిజం నేనెప్పుడొ చెప్పాను—‘ఊరువెలుపల పాడు కోనేటి చెంత……….’ అని!
అదే సంపద! అదే వృద్ధి! అదే హరించుకుపోవడం!
“గజం మిధ్య! పలాయనం మిధ్య!
కాదా?
Monday, February 16
దేశ భక్తి
మా తాతలు కష్టాలు పడ్డారు, మా తండ్రులు కష్టాలు పడ్డారు కానీ, మాకు కష్టం అంటే యేమిటో తెలియకూడదు అని వాళ్ళు అహోరాత్రం కష్ట పడ్డారు!
ఓ క్రమ శిక్షణలో పెంచారు!
ఎలిమెంటరీ స్కూల్ లో నాలుగవ తరగతి నించే, ‘కబ్స్’ అని, (స్కౌట్స్ కి జూనియర్ డివిజన్) వుండేది—అందులో చేరమని ప్రోత్సహించేవారు!
హై స్కూల్ లో ఆరో తరగతి నించి ‘భారత్ స్కౌట్స్ & గైడ్స్’ శిక్షణ వుండేది!
ఇది కాకుండ, ప్రత్యేకంగా వారానికో పీరియడ్ ‘సిటిజన్ షిప్ ట్రైనింగ్’ వుండేది. వీటిలో క్రమ శిక్షణతో పాటు—పరిశుభ్రత, ప్రధమ చికిత్స, లోకోపకారం, పౌర నిబంధనలు (రోడ్డు మీద యెటువైపు నడవాలి, రోడ్డు యెలా దాటాలి లాంటివి) కూడా చెవినిల్లు కట్టుకొని బోధించే వారు!
యెనిమిదో తరగతి నించీ ‘నేషనల్ కేడెట్ కోర్’ (ఎన్. సీ. సీ.)—ఇంకొంచెం కఠిన క్రమ శిక్షణ, శారీరక శ్రమ, కొంచెం క్లిష్టమైన నియమావళి—లీడర్ చెప్పిన దాన్ని వెంటనే ఆచరించడం, తోటి విద్యార్ధులతో చక్కగా సహ జీవనం, కేంపులు, ఆయుధాల శిక్షణ, మేప్ రీడింగ్—ఇలా మిలిటరీ కి సంబంధించిన శిక్షణ ఇచ్చి, ఏ సర్టిఫికెట్ ఇచ్చే వారు—ఉత్తీర్ణులకి!
ఇక కాలేజ్ లో సీనియర్ డివిజన్ ఎన్. సీ. సీ. దీంట్లో మళ్ళీ ఆర్మీ డివిజన్, నేవీ డివిజన్ రెండూ వుండేవి! చిన్న వూళ్ళలో ఎయిర్ ఫోర్స్ లేదు!
ఇంకా చక్కటి శిక్షణ ఇచ్చి, బీ-1, బీ-2, సీ సర్టిఫికెట్ లు ఇచ్చేవారు ఉత్తీర్ణులకి!
యాన్యువల్ ట్రైనింగ్ కేంపులే కాకుండా, అడ్వాన్స్డ్ లీడర్ షిప్ కేంపులూ, ఆర్మీ ఎటాచ్ మెంట్ కాంపులూ నిర్వహించేవారు! మంచి ట్రైనింగ్ పొందిన వారిలో ఒకరిద్దరికి, రిపబ్లిక్ డే పెరేడ్ లో పాల్గొనే అవకాశం వచ్చేది!
వారానికి రెండు పెరేడ్లు, యే కారణం చేతైనా కుదరక పోతే ఆదివారం డబల్ పెరేడ్, పెరేడ్ అయ్యాక అందరికీ ఉచితంగా టిఫిన్, డబల్ పెరేడ్ రోజున డబల్ టిఫిన్, అందరూ గబగబా ఇళ్ళకి వెళ్ళిపోతే, మిగిలిన వాళ్ళూ, లీడర్లూ, మిగిలిన టిఫిన్ పొట్లాలని సద్వినియోగం చెయ్యడం, తిరునాళ్ళూ, తీర్థాలూ వచ్చినప్పుడు బందోబస్తు నిర్వహించడం, కలరా వంటి జాడ్యాలు వ్యాపిస్తున్నాయంటే, మంచినీళ్ళలో (క్లోరిన్) మందు కలపడం అందరికీ అలవాటు చెయ్యడం—అన్నిటికన్నా మిగిలిన విద్యార్ధుల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు—యూనిఫారం ధరించగానే ఓ ఠీవి—చాలా ఉత్తేజ పూరితంగా వుండేది!
ఇక కేంపుల విషయానికొస్తే, ఫిజికల్ ట్రైనింగ్ దగ్గర నించీ, అన్ని రకాలైన శిక్షణలూ ఇచ్చి, ఆయుధాల వినియోగం లో ప్రత్యేక శిక్షణనిచ్చి రైఫిళ్ళూ, గ్రెనేడ్లూ, మెషీన్ గన్లూ పేల్చడం, టాంకులూ, రాకెట్ లాంచర్లూ, యాంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్ లూ, ఆర్ సీ ఎల్ గన్ లూ మొదలైన వాటితో ప్రత్యక్ష పరిచయం కలిగించి, వాటిలో శిక్షణ ఇవ్వడం ఒక యెత్తైతే, మన పనులు మనమే చేసుకోవడం, నిజమైన స్నేహాన్ని పొందడం, అనుభవించడం, కేంపు ఆఖర్లో (మిగిలిపోయిన బడ్జెట్ తో కొన్న రేషన్లతో) బడా ఖానా, సాంస్కృతిక కార్య క్రమాలు—వొదల్లేక వొదల్లేక పూర్తి ఆత్మ విశ్వాసంతో తిరిగిరావడం మరో యెత్తు!
………(ఇంకా చాలా వుంది)
Sunday, February 15
మానవహక్కులు
పోలీసులపై కేసులు!
వినడానికి చిత్రంగానే వుంటుందిగాని, మన ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రకారం ఇది జరిగే తీరాలట!
ఓ పదిహేనేళ్ళ క్రితం, పోలీసుల తీరుపై ‘అమానుష హక్కులు’ శీర్షిక తో ఈనాడు పత్రికలో నా లేఖ ఒకటి ప్రచురితమయ్యింది.
అప్పటికీ, ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా అంటే, వచ్చింది—వెనకనించి!
అప్పట్లో, యెవరైనా అందోళన చేస్తూ వుంటే, పోలీసులు అక్కడకి చేరుకొని, మైకులో రెండు మూడు సార్లు హెచ్చరికలు చేసి, అప్పుడు గుంపుని చెదరగొట్టేవారు! బెత్తాలకీ, లాఠీలకి పని చెప్పేవారు! యెవరికీ పెద్దగా గాయాలు తగిలేవి కాదు—అవి నిజమైన అందోళనలు కాబట్టి!
తరవాత్తరవాత, ఈ రాజకీయ, కుల, మత ఫ్యాక్షన్ అందోళనలు పెరిగాక, తరలించబడిన జనాలతో, గూండాల నాయకత్వం లో జరుగుతున్న అందోళనలు ముష్టి యుద్ధాలనీ, కత్తి యుద్ధాలనీ తలపిస్తున్నాయి! ఇంకా పురాణాలు, ఇతిహాసాల్లో విన్న కుస్తీలూ, పోరాటాలూ వీటి ముందు దిగదుడుపు అనిపిస్తున్నాయి!
పైనించి వచ్చే అదేశాలమేరకు వాళ్ళని ఓఅరగంటో, గంటో అందోళన చెయ్యనిచ్చి, ఆ తరవాత విజృంభిస్తున్నారు! మన పోలీసులు! ఆడవాళ్ళనీ, మొగవాళ్ళనీ ఒకే విధంగా పక్షపాతం లేకుండా చూస్తున్నారు!
ఇక పేపర్లలో ఫోటోలూ, టీవీల్లో వీడియోలూ చూస్తూనే వున్నాము—చెరో పోలీసు ఒకణ్ణి చెరోకాలూ పట్టుకొని భీముడు జరాసంధుణ్ణి చీల్చినట్టు చీలుస్తుంటే, ఇంకొకడు కాళ్ళ మధ్యన బూటు కాలితో తన్నడం! వెనక్కి రెక్కలు విరిచేసి ఒకడు పట్టుకుంటే, ఇంకొకడు బూటు కాళ్ళతో గూడు మీద తన్నడం! ఈడ్చుకు తీసుకెళ్ళి, కాళ్ళొకళ్ళూ, చేతులొకళ్ళూ పట్టుకొని, వాన్ లోకి బస్తాని విసిరినట్లు, నడుములు విరిగేలాగ విసిరెయ్యడం! (దీంట్లో నాయకులకి కూడా మినహాయింపు లేదు!)
మరింక మానవహక్కులెక్కడ?
అదే విదేశాల్లో చూస్తే, ఆందోళనలు కాక పోయినా, క్రిమినల్స్ నీ, మాఫియా వాళ్ళనీ కూడా రాగ ద్వేషాలకతీతంగా అందర్నీ ఒకే రకంగా ఒకే పద్ధతిలో లొంగతీసుకుని అరెష్టు చేస్తారు!
మన పోలీసులు యెప్పుడు అలా అవుతారు? యెన్ని కోర్టు తీర్పులూ, యెన్ని కేసులూ విచారణలు జరగాలి? యెంతమంది పోలీసులూ, ఉన్నతాధికారులూ శిక్షలు అనుభవించాలి? అసలు ఇవన్నీ జరిగేవేనా!
చూద్దాం!
Saturday, February 14
" 'క్రూర'మండల్" అనే గరీబ్ (లాలూ) రథం
మన దేశం లోనే మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు ‘కోరమాండల్ ఎక్స్ ప్రెస్’ పట్టాలు తప్పిందిట! కేవలం 18 మందే మరణించారట! యెందుకంటే, అప్పుడు అది గంటకి 60 కి.మీ. వేగంతోనే వెళుతోందట!
మరి దాని పూర్తి వేగం (గంటకి 120 కి.మీ. తో మొదలు పెట్టారు—ఇప్పుడు 140 కి.మీ. కి పెంచినట్టున్నారు) తో వెళుతూ వుండగా (అమంగళము ప్రతిహతమగుగాక!) అయితే అని అడగద్దు.
మన రైల్వేలకే ప్రతిష్ఠాత్మకమైన కోరమండల్ ప్రవేశపెట్టగానే—అతి తక్కువ స్టేషనులలో ఆగుతూ, మధ్య స్టేషనులలో ఆగకుండా వెళ్ళిపోతుంటే జనం నోరు వెళ్ళబెట్టి ‘అబ్బా! కోరమాండల్’ అంటూ చూసేవారు! (వెంటనే మనసులో ప్రశ్న—అంత స్పీడులో అది గానీ………అనుకొని చెంపలు వేసుకునేవారు పాడు ఆలోచన వచ్చినందుకు).
ఇప్పటివరకూ యెప్పుడూ జరగరానిది జరగలేదు! మరి ఇప్పుడెందుకు—అంటే సమాధానం—లాలూగారి కక్కుర్తీ, మన బ్యూరాక్రసీ!
దాదాపు 50 యేళ్ళుగా యెప్పుడూ వినని ‘పట్టాలు విరిగిపోవడం’ గురించి 21వ శతాబ్దం మొదట్లో విని, ఆశ్చర్య పోయేవాడిని!
చిన్నప్పుడు సైన్సు లో లోహాల సంకోచ వ్యాకోచ లక్షణాల గురించి చెపుతూ, ‘రైలు పట్టాల్కి ఒక దానికీ, ఇంకోదానికీ యెడం వుంచుతారు యెందుకు—అవి వ్యాకోచించి, ఒకదాని నొకటి గుద్దుకొని ప్రమాదాలు జరుగుతాయని’ అని చెప్పేవారు మా మేష్టారు!
కొత్త టెక్నాలజీ అంటూ, పట్టాలని వెల్డింగ్ చేయడం మొదలు పెట్టారట—అందుకని పట్టాలు విరిగి పోవడం మొదలు పెట్టాయి!
మరి ఆ టెక్నాలజీని యెక్కడ సంపాదించారో, దాని మీద సరైన అధ్యయనం జరిగిందో లేదో మన బ్యూరాక్రసీయే చెప్పాలి.
అక్కడనించీ, కోకొల్లలుగా ‘త్రుటిలో తప్పిన’ రైలు ప్రమాదాలూ, గ్యాంగుమన్ సమయ స్పూర్తి వల్ల తప్పిన రైలు ప్రమాదాలూ, లైన్మెన్ కి అవార్డులు ప్రకటించడాలూ లాంటి వార్తలు పేపర్లలో చదువుతూనే వున్నాము.
వీళ్ళ కక్కుర్తికి పరాకాష్ట—‘సైడ్ మిడిల్ బెర్త్ లు’ బిగించడం!
ఒక రైలు పెట్టెలో, తొమ్మిది ‘సెల్స్ ‘ గా, ఒక్కోదాంట్లో అడ్డంగా యెదురెదురుగా మూడేసి చొప్పున ఆరూ, నిలువుగా రెండూ కలిపి, యెనిమిది బెర్తులతో మొత్తం 72 బెర్తులూ, యేదో ఒక పక్క మరో మూడు బెర్తులూ కలిపి, పెట్టెకి 75 చొప్పున బెర్తులు వుంటాయి.
ఇప్పుడు, తొమ్మిది సెల్స్ లో ఒక్కొక్కటి చొప్పున 9 సైడ్ మిడిల్ బెర్తులు బిగించడంవల్ల—తొమ్మిది మంది మనుషులు—ఒక్కొక్కరూ సగటున 50 కే జీల బరువున్నా, దాదాపు అర టన్నూ, బెర్తుల, వాటి గొలుసుల, బరువూ, వాళ్ళ లగేజీ బరువూ కలుపుకుంటే, కనీసం ఒక టన్ను బరువు పెరుగుతుంది కదా? మరి చక్రాలూ, ఇరుసులూ, బ్రేకులూ—వాటి పై యెంత భారం పడుతోంది—అని అధ్యయనం చేశారా? అదీ మన బ్యూరాక్రసీయే చెప్పాలి.
బొగ్గు ఇంజన్లతో రైళ్ళు నడిచేటప్పుడు మామూలు ఇంజన్లతో నడిచే రైళ్ళకి గరిష్ఠంగా యేడు లేక ఏనిమిది పెట్టెలు వుండేవి! కెనడా ఇంజను తో నడిచే మెయిలూ, జీటీ, సర్కార్ లాంటి రైళ్ళకి గరిష్ఠంగా పది/పన్నెండు పెట్టెలు వుండేవి. అప్పట్లో చక్రాల క్రింద నిప్పురవ్వలు రావడం, చూడడం చాలా అరుదు! అది కూడా మెయిలూ అవీ రాత్రి పూట పూర్తి వేగంతో వెళుతున్నప్పుడు—యెవరోగానీ చూసేవారు కాదు.
ఇప్పుడు చిన్న రైలుకి కూడా 18 పెట్టెలూ, పెద్దవాటికి 23 నించి 27 వరకూ తగిలిస్తున్నారు. వాటిల్లో కనీసం 9 నించి 14 వరకూ స్లీపరు క్లాస్ పెట్టెలూ, రెండైనా ఏ సీ (III) పెట్టెలూ వుంటున్నాయి. అంటే, కనీసం 15 నించి 20 టన్నులు బరువు పెరుగుతోంది ఈ సైడ్ మిడిల్ బెర్త్ ల వల్ల.
మరి పట్టాల లో యేమైనా మెరుగుదల వుందా?
కాంట్రాక్టర్ల అధికారుల అవినీతి తో బల్లాస్ట్ గా వాడే కంకర దగ్గరనించీ, ఒకచోట వేసిన దానినే బిల్లు తినేశాక ఇంకో చోటు కి తరలించి బిల్లులు పెట్టుకోవడం లాంటి లీలలతో నానాటికి తీసికట్టు నాగంభొట్టు అన్నట్టుంది వాటి స్థితి.
చక్రాలనించి నిప్పు రవ్వలు వచ్చినప్పుడు, పట్టాల వెల్డింగ్ కి ఉపయోగించిన లోహం కరిగిపోయి, చక్రాలకి చుట్టుకుని చక్కగా మండుతూ, బోగీలని అంటించేస్తోంది! అందుకే స్లీపర్ క్లాస్ లో మొదటి లేదా చివరి బోగీలకీ, వాటి పక్కనే ఏ సీ బోగీలకీ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి--బ్రేకులు వేసినప్పుడు వాటి చక్రాలకే వత్తిడి యెక్కువగా వుండి, నిప్పులు బాగా యెక్కువగా వచ్చి!
ట్యూటికోరిన్ లో తనకు బహూకరించిన మేకపిల్లని ఢిల్లీలో తన మనవడికి ఇచ్చి, అది మళ్ళీ తల్లికోసం బెంగ పెట్టుకుందని ఆ తల్లిని వెతికించి, దాన్ని మళ్ళీ ప్రత్యేక ఏ సీ బోగీలో ఢిల్లీ కి పంపించిన మన మేనేజిమెంటు గురు లాంటి వాళ్ళ నడ్డి విరగదన్నాలా వద్దా.
ఆలోచించండి!
Monday, February 2
I'm a citizen of the World
మన బ్యూరాక్రసీ
దీనికి సరైన తెలుగుమాట ఇంకా పుట్టలేదు!
ఇదెలాంటిదంటే, నిద్ర నటిస్తున్న గాడిద లాంటిది!
నిజంగా నిద్రపోతున్న గాడిదని లేపితే, వెనుక కాళ్ళతో తన్ననైనా తన్నుతుంది. దీనికి అలాంటి అనుభూతులేమీ వుండవు—నిద్ర నటిస్తోందిగదా!
రెండు చిన్న వార్తలు చూడండి!
ఈనాడు 06-01-2009 సంచికలో, పెట్రోలు కోసం క్యూలో రమ్మన్నందుకు కోపం వచ్చిన విద్యుత్ శాఖ ఉద్యోగి ఒకరు, ఆ లైనుకి చెందిన ట్రాన్స్ ఫార్మర్లోని ఫ్యూజులు తీసి పారేశాడట! బంకుతోపాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా అంధకారం లో ముంచాడట ఆ రాత్రిపూట! ఆ బంకు ఒక్కదానిలోనే పెట్రోలు వుందట! జనరేటరు కూడా లేదట! దాంతో గంటకు పైగా యెంతమంది యెన్నివిధాల ఇబ్బంది పడ్డారో ఊహించండి!
ఆ సోమరాజు మీద వాళ్ళ ఏ డీ ఈ కి ఫిర్యాదు చేస్తానన్నాడట వాళ్ళ ఏ ఈ!
తరవాతకధ వెండితెరమీద రాదు కదా? అందరూ అప్పుడే మరిచిపోయుంటారు!
అదే రోజుల్లో, ఏలూరులో, విద్యుత్ బిల్లులు కట్టలేదని, పురపాలక సంస్థ కి విద్యుత్ సరఫరా నిలిపి వేశారట విద్యుత్ శాఖవారు!
నీ పని ఇలాగవుందా? అని నగరపాలక సంస్థవారు ఓ జే సీ బీ ని తీసుకొచ్చి, మీ విద్యుత్ శాఖ భవనమే అక్రమ కట్టడం! దీన్ని కూల్చి వేస్తాము—యెవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అని విజృంభిస్తే, ఆ ఉద్యోగులందరూ నాలుగు దిక్కులకీ పరార్! ఆనక పోలిసులు రంగ ప్రవేశం చేసి, జేసీబీని స్వాధీనం చేసుకొని, 17 మంది ఉద్యోగులమీద కేసులు పెట్టి, తీరిగ్గా ‘విచారిస్తున్నారు’ట.
అదండీ!
Sunday, February 1
కార్పొరేట్.....
నేను ముందే చెప్పాను—రిటెయిల్ (చిల్లర) వ్యాపారాల్లోకి కార్పొరేట్ లు ప్రవేశించడం వాటికీ, ప్రజలకీ, చిన్న దుకాణదారులకీ, ఆర్ధిక వ్యవస్థకీ దేనికీ మంచిది కాదని! విన్నారా? వినరు!కార్పొరేట్ చిల్లర దుకాణాలు!
ఒక తాగుబోతు ఒక పెద్ద వీధి దీపం క్రింద గంట నించీ వెదుకుతున్నాడట దేనికోసమో! ఆ వీధినే గంటక్రితం వెళ్ళి, తిరిగి వస్తున్న వ్యక్తి అతన్ని అడిగాడట ‘యేమి వెతుకుతున్నావు?’ అని. అతను చెప్పాడు ‘పక్క వీధిలో మా యింటి తాళం పడిపోయింది—వెతుకుతున్నాను’ అని. ‘అదేమిటీ—పక్క వీధిలో పోతే అక్కడే వెతకాలిగాని, ఇక్కడ వెతుకుతే యెలా?’ అన్న ఆ వ్యక్తికి తాగుబోతు సమాధానం ‘మరి అక్కడ వెతకడానికి దీపం లేదుగా!’ అని!
మన కార్పొరేట్లు మాత్రం, ‘లాభాలు’ యెక్కడ వున్నాయా అని, సెర్చి లైట్లు పట్టుకొని వెతికేస్తాయి! చీమ దూరేంత సందు వుంటే యేనుగుని దోపెయ్యడానికి ప్రయత్నించేస్తాయి! దాని కోసం యెన్ని అడ్డ దారులైనా తొక్కుతాయి!
కొన్ని లక్షల చతురపు అడుగుల వ్యాపార ప్రదేశం లో, అనేక రకాల వస్తువులని నిలవ వుంచి, జనాన్ని రండి, కొనండి, ఆనందించండి అంటూ అహ్వానిస్తాయి!
మరి ఆ నిల్వలకి పెట్టుబడీ, భవన కట్టుబడి వ్యయం, దుకాణం నిర్వహణ ఖర్చులూ, ఉద్యోగుల జీత భత్యాలూ ఇలాంటివాటినన్నీ లెక్క వేసుకుని, వీధి చివర విల్లర కొట్టు వాడి కన్నా ప్రతీ వస్తువూ ఒకటి నించి పది రూపాయల తక్కువకి అమ్మి కూడా, లాభాలు అర్జించాలంటే, ముందే లెక్కలు వేస్తారు—మొదటి మూడు నాలుగు సంవత్సరాలూ నష్టాలు వచ్చినా, తరవాత (చిల్లర కొట్లన్నీ భూమి మీద నించి మాయం అయ్యాక, రెట్టింపు ధరలకి అన్నీ అమ్మడం మొదలెడితే) అయిదో సంవత్సరం నించీ ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయి—అని!
మరి ఈ లెక్కలు వేసేవాళ్ళు కూడా మన తొట్టి ఆడిటర్లే కదండీ? కాయితం మీద అన్నీ బాగానే వుంటాయి గాని, అసలు మాత్రం……అదన్నమాట!
నా చిన్నప్పుడు మా అమ్మ ‘బాబూ, ఎదురుగా వున్న చిల్లర కొట్లో ఓ పావుకేజి పంచదార పట్రా’ అంటే వెళ్ళిన నేను, దుకాణంవాడు కడుతుంటే, ఇంకొకావిడ వచ్చి ‘మూడ్డబ్బుల బెల్లం, కాణీ కాప్పొడుం బేగి ఇచ్చెయ్యి బాబూ! ఈళ్ళ నాన్న కోప్పడిపోతన్నాడు’ అని చంకలో చంటిబిడ్డని చూపిస్తుంటే, దుకాణంవాడు ‘కాసేపాగు! కాటాలొ పంచదార కనబడడంలేదు!’ అని విసుక్కుంటుంటే, ‘పోనీ ఆవిడకి ఇచ్చేసిన తరవాతే నాకు పంచదార ఇయ్యి!’ అనేవాడిని—నాకంత అర్జెంటు లేదని!
మరి ఈ రోజునైనా, పొద్దున్నే ఆరింటికి కాఫీ గొంతులో పడక పోతే గడవని వాళ్ళూ, నిన్న రాత్రి పొద్దు పోతేగానీ తమ ఆర్జన చేతిలో పడని వాళ్ళూ, తొమ్మిదింటికో, పదింటికో తెరిచి, ఉద్యోగులందరూ వచ్చి, సర్దుకుని, అమ్మకాలు సాగించే వరకూ, ‘మూడ్డబ్బుల బెల్లం, కాణీ కాప్పొడుం’ యెక్కడ వున్నాయా అని ‘మాల్’ అంతా గంటల తరబడి వెతుక్కుని, కొని, తీసుకెళ్ళడం—సాధ్యమేనా?
అందుకే ఈ రోజు ‘సుభిక్ష’ సంక్షోభంలో వుంది; రేపు త్రినేత్ర; యెల్లుండి ఇంకో చతుర్ముఖ, ఇలా అన్నీ!
మీ పిచ్చిగానీ! ఆడిటర్లూ—చిన్న లెఖ్ఖకి సమాధానం చెప్పండి—ఒక ఇల్లు కట్టడానిమి 30 మంది మనుషులకి 60 రోజులు పడితే, 600 మంది మనుషులు అదే ఇంటిని యెంత సేపట్లో కట్టగలరూ?
బుర్రలకి పదును పెట్టండి మరి!
పీ ఎస్: అపార్ట్ మెంట్ కొనబోతున్నారా? కొనొద్దు! ఆగండి. యెందుకంటే బిల్డర్లు ఉక్కుని టన్ను 60 వేల రూపాయలకి కొని కట్టారట! అదంతా మన మీద రుద్దుతారు! ఇప్పుడు టన్ను 29 వేలే! వాళ్ళు చెప్పిన ధరకి సగం రేటు కి ఇస్తేనే కొంటాం అని చెప్పండి! ఇవాళ కాక పోతే రేపు చచ్చినట్టు మీరడిగిన రేటుకే ఇస్తారు—లేదా కోట్లలో ములుగుతారు! తొందర మనకు లేదు!
విన్నారా?
విన్నారా?
".....వాల్ స్ట్రీట్ అధికారులు బిలియన్ డాలర్ల కొద్దీ బోనస్ లు తీసుకోవడం సిగ్గుచేటు, బాధ్యతారాహిత్యం" అని అమెరికా అధ్యక్షుడు ఒబామా......"ప్యాకేజీతో జెట్ విమానం కొనేందుకు సిటీ బ్యాంకు యత్నాల"ను తప్పు పట్టారు!
మన చట్ట సభల సభ్యులూ! వింటున్నారా?
Friday, January 30
“ఫుట్ బాల్”
మా చిన్నప్పుడు ఫుట్ బాల్ ఆడేవాళ్ళం!
మరీ చిన్నప్పుడు టెన్నిస్ బాల్ తో, ఎలిమెంట్రీ స్కూల్లో వున్నప్పుడు యెప్పుడో వారానికో, 15 రోజులకో ఒకసారి డ్రిల్లు పీరియడ్ లో, మా స్కూలు వెనక ఉన్న పుంతలో, యేరంగుదో తెలియని నిజం ఫుట్ బాల్ తో, హై స్కూల్ లో నిజం గ్రౌండ్ లో, నిజం ఫుట్ బాల్ తో, నిజం గా—ఇలాగ! కాలేజీకి వచ్చాక చిత్రంగా హాకీ లోకి మారి పోయే వాళ్ళం!
ఇప్పుడు యెవరన్నా ఆడుతున్నారో లేదో తెలీదు.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా దీన్ని ‘సాకర్’ అనే వ్యవహరిస్తున్నారు.
ఇంతకీ, నేను మొదలుపెట్టింది ఆ ఫుట్ బాల్ గురించి కాదు!
అమెరికా ప్రెసిడెంట్ దగ్గర వుండే “ఫుట్ బాల్” గురించి!
అమెరికా సర్వ సైన్యాధ్యక్షుడుగా ప్రెసిడెంట్ ఒక్కడే అణ్వాయుధ ప్రయోగం పై చివరి నిర్ణయం తీసుకో వచ్చు—అంతే కాదు వాటి ప్రయోగాన్ని ప్రారంభించవచ్చు! ఆ ప్రారంభాన్ని చేసేదే ‘ఫుట్ బాల్’! ప్రెసిడెంట్ శరీరాన్ని యెల్లప్పుడు అంటి పెట్టుకొనే వుంటుంది ఆ పరికరం!
మాజీ ప్రెసిడెంట్ రోనాల్డ్ రీగన్ తుపాకి తో కాల్చబడి, చావు బతుకుల్లో వుండగా, పెద్ద తర్జన భర్జన దీని గురించే జరిగింది! వైస్ ప్రెసిడెంట్ విదేశీ పర్యటనలో వున్నాడు! ఫుట్ బాల్ వుండగా, శస్త్ర చికిత్స చేస్తే, అటూ ఇటూ అయితే, ఆ ఫుట్ బాల్ సంగతేమిటి? ఆయన హాస్పిటల్ లో వుండగా, ఆ ఫుట్ బాల్ ని వైస్ ప్రెసిడెంట్ కి అమర్చ వచ్చా? అవసరం పడితే దాన్ని ఆయన ప్రయోగించదానికి రాజ్యాంగం అనుమతి ఇస్తోందా? ఇలా వందలాది ప్రశ్నలు!
యేదో చేసి, వెంటనే వైస్ ప్రెసిడెంట్ ని వెనక్కి రప్పించి, ఆ పరికరం నియంత్రణని తాత్కాలికంగా ఆయనకి అప్పచెప్పారు! తరవాత, రీగన్ కోలుకొని, మళ్ళీ తన ఫుట్ బాల్ తాను తీసేసుకుని వుంటాదనుకోండి.
మరి మనకి ‘ఫుట్ బాల్’ అనేది వుందా? అది మన అధ్యక్షురాలు వొంటి మీదే వుందా?
లేక మన ప్రధాని దగ్గర వుందా? మన ప్రధాని 18 గంటలకి పైగా అయిదో ఆరో బైపాస్ లు చేయించుకొంటున్నపుడు, అది యేమయ్యింది? కొంపదీసి ప్రణబ్ ముఖర్జీ కి గానీ ఇచ్చారా!
మరి పాకిస్థాన్ మాటేమిటి? వాళ్ళ ప్రెసిడెంట్ దగ్గర వుందా? మహమ్మద్ అజర్ దగ్గర వుందా?
ఒసామా బిన్ లాడెన్ దగ్గర యే దేశానికి సంబంధించినదైనా వుందా?
మన సోకాల్డ్ ప్రింట్/ఎలక్ట్రానిక్/ఇతర మీడియా యేమైనా పరిశోధన చేసి, ప్రజలకి వెల్లడించ గలుగుతుందా?
(అమెరిచాలో రోనాల్డ్ రీగన్ సంఘటన జరిగినప్పుడు విషయం బయట పెట్టినది వాళ్ళ మీడియానే!)
Thursday, January 29
"దేశ భక్తి"
యుద్ధోన్మాదమా?
మన పొరుగు దేశానికి బుద్ధి చెప్పాలనడం యుద్ధోన్మాదమా!
యుద్ధోన్మాదమంటే—1948 లో పాక్ ప్రదర్శించిందీ, 1962 లో చైనా చూపిందీ, తరవాత సంవత్సరాల్లో మళ్ళీ మళ్ళీ పాక్ చెలరేగిందీ—అదీ యుద్ధోన్మాదమంటే!
ఇంకా, వియత్నం మీదా, అఫ్ఘాన్ మీదా, సద్దాం మీదా, అమెరికా వాడు చూపింది!
మరి, మన జనం యెందుకు ఉలిక్కిపడతారు యుద్ధం అనగానే?
మనది శాంతికాముక దేశం కాబట్టి—అని ఓ వెర్రి నవ్వు నవ్వుతాము!
నిజంగానే మనది శాంతికాముక దేశం సరే! మన జాతి యెప్పుడో ఘోర యుద్ధాలు చేసీ, చూసీ, శాంతిని కోరుకుంది. అశోకుడంతటి వాడిని అహింసా పథానికి నడిపించిన కళింగ యుద్ధమే మన దేశంలో జరిగిన ఆఖరి అతిపెద్ద యుద్ధం!
తరవాత మన దేశం లో రాజులూ, చక్రవర్తులూ, సార్వభౌములూ యుద్ధాలు చేసినా, నష్టం వాళ్ళ (అంటే మన) వైపే వుండేది—యెందుకంటే మన సైనికులే తుపాకి గుళ్ళకీ, ఫిరంగి గుళ్ళకీ బలయి పోయేవారు!
అందుకే, అలాంటి మూర్ఖులకి వ్యతిరేకంగా పోరాడాలంటే మామూలు ఆయుధాలు పనికి రావు అని, అహింసనీ, సత్యాగ్రహాన్నీ పరమాయుధాలుగా మలిచి, ప్రజల్లో దేశ భక్తి ని రగిల్చి, అందర్నీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి స్వాతంత్ర్యాన్ని సాధించాడు మన జాతిపిత గాంధీ. అందుకే ఆయన మహాత్ముడయ్యాడు!
ఆ తరంలో అందరికీ, దేశ భక్తి అనేదొకటి అన్నిటికన్నా ముందు వుండేది!
1962 లో మనకి ఆధునిక ఆయుధాలు లేక పోయినా, మన సైన్యం చాలా తక్కువైనా, మన ప్రజల దన్నుతో ధైర్యంగా పోరాడగలింది మన సేన. అప్పట్లో ‘దేశ రక్షణ నిధి’ స్థాపించి, పిలుపు ఇవ్వగానే, దేశ ప్రజలే స్వచ్చందంగా కోట్లాది రూపాయలు ధార పోశారు—నగదుగా, బంగారం గా, వస్తు రూపంలో—యెలా వీలైతే అలాగ!
1965 లో, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి ‘వారానికొక పూట భోజనం మానేసి, దానికయ్యే ఖర్చుని రక్షణ నిధికి విరాళంగా ఇవ్వండి!’ అని పిలుపు ఇస్తే, దేశ ప్రజలందరూ వీలైనన్ని రోజులు ఒంటిపూట భోజనమే చేసి, పొదుపు చేసిన సొమ్ము విరాళాలిచ్చారు!
మహాత్ముడు ధనవంతులు సంపదకి దేశ ప్రజల తరుఫున ట్రస్టీలుగా వుండండి అంటే, ఆతరం అలాగే వుండేది! టాటాలు మొదలైనవాళ్ళు ఉక్కు కార్మాగారాల్ని స్థాపించినా, జౌళి మిల్లులు పెట్టినా, మన దేశ సంపద పెరగాలి, మనదేశం వర్ధిల్లాలి అనే భావించేవారు!
ధనికుల కుటుంబాల్లో పుట్టినా, జే ఆర్ డీ టాటా కూడా కష్టాలు అనుభవించాడు—వ్యాపారాభివృద్ధికి! ‘పీత కష్టాలు పీతవి’ అన్నట్టు, బిర్లాలు, దాల్మియాలూ, రూయాలూ, వాడియాలూ, అంబానీలూ—ఇలా అందరూ!
యెంత దార్శనికుడు కాకపోతే, వంటనూనెల వ్యాపారం చేసుకునే ‘విప్రో’ అధిపతి ‘కంప్యూటరు’ వ్యాపారం లోకి దిగాడు?
కార్సన్ భాయ్ పటేల్ ఇంటింటికీ తిరిగి, తన ‘నిర్మా’ అమ్ముకొనేవాడట!
(యెక్కడో ఒక ధీరెంద్ర బ్రహ్మచారి—జయంతీ షిప్పింగ్--వుండేవాడనుకోండి) అయినా, ఆ తరం అందరిలో, దేశ భక్తి అనేది ఒకటి వుండేది!
సరే, తరవాతది, మా తరం!
—(ఇంకా వుంది)
Monday, December 29
సామూహిక......Vs జనాభా
వివరణ-2
మగాడు సెక్స్ కోసం పెళ్ళికి ఒప్పుకుంటే, స్త్రీ భద్రతకోసం ఒప్పుకుంటుందంటారు! పెళ్ళి జరగ్గానే, మగాడికి భార్య మీద ఓ ఆధిపత్యం వచ్చేస్తుంది! భార్య ‘వద్దు’ అనడానికి వీల్లేదు! పైగా క్రిందితరగతి వాళ్ళకి వున్న టిక్కెట్ అక్కర్లేని వినోదం అదొక్కటే! అందుకని నిర్బంధంగానైనా అనుభవిస్తుంటాడు. పిల్లల్ని కంటూనే వుంటారు—సెక్స్ లో స్త్రీ సంతృప్తి చెందినా, లేకా పోయినా!
సహజీవనంలో ఈ స్థితి వుండదు! ముందుగా ఇద్దరూ ఒకరిని ఒకరు అన్నివిధాలా బాగా ఇష్టపద్దాక, ముందుగానే సెక్స్ లో కూడా ఇద్దరూ సంతృప్తి చెందుతున్నారని నమ్మకం కలిగాకే సహజీవనానికి అంగీకరించవచ్చు!
ఇలా కాకపోతే, ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చిన తరవాత, పూర్తిగా అర్ధం చేసుకునేవరకూ సెక్స్ ప్రసక్తి లేకుండా కూడా సహ జీవనంచెయ్యవచ్చు! పూర్తిగా నమ్మకాలు కుదిరితేనే సెక్స్ కి పరస్పరం అంగీకరించవచ్చు!
సహజంగా, ఇద్దరూ స్వేచ్చగా మాట్లాదుకొని, పిల్లల్ని కనడమా వద్దా నిర్ణయించుకోవచ్చు! వద్దనుకున్నంతకాలం నియంత్రణ పద్ధతులు వుండనే వున్నాయి!
యేడాది తిరగకుండా బిడ్డని యెత్తుకోవాలనే ఒత్తిడి వుండదు! స్త్రీకి ‘వద్దు’ అనడానికి సర్వ హక్కులూ వుంటాయి!
మరి జనాభా పూర్తిగా అదుపులోకి వచ్చెయ్యదూ?
దీన్ని చట్టబద్ధం చేస్తే, ఒడంబడిక వ్రాతలో వుండి రిజిష్టరు అయి వుంటుంది గనక, షరతులు ఉభయుల్లో యెవరు ఉల్లంఘించినా, చట్టబద్ధంగానే విడిపోవచ్చు—విడాకుల తతంగం కొనసా………గకుండా! (పిల్లల విషయం కూడా ఒప్పందంలో వుంటుందికదా!)
పట్టణాల్లోను, నగరాల్లోనూ ఇప్పుదు ఇలాంటివి జరుగుతూనే వున్నాయి—చట్టం లేకుండా, లిఖిత ఒడంబడిక లేకుండా!
ఓ స్త్రీ, ఓ పురుషుడూ ఒక బిడ్డతొ మీ పక్క అపార్టుమెంటు అద్దెకి తీసుకుని, సామానుతో సహా దిగి, మగాడు ఉద్యోగానికో, వ్యాపారానికో వెళ్తూ, బిడ్డ స్కూలుకి వెళ్తు వస్తూ వుంటే, అది ముచ్చటైన కుటుంబం అనుకుంటారా లేక ఆ మగాడు బిడ్డతో సహా వున్న స్త్రీని లేపుకొచ్చాడనుకుంటారా?
అలాంటి సహజీవనాలెన్ని లేవు?
Sunday, December 28
సామూహిక...... Vs జనాభా
వివరణ--1
1) అసలు వివాహం అంటే ఓ లైసెన్స్—చట్టబద్ధంగా, సురక్షితంగా, స్వేచ్చగా, భార్యా భర్తలు లైంగిక సంబంధాన్ని అనుభవించడానికి! దానికోసం మొదటి మూడు నిద్రలూ జరిపించటం ఓ ముచ్చట! ఆ తరవాత కూడా, రాత్రి తొమ్మిది అవగానే, భార్యా భర్తలు పడగ్గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నా, ఇంట్లో వాళ్ళు (పుట్టింట్లో గాని, అత్తింట్లో గాని) ముసిముసిగా నవ్వుకుంటారేగానీ, వద్దనరు, తప్పు పట్టరు! (యెక్కడో కొంతమంది అత్తలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారులెండి!)
ఇంతే కాకుండా, వాళ్ళమీద ఒక అజ్ఞాత ఒత్తిడి వుంటుంది—వెంటనే ఓ బిడ్డని కనాలని.
దీంతోపాటు, ఒక యేడాది తిరిగేసరికల్లా, బిడ్డ పుట్టలేదనుకోండి, ఇంట్లో వాళ్ళూ, వీధిలో వాళ్ళూ, ఇంటికి వచ్చేపోయే బంధువులూ, ఇంటిపనివాళ్ళూ, చివరికి ఆ వీధి ముష్టివాళ్ళు కూడా ఆరా తీస్తారు—‘అమ్మాయి ఇంకా నీళ్ళు పోసుకోలేదా?’ అంటూ!
దీనివల్ల, ఈ రోజు ఓ వెయ్యి సామూహిక వివాహాలు అయ్యాయనుకోండి, (వాళ్ళ సరాసరి వయసు పాతిక వుండచ్చు) 2009 డిసెంబరు 31 లోపల కనీసం 800 నించి 850 శిశువులు పుడతారు! (ఇవి కోట్లాదిగా ప్రతీ యేటా జరిగే మామూలు వివాహాలకి అదనంగా, ప్రభుత్వ/మత ప్రోత్సాహంతో జరుగుతున్నవి అని మరిచి పోకండి).
వాళ్ళలొ, ఓ 5 శాతం దాకా—అంగ వైకల్యంతోనో, మానసిక సమస్యల్తోనో పుట్టడానికి అవకాశం వుంది అని ఆధునిక శాస్త్రం చెబుతోంది!
ఇంకో 10 శాతం దాకా—సరైన ఆహారం లేక, 5 యేళ్ళలోపే మరణిస్తున్నారని కూడా శాస్త్రం చెబుతోంది!
బతికి బట్టకట్టిన వాళ్ళలో, సరైన తిండీ, గుడ్డా లేక, పతితులూ, భ్రష్టులూ, బధా సర్పదష్టులుగా మారుతున్నవాళ్ళూ—ఓ 20 శాతం వుంటారు!
మిగిలిన వాళ్ళలో 50 శాతం—చేతికీ, నోటికీ కష్టం మీద లింకుచేసుకుంటూ బ్రతికే దిగువ మధ్యతరగతికి చెందే అవకాసం వుంది!
ఇక్కడకి మిగిలిన 15 శాతంలో, కొంతమంది ఉద్యోగాల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఇతర వృత్తుల్లోనూ చేరి, యెగువ మధ్య తరగతిగా మారతారు!
ఏ 0.5 శాతమో కోటీస్వరులు అయినా అస్చర్యం లేదూ!
ఇవన్నీ సామాజిక సమస్యలు. వీటిని అధిగమించడానికి సహజీవనం యెలా తోడ్పడుతుందో—మళ్ళీ చూద్దాం!
Saturday, December 27
సహజీవనం
మహారాష్ట్ర ప్రభుత్వం సహజీవనం చేసేవారు పెళ్ళి తో సమంగా న్యాయసూత్రాలకి బద్ధులై వుండాలని, మార్గ దర్శక సూత్రాలు రూపొందించే పనిలో వుందట!
ఇదో సంగతి!
Friday, December 26
జనాభా
675,16,43,600
రేపు జనవరి ఫస్ట్ కి ప్రపంచ జనాభా చేరుకోబోతున్న అంకెట ఇది!
అది కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే పెరుగుదల శాతం యెక్కువట! (అచ్చు పొరపాటై వుంటుంది—‘చెందుతున్న’ అని వుండవలసింది.)
మరి మనదేశంలో మనవంతు కృషి?
ఎందుకు చెయ్యడంలేదు—అంటారా?
అదే—తితిదే తరఫున వేలాది సామూహిక వివాహాలూ, వీళ్ళని చూసి ఇతర మతాలవాళ్ళు కూడా సామూహిక వివాహాలకి ప్రొత్సాహకాలు అందించడం—ఇలా శాయ శక్తులా కృషి చేస్తున్నాం!
మొన్నీ మధ్య ఓ బాలీవుడ్ నటీమణి, జనాభా పెరుగుదలని అరికట్టక పోవడం వలననే ‘సునామీలూ’ వగైరా వస్తున్నాయి అందిట! (పాపం తను చదువుకున్న ‘మాల్థూజియన్ థియరీ ఆఫ్ పాప్యులేషన్’ లోని పాజిటివ్ చెక్స్ వగైరా గుర్తొచ్చి ఎదో అని వుంటుంది!—మీడియా దాన్ని సందర్భ రహితంగా వుపయోగించుకొంది!)
జనాభా పెరుగుదల అరికట్టాలంటే, మేధావులు చేస్తున్న ముఖ్య సూచన, ఇష్ట పడిన స్ట్రీ పురుషులు ‘కలిసి వుండడం’ ని చట్టబద్ధం చెయ్యాలని! కొన్ని దేశాల్లో ఇది అమల్లో వుందట!
నిజంగా చాలా మంచి సూచన! సమాజం కూడా బాగుపడుతుంది!
ఓ పాతిక సంవత్సరాల క్రితం, ఉత్తర భారతంలో ‘మైత్రీ కరార్’ అని వ్రాసుకుని, రిజిష్టర్ చేయించుకునేవారు.
అంటే ఓ ఆడా ఓ మగా ‘మేమిద్దరం స్నేహం గా వుండదలుచుకున్నాం’ అని ఒప్పందం వ్రాసుకొని, మిగిలిన షరతులన్నీ పకడ్బందీగా వ్రాసుకునేవారు—‘తోడుకోసం, సామాజిక భద్రతకోసం మాత్రమే, యెవరి సంపాదనా ఖర్చూ వారివే, ఒకవేళ పిల్లలు పుడితే ఏమి, ఎలా చెయ్యాలి—లాంటివన్నీ కూడా వ్రాసుకొని, రిజిష్టరు చేయించుకునేవారు!
అప్పట్లో, ఓ హైకోర్ట్ ఈ కరార్లు చెల్లవు అని తీర్పు ఇచ్చినట్టు గుర్తు.
ఇప్పటికైనా ఇలాంటివి చట్టబద్ధం చేస్తే, సగం సామాజిక సమస్యలు, ప్రేమోన్మాదాలూ, యాసిడ్ దాడులూ లాంటివి తప్పుతాయి!
ఏ పార్టీ అయినా ఇలాంటి వాగ్దానంతో పోటీ చేసే ధైర్యం చేస్తుందా?
Wednesday, December 24
నిజమేనా?
Is it not?
Feroz Khan was a Parsi.
When he wanted to marry Indira Gandhi and she agreed, her father Nehru was reluctant to marry her off to Feroz!
Then our Mahatma Gandhi announced that he would adapt Feroze and lend him the name of Gandhi!
Then he himself has performed the marriage, convincing Mr. Nehru.
Our modern World history starts with the words “When Constantinople yielded to the Turks………..”! Nobody know why it yielded to the Turks!
The ancient Turks (‘Turushkulu’ in Telugu) had divided later into so many Religions, Sub-Religions, Sects and Sub-Sects—like Shias, Sunnis, Jews, Zorastrians, Dawoodi Bohras, Parsis, Bondilis etc.
The only common bond among these is ‘Suntee’ in Telugu, ‘barmitzvah’ for Jews, and ‘Male Organ Circumcission’ in Science & Surgery!
(Please correct me if I am wrong in case of any of these sects.)
So far as ‘kur-An’ is concerned, there is never a reference to the word ‘Muslim’ in the entire Text!
The followers of ‘Islam’ were called ‘Musalmaan’s! The Western People, who could not pronounce the word properly used to pronounce ‘Moslems’ and later it has transformed into the word ‘Muslims’!
In India also, the followers of Prophet Mohammed were called ‘Mohammadans’!
But the irony is, the Indian Media has created a separate Religion/Sect known as ‘Muslim Sodarulu’!
They are neither Mohammadans, Muslims, Islam followers, Turks, Shias, Sunnis, Parsis etc., but a separate entity!
(Please read, in any print media, no single word ‘Muslim’ is printed! Only ‘Muslim Sodarulu’ is found!
Hear any electronic media—no single word ‘Muslim’ is heard! Only ‘Muslim Sodarulu’ is heard!—
What a pinnacle of hipocracy!)
Why don’t we call a Spade a Spade—at least now?
Monday, December 22
టీం సోనియా!
ఉలిపికట్టా…..గూఢచారా?
అనినీతి కుంభకోణాల భీష్ముదు—ఏ ఆర్ ఆంటూలే మహశయుడు నోరు విప్పాడు—అది నోరా, సెప్టిక్ టాంకా అనిపించే విధంగా!
ఊరందరూ (దేశ విదేశాలన్నీ) పాకిస్థాన్ ని వేలెత్తి చూపిస్తుంటే, వీడు ముంబాయిదాడులు ఇంకెవరిపనైనా యేమో—అంటూ!
వీడు మన దేశానికే అవినీతి భీష్ముడు! (బై ది బై, క్రికెట్ టీము లో వీడు మిడిల్ ఆర్డరు!)
జయంతి ధర్మతేజ, ముంద్రాల్లాంటివాళ్ళు లక్షల్లో ప్రారంభించిన కుంభకోణాల్ని, మొదటిసారిగా కోట్లలోకి చేర్చిన రికార్డు హోల్డరు!
మహారాష్ట్ర ముఖ్య మంత్రిగా వుంటూ, “ఇందిరా గాంధీ ప్రతిభా ప్రతిష్ఠాన్” పేరుతొ అధికార దుర్వినియోగానికి పాల్పడి, కోట్లు నొక్కేసినవాడు!
అతి కష్టమ్మీద వీడి ముఖ్య మంత్రి పదవి పీక గలిగింది ఇందిరా గాంధీ! (గవర్నరు పదవి ఇచ్చింది లెండి).
తరవాత, అవినీతి ధృతరాష్ట్రుదు రాజీవ్ గాంధీ యేకంగా 46 కోట్ల “బొఫొర్స్" కుంభకోణంతొ కోట్ల కుంభకోణాలు సామన్యమైపోయాయి ఇండియాలో!
నాలుగో వికెట్ అర్జున్సింగ్ గారు, ‘జోర్హాట్ లాటరీ’ తొ జోర్హాట్ బాబా గా ప్రసిద్ధి చెందారు!
అసలు వీళ్ళందరికీ మన ‘అంధేర్ నగరి’ ‘అన్ భుజ్ రాజా’ కొలువులో వుండడానికి అర్హత యేమిటంటారు? రాజకీయ మహా మఱ్ఱి చెట్టు ఇందిరా గాంధీ పేరు చెప్పుకొని—కాయలుకూడా కాదు—కట్టెలు అమ్ముకోవడం తప్ప?
ఇందిరా గాంధీ ఓ గొప్ప నాయకురాలే! ఆమె సమర్ధతనీ, దేశాభివృద్ధి పట్ల ఆమె నిబద్ధతనీ యెవరూ ప్రశ్నించలేరు—కానీ, వోటు రాజకీయ, వోటు బ్యాంకు రాజకీయాల వల్ల వీళ్ళందర్నీ భరించవలసి వచ్చింది!
ఆ దరిద్రం ఇప్పటి వరకూ దేశాన్ని వదలడంలేదు—ఆవిడ కోడలు పుణ్యమాని! అసలు ఆ చేట పెయ్యని నిలబెట్టింది ఈ వెధవలే కాదూ?
వృద్ధ జంబుకం (మూడో వికెట్--రక్షణ మంత్రి) తాటాకు చప్పుళ్ళు చేస్తోంది—పాకిస్ఠాన్ తోడేలు పై! ‘మేము దేనికీ వెనుకాడం’ లాంటి మాటల్తో! అమెరికా, ఇతర దేశాలూ తెగేసి చెప్తున్నాయి ‘పాకిస్థాన్ తీవ్ర వాదుల మీద చర్య తీసుకోకుంటే సహించేది లేదు!’ అని. ఈ మద్దతు తో ఇప్పటికే పీవోకే లోని టెర్రరిస్ట్ స్థావరాలని ఓ చూపు చూడవలసింది!
కానీ, దళాలని నడిపించ గలిగిన ‘మానెక్ షా’లేరీ? ఓకే అనగలిగిన ఇందిరా గాంధీలేరీ?
ఈ క్రికెట్ టీముల్ని హిందూ మహా సముద్రం లో కలపగలిగిన వొటరులేరీ?
వున్నారంటారా! సరే! చుద్దాం!
Sunday, December 14
మీడియా
మీడియా
వార్తా పత్రికలూ (ప్రింట్ మీడియా), టీవీలూ, కంప్యూటర్లూ వగైరా (ఎలక్ట్రానిక్ మీడియా), రేడియోలూ ఫోన్లూ, (ఇదేమి మీడియానో తెలీదు) ఇలాంటివన్నీ “మీడియా” అంటున్నారు.
ప్రజాస్వామ్య దేశం లో ఇది చాలా శక్తివంతమైనదట!
మరి అలాంటి మీడియా యెంత బాధ్యతాయుతంగా వుండాలీ?
పేపర్లలో మొన్న ముంబాయిలో తీవ్రవాదుల దాడి సందర్భంగా ఇండియా గేట్ దగ్గర మోహరించిన కెమేరాలూ వగైరా ని తీసి ప్రచురించిన ఫోటోలు చూశారుగా?
ఇప్పుడు దర్యాప్తు సంస్థలు తేల్చినదేమిటంటే, ఈ లైవ్ టెలీకాస్టుల వల్ల ఉగ్రవాదుల నాయకులకి యెప్పటికప్పుడు తాజా స్థితి తెలెసిపోయేది అనీ, వాళ్ళు మళ్ళీ ముంబాయిలో తీవ్రవాదులకి తాజా ఆదేశాలు జారీ చేసేవారనీ!
అదే కాదు—ఓ పక్క ఒక సంఘటన జరిగితే, దర్యాప్తు సంస్థల కన్నా ముందు ఆ స్థలాన్ని చేరుకొని, అంతా కంగాళీ చేసేసి, అధారాలని దొరక్కుండా చేస్తున్నవి ఈ మీడియాలే!
అదే అమెరికా లాంటి దేశాల్లో, నిరంతర పెట్రోలింగ్ వగైరాల వల్ల, సంఘటన జరిగిన రెండు మూడు నిమిషాల్లోనే, పోలీసులు అక్కడికి చేరి, సంఘటన స్థలం చుట్టూ పసుపు రంగు రిబ్బన్లు కట్టేసి, ఇంకెవర్నీ ఆ స్థలంలోకి రానివ్వరు! మీడియా వాళ్ళని కూడా! వాళ్ళు అవసరమైన ఆధారాల్ని సేకరించాక, అప్పుడు మీడియాని అనుమతిస్తారు! అప్పుడు నేరగాళ్ళని పట్టుకునే అవకాశాలు చక్కగా వుంటాయి.
ఇంక ప్రింటు మీడియాలో కూడా, కొంతమంది సోకాల్డ్ ‘ఎక్స్పర్ట్’ కాలమిస్టులు తమ అభిప్రాయాలని విచ్చలవిడిగా వెదజల్లుతూ వుంటారు! ఉదాహరణకి, ఓ కాలమిస్ట్ “గత కొన్ని రోజులగా వడ్డీ భారాలతో నడ్డి విరుగుతున్న ‘సామాన్యుడు’ రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న చర్యలతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నాడు” అంటాడు!
సంక్షోభం అంటూ చెప్పుకుంటున్న స్థితి మొదలయ్యాక, ఇప్పటివరకూ అలా ‘నడ్డి విరిగిన’ ఒక్క సామాన్యుణ్ణయినా చూపించ గలడా, ఆ కాలమిస్ట్?
ఇంకొకడున్నాడు—వాడు ఎమర్జన్సీ టైములో గవర్నమెంటుని నిర్భయంగా కలంతో యేకేశాడు. తరవాతకూడా ఇందిరాగాంధీ చేస్తున్న తప్పులనీ, ఏ ఆర్ ఆంటులే, అర్జున్ సింగ్ లాంటి అవినీతి పరుల్ని యేకేశేవాడు. తరవాత, జనతా ప్రభుత్వాన్ని—అసలు సమస్యేకాని ‘ద్వంద్వ సభ్యత్వం’ లాంటి కారణాలతో, పడిపోయేదాకా వదల్లేదు! రాజీవ్ టైములో ‘బోఫోర్స్ ‘ నీ, వీపీ సింగ్ టైములో సెయింట్ కిట్స్ కేసునీ, ఇలా యేదీ వదిలేవాడు కాదు. వాజపేయి గారి టైములో, ‘కాషాయీకరణ’ అనేవాడు. మరిచిపోయాను—పాకిస్థాన్ మీద ఎక్స్పర్ట్! పదిరోజులకోసారైనా అక్కడికి వెళ్ళి వస్తూ వుంటాడు. పాకిస్తాన్ ని కౌగిలించుకోవాలంటాడు. కాశ్మీరు మండిపోయినా, ముంబాయి పేలి పోయినా, పార్లమెంటు దద్దరిల్లినా—పాకిస్థాన్ తో స్నేహ సంబంధాలకి భారత్ మాత్రమే ముందడుగు వేస్తూ వుండాలంటాడు!
ఇలాంటి మీడియాల వల్ల ప్రజాస్వామ్యానికి యేమి ఒరుగుతోందో యెవరికి వారే అలోచించాలిమరి!
Wednesday, November 26
మహిళాలక్షాధికారులు!
మన ముఖ్యమంత్రి గారికి ఉట్టికెక్కలేక పోయినా, స్వర్గానికి యెక్కాలని ఆశ!
(మోటు సామెత చెపితే, ‘పిత్తడానికి శక్తి లేదు గానీ, పాసనాలకి మందు అడిగాడట!)’
‘లక్ష కోట్ల బడ్జెట్’ ‘ముష్టెత్తైనా జలయఙ్ఞం సాగిస్తాం’ ‘భూములమ్మి, నిధులు సంపాదిస్తాం’ లంటి మాటలతో ప్రారంభించిన ఇన్నింగ్స్, ఫాలో ఆన్ తో ముగించాల్సిన పరిస్తితి వొచ్చేట్టుంది!
అసలే ప్రతిపక్షాలూ, పత్రికలూ, కోర్టులూ, ట్రిబ్యునళ్ళూ, ‘కాగ్’, రైతులూ, సెజ్ బాధితులూ, కారిడార్ బాధితులూ తో పాటు సామాన్యులు కూడా (గుత్తేదార్లూ, సెజ్ ల లబ్ధిదార్లూ తప్ప) చీల్చి చెండాడుతున్నారు!
పులి మీది పుట్రలా ఆర్ధిక మాంద్యం—రియల్ ఎస్టేట్ వ్యాపారం పడుకోవడంతో, ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి!
అయినా, మేకపొతు గాంభీర్యం ప్రదర్సిస్తూ—‘చేబదుళ్ళకి వెళ్ళం’ అంటున్న ఆర్ధిక మంత్రి, నకనకలాడుతూ డిపార్టుమెంటులు వుండగా, మన ముఖ్య మంత్రి మాత్రం “కోటి మంది మహిళల్ని లక్షాధికారుల్ని చేస్తాం—పావలా వడ్డీతో!” అంటూ ప్రకటనలు!
యెవరి చెవుల్లో పువ్వులు పెడతారు?
(మహిళా గ్రూపుల గురించి మరోసారి!)
Tuesday, November 25
ద్రవ్యోల్బణం
అమెరికా లో లీటరు 4 డాలర్లకి పెరిగిన గాసోలిన్ ఇప్పుడు మళ్ళీ 1 డాలరుకి తగ్గిందట.
మనకి మాత్రం పెరిగినప్పుడు పెరగడమేగాని, తగ్గినప్పుడు తగ్గడం వుండదు!
దగ్గర దగ్గర 150 డాలర్లనించి తగ్గింది కదా? మరి మన విత్త/ఇంధన మంత్రులు యేమంటున్నారు?
‘చముఱు కంపెనీల పేరుకున్న నష్టాలు తగ్గుతున్నాయ'ట—అందుకని 'ఇప్పుడప్పుడే తగ్గించరట!’
ఇదివరకు ఎన్ డీయే గవర్నమెంట్ చముఱు ధరలు పెరగడం మొదలవగానే, ఓ వందో యెన్నో కోట్లతో ‘ఆయిల్ పూల్ ‘ యేర్పాటు చేసి, దాని నుంచి పెరుగుదలనీ, తగ్గుదలనీ సర్దుబాటు చేసేది.
ధరలు స్థిరపడగానే, ఆ పూల్ ని రద్దు చేసింది. అక్కడనించీ, మార్కెట్ మీద ఆధారపడి, లీటరుకి రెండు పైసలో, ఐదు పైసలో పెరగడమో తగ్గడమో జరిగేది!
మరి ఈ గవర్నమెంట్ పీపా యే డెబ్భై డాలర్లకో గబ గబా పెరగ్గానే ఆ పని చేసి వుంటే, ద్రవ్యోల్బణం ఈ రోజు ఈ స్తితికి వచ్చేది కాదుగా?
వీళ్ళకి ‘సామాన్యుడంటే’ లెఖ్ఖ వుంటేగా?
Tuesday, November 4
బలుపుకాదు.....వాపు!
అమెరికాకి కాబోయే అధ్యక్షుడు బరాక్ ఒబామా బుష్పరిపాలనపై, రిపబ్లికన్ పార్టీ పై సారించిన ముఖ్యమైన ఆరోపణాస్త్రం యేమిటి?
“షేర్ మార్కెట్ కి అలవిమాలిన ప్రాముఖ్యం కట్టబెట్టి, తక్కిన రంగాల్నినిర్లక్ష్యం చేసిన అవకతవక విధానాల పర్యవసానంగానే ‘మహామాంద్యం’ పునరావృతమయ్యే దుస్థితి దాపురించింది” అని!
ఆయనంటున్న ‘మహా మాంద్యం’ 1929 నాటి ప్రపంచ (అంటే అప్పట్లో యూరప్, అమెరికా ఖండాలు) ‘గ్రేట్ డిప్రెషన్’ అనబడే ఆర్ధిక మాంద్యం!
దీని గురించి ఓ చిన్న జోక్ లాంటి నిజం—
తండ్రి చనిపోయాక, కొడుకులిద్దరు సమానంగా ఆస్థి పంచుకున్నారట. తరవాత అన్నగారు చాలా జాగ్రత్తగా తన డబ్బుని పెట్టుబడులుగా పెట్టాడట.
తమ్ముడు మాత్రం, డబ్బంతా తగలేసి, కొన్నివేల సీసాలు మద్యం తాగుతూ గడిపాడట!
ఈ లోగా రానే వచ్చింది ‘గ్రేట్ డిప్రెషన్’!
దాంతొ అన్నగారు ఒక్కసారిగా బికారి అయిపోయాడు!
మాంద్యం పోగానే, తమ్ముడు, ఖాళీ మద్యం సీసాలు అమ్ముకొని, కోటీశ్వరుడు అయ్యాడు!
అదండీ సంగతి!
మన విత్త మంత్రి గారేమో ‘వ్హిప్పింగ్ ది డెడ్ హార్స్’!
ఈ రోజు (04-11-2008) బ్యాంకర్లని ఋణాలమీద వడ్డీ రేట్లు తగ్గించాలని కోరి, అందుకు వప్పించాడట!
ఈ రొజున కూడా వయో వృద్ధులకి 11%, మిగిలినవాళ్ళకి 10.50% వడ్డీతో డిపాజిట్లు సేకరిస్తున్నాయి బ్యాంకులన్నీ! ఈ నెలాఖరు వరకూ బహుశా ఇదే కొనసాగుతుంది!
మరి ఋణాల వడ్డీలు ఎలా తగ్గుతాయి? బహుశా కోటి రూపాయల పైబడిన ఋణాలకి ఓ 0.5% తగ్గిస్తారేమో!
బై ది బై, మీ రిజర్వ్ బ్యాంకు ఆర్ధిక వ్యవస్థ లోకి విడుదల చేసిన 2,50,000 కోట్లేమయ్యాయి?
సెన్సెక్స్ ని అతి కష్టం మీద 10,000 పాయింట్లు దాటించాయి!
ఇప్పటికైనా ఒప్పుకుంటారా—ఇది బలుపు కాదు…..వాపు అని?
Sunday, November 2
మా మేష్టారి ఇంకో తిట్టు
‘యెదవన్నర యెదవన్నర యెదవాని!’
అని తిట్టి, అడిగేవారు—‘అంటే యెన్ని యెదవలురా?’ అని!
వెంటనే లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాదు లేచి, ‘4 యెదవలు మేష్టారూ’
అంటే, ‘ఒరే! యెదవా! యెదవన్నూ, అరయెదవన్నూ, అరయెదవన్నూ కలిపితే యెంతరా?’అని లెఖ్ఖల్లో పూర్ కుర్రాణ్ణి అడిగి, వాడు ‘రెండు యెదవలు సార్’ అనగానే, అద్గదీ! అనేవారు!
మళ్ళీ ‘ఈసారి వీసెన్నర వీసెన్నర వీసె అంటే, ఎన్ని వీసెలురా?’ అని అడగ్గానే, నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అనుకొంటూ, యెప్పుడూ మేష్టారు నిన్నే మెచ్చుకునేలా వుండాలని తల్లిదండ్రుల చేత ప్రబోధింపబడినవాడైన లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాడు, అంతకు ముందు అయిన అవమానాన్ని మరిచి పోయి, ‘రెండు వీసెలు మేష్టారూ’ అనగానే,
మళ్ళీ మేష్టారు ‘వీశెన్నరా, వీశెన్నరా, వీశా—ఎంతరా? అని అడిగి, పిల్లలు కోరస్ లో ‘నాలుగు వీశెలు సార్’ అంటుండగానే, చిన్నబుచ్చుకుంటున్న లెఖ్ఖల బ్రైట్ కుర్రాణ్ణి చూస్తూ—‘ఒరే! ట్రిక్ తెలిసిందా? లెఖ్ఖలంటే ఇలా కూడా వుంటయి! పుస్తకాల్లో చెప్పేవేకాదు!’ అని కొసమెరుపు ఇచ్చేవారు!
అన్నట్టు ఈ వీశెల మానం పూర్తిగా చెప్పనా?
2 అర తులములు = 1 తులము
2 తులములు = 1 ఫలము
2 ఫలములు = ½ పంపు
2 ½ పంపులు = 1 పంపు
2 పంపులు = 1 ఏబులము
2 ఏబులములు = 1 పదలము (లేదా) ½ వీశ
2 ½ వీశలు = 1 వీశ
8 వీశలు = 1 మణుగు
20 మణుగులు = 1 పుట్టి (లేదా) బారువ
—ఇవి తూకానికి సంబంధించినవి!
ఇవి కాకుండా, కొలతలకి (పాత్రల్లో కొలిచేవాటికి) ఇంకో మానం వుండెది.
దానికీ, దీనికీ సంబంధం వుండెది!
అవి మరోసారి!
మరి ఇంతకీ ఆ లెఖ్ఖల్లో బ్రైట్ కుర్రాడెవరో ఊహించండి!
Saturday, November 1
పిల్ల కాకి
1975వ సంవత్సరం, ఆ తరవాతా, దేశంలో యమర్జెన్సీ అమల్లో వుండగా, మాలో ఓ జోక్ బయలుదేరింది.
ఆ సమయంలో, ఇతర పార్టీల నాయకులందర్నీ కటకటాల వెనక్కి తోసేశారు! పత్రికలమీద సెన్సార్ షిప్ విధించబడింది! దానికి నిరసనగా, పత్రికలు తమ సంపాదకీయాల్తో సహా, సెన్సారు చేయబడ్డ మేటర్ స్థానంలో యేమీ ముద్రించకుండా, తెల్లగా వదిలేసేవి! అది చూసి, మరో ప్రభుత్వ ఉత్తర్వు—పత్రికల్లో యెక్కడా ఖాళీలు వుంచకుండా తప్పనిసరిగా అచ్చుతో నింపాలని!
అలా వుండేది!
అప్పటి కాంగీ—ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐ—అంటే ఇందిర!) నినాదం
“దేశ్ కీ నేతా—ఇందిరా గాంధీ!
యువాఓంకా నేతా—సంజయ్ గాంధీ!” అని వుండేది.
అప్పట్లోనే, రాజీవ్ గాంధీ కి కొడుకు పుట్టేడు.
అప్పుడు మేము పుట్టించాం—‘బచ్చోం కే నేతా—రాహుల్ గాంధీ’ అని కూడా కలుపుతారు! ఆని.
ఆ బచ్చా, ఈ రోజు యువా అవనే అయ్యాడు!
అప్పట్లో సంజయ్ వెనకాల, వయో వృద్ధ నాయకులు కూడా, వాడి చెప్పులు మోస్తూ తిరిగారు!
తరవాత, రాజీవ్ వృద్ధ నాయకుల్ని గెంటేసి, పార్టీని వశం చేసుకున్నాడు—ఇదంతా చరిత్ర.
ఇప్పుడీ యువ (పిల్లకాకి) పేలుతున్నాడు!
మావంశంలోవాళ్ళు అధికారంలో వుంటే బాబ్రీ మసీదు కూలేదేకాదు……వగైరా వగైరా! (వీళ్ళ వంశం నిర్వాకాలు యెవరికీ తెలియవనుకుంటున్నాడు…..పాపం)
సరే, అవన్నీ అటుంచండి. మొన్న టీవీ వార్తల క్లిప్పింగుల్లో ‘మా నాన్న హత్య జరిగి ఇన్నేళ్ళయినా—నాకింకా న్యాయం జరగలేదు’ అని బుక్కు బుక్కుమంటూంటె, ఆహా, తన వంశంవారి ఆధ్వర్యంలో నడుస్తున్న పాలనని విమర్శించేంత దమ్ము వచ్చిందా అని ఆశ్చర్య పోయారు జనం!
తరవాత తెలిసింది—సందర్భమూ, అసలు విమర్శా యేమిటని!
యెవరో ఓ విద్యార్థి ‘అఫ్జల్ గురుని గవర్నమెంటు ఇంకా యెందుకు ఉరి తియ్యలేదు?’ అని అడిగినందుకట ఈ కోపం! యెవరి మీద అని ఆయనే వివరణ ఇచ్చాడు---మన న్యాయ వ్యవస్థ చాలా నెమ్మది---కాబట్టే నాకింకా న్యాయం జరగలేదు---అని.
అవాకులూ, చెవాకులూ కాకపొతే యేమిటి?
అఫ్జల్ గురు విషయంలో న్యాయ వ్యవస్థ చెయ్యవలసినది చేసి (ఉరి శిక్ష వేసి) యేళ్ళు గడుస్తున్నాయనీ, అమలు పరచనిది ఈ చేతగాని ప్రభుత్వమేననీ, దానికి వేరే కారణాలు కూడా వున్నాయని మరిచిపోయాడా?
మీ నాన్న విషయంలో నువ్వు నిరీక్షిస్తున్న న్యాయం యేమిటి?
నీయక్క జైలుకి వెళ్ళి మరీ నళినిని పరామర్శించి, తిరిగొచ్చాక ‘ఆడ కూతురు—చంటిపిల్లతో వుంది—విడుదల చేసెయ్యచ్చుకదా’ అని వాపోయిందే? థాను కూడా ఈ రొజు బ్రతికే వుండి, నళిని వున్న స్థితిలోనే వున్నా, ఇదే మాట అనగలిగేదా?
నీ అక్కది వేరే న్యాయం, నీది వేరే న్యాయమా?—అని యెవరైనా అడిగారా?
యెందుకైనా మంచిది—ఏ ఫారిన్ నిపుణుడిచేతో వీడికి కౌన్సెలింగ్ చేయిస్తే మంచిదేమో ఆలోచించండి!
లేకపోతే—‘ప్రధాని కావడానికి అన్ని లక్షణాలూ వున్నాయి’ అనే ముసలీ, ముతకా, మధ్య వయస్సు నాయకులూ, నాయకురాళ్ళ పుణ్యమా అని వీడు ప్రధాని అయితే (పాపము శమించుగాక)—మనలాంటి వాళ్ళ గతి—మహమ్మద్ బిన్ తుగ్లక్ పాలనలో ఢిల్లీ నించి దేవగిరికీ, దేవగిరి నించి ఢిల్లీ కి ప్రయాణాలు చేస్తూ, లక్షల్లో చచ్చిన వాళ్ళలా—పడుతుందేమో!
Thursday, October 30
చిన్న మాట.....
నా బ్లాగ్ చదివేవాళ్ళు కొంతమంది నేను ద్రవ్యోల్బణానికి, కాంగీరేసు గవర్నమెంట్ కీ లింకు పెడితే, ఇంకేదో అన్నారు!
ఒక సంగతి మరచి పోకండి! యూఎస్ బ్యాంకులు దివాలా తీయడానికి చాలా ముందే మన ద్రవ్యోల్బణం రెండంకెలని చేరుకుంది!
శ్రీ వై.వి.రెడ్డిగారు యేమీ చెయ్యనివ్వలేదని బాధపడ్డారు!(ట)
శ్రీ దువ్వూరివారు మొట్టమొదట తీసుకోవలసిన చర్యగా బ్యాంకుల సీఆరార్ పెంచుతే, మర్నాడే ఆయనచేత ఆయన పెంచిన 0.5 శాతమే కాకుండా ఇంకో 1 శాతం తగ్గించేలా చేశారు మన విత్త మంత్రి!
అదీ నేను వ్రాసింది! కాదంటారా?
ఇంక సబ్ ప్రైం గురించి నేను వాడిన "రీజనబుల్ అమౌంట్ (ఇన్ దెయిర్ వ్యూ)" అనే మాటల్ని 'దయా ధర్మంగా' అన్వయించుకున్నారు కొందరు!
ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకులు చెల్లించిన మొత్తాలు, వారి దృష్టిలొ 'రీజనబుల్ ' అని నా వుద్దేశ్యం! అది ఏ విధంగానూ వాటి అసలు విలువకి చాలా తక్కువేనని, దీంతో అవి డబ్బుచేసుకోవాలనే ఆ పని చేశాయని అర్థం! గమనించండి.
Tuesday, October 28
(ఇండియాకి మోక్షం లేదు)జబ్తక్ రహేగా లాలూ.......
నిన్న (27.10.2008) న్యూస్ క్లిప్పింగ్స్ లో రెచ్చిపోతున్న బీహార్ రైల్వేల మంత్రి లాలూ ప్రసాద్ ని చూశారా?
బీహారీ కుర్రాడు ‘బెస్ట్ ‘ బస్ లో తుపాకి తో వీరంగం వెయ్యడాన్ని ఖండించకపోగా, మహారాష్ట్ర గవర్నమెంటు మీద నిప్పులు చెరుగుతున్నాడు!
నిజానికి శ్రీ రాజ్ ఠాక్రే కొంచెం ఓవరాక్షన్ చేస్తున్నాడు గాని, అసలు నిప్పు లేకుండా పొగ రాదు కదా?
రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షలు జరుగుతున్న నగరాలకి బీహార్ నించి ప్రత్యేక రైళ్ళలో యువతని తరలించి మరీ పరీక్షలు రాయించి, వాళ్ళకే రైల్వే ఉద్యోగాలు కట్టబెడుతున్న సంగతి బహిరంగ రహస్యమేకదా!
అన్నట్టు, లాలూగారు రైల్వేలని లాభాల బాట పట్టించిన ‘మేనేజ్మెంట్ గురు ‘ ట!
అసలు రైల్వేలకి నష్టాలెప్పుడొచ్చాయట?
రైళ్ళలొ రిజర్వేషన్ సౌకర్యాలు పెరగడంతో, టిక్కెట్ కొని ప్రయాణించే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. ఓ ముప్ఫై నించి ఇరవై యేళ్ళ క్రితం, ఇటు వైజాగ్ దాటాక, అటు జబల్పూరు, బలార్షా, అటు నాగపురు ఏ వైపైనా టిక్కెట్లు కొనే వాళ్ళని పిచ్చివాళ్ళ క్రింద చూసేవాళ్ళు—టీటీఈలు. టిక్కెట్ లేనివాళ్ళని ఓ ఐదు రూపాయలు తీసుకొని, (అప్పట్లో 500/- క్రింద లెఖ్ఖ!) వాళ్ళు దిగే స్టేషన్లో గేటు దాకా సాగనంపి, అక్కడ టీటీఈకి (నాకేసు అని) సైగ చేసి, వాళ్ళు భద్రంగా గేటు దాటాకే మళ్ళీ రైలెక్కేవారు!
మరి లాభాలు రావూ?
ఇంకా డీజెల్ బదులు చవగ్గా విద్యుత్ తో నడుస్తున్నాయి రైళ్ళు. చెక్క స్లీపర్ల స్థానం లో హెచ్చు మన్నికగల సిమెంటు స్లీపర్లు వచ్చాయి. కంప్యూటర్లవల్ల కమ్యూనికేషన్లు బాగా వృద్ధి చెంది, సమయపాలన బాగా పెరిగింది. ఇన్ని, ఇంకాకొన్ని కారణాల వల్ల లాభాలు ఎక్కువ వస్తుంటే, లాలూ చేసిందేమిటట?
అయినా, మీడియావాళ్ళు ఈ ‘గురు’ల్ని అనవసరంగా సృష్టిస్తున్నారు! ‘ఫేషన్ గురు’, 'మార్కెటింగ్ గురు’, 'మేనేజ్ మెంట్ గురు’, ఇలాంటివే కాకుందా, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు’ట.
మహాకవి శ్రీ శ్రీ గురించి వెబ్ లో వెతికితే, లక్షా తొంభైఆరు సైట్లు ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురు పేరుతోనే వున్నాయి! యేమైనా, ఈ గురుకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ బాగా తెలుసు అని ఒప్పుకోవాలి!
Monday, October 27
(Copied straight from the blog)
chaitanya said...
Hi... ur interest in banking may have driven you to write such an interesting article on it...now can you explain me the recent crisis in financial market following the lehman break down.... may be da reason is not just subprime mortgages!!
September 22, 2008 10:46 PM
Krishna Sree said...
dear Chaitu!Thank u for ur comment.The prime reason is Sub-Prime Lending itself!Because--what is done in sub-prime lending is--the monies, distributed (lent) by the Banks, through retail lending, could not be recovered by them! So, the investment Banks stepped in and took over the retail loans from the Banks by paying them reasonable (in their view) amounts to the Banks. So, the Banks are safe--but the investment Banks could not realise the mortgages, specifically in case of House mortgage loans due to lack of buyers! Hence the crisis.Added to this, the investment Bankers have invested in futures/derivatives trading carelessly. When the Oil prices began to sky rocket, there is a crisis! So, such trading is a bane to the economy of any country. Who dares to ban such trading?In India also, as I understand, some Banks like ICICI Bank are resorting to sub-prime lending in another way--i.e. lending through other agencies. They are lending large monies to private agencies who in turn are distributing the money through lending to the needy, retailly. Thats why they are in the news!
October 7, 2008 9:23 PM
ఈనాడు పత్రికలో ఇవాళ (27.10.2008) బిజినెస్ పేజీ లో శ్రీ కాట్రగడ్డ కృష్ణ ప్రసాద్ అనే నిపుణుడు 'తెలివైన మదుపరి ఏం చేయాలంటే' అనే శీర్షిక క్రింద ఇచ్చిన ఇంటర్వ్యూ చదవండి!
సబ్ ప్రైం గురించీ, సీడీవోల గురించీ చక్కగా చెప్పారు!
ఇంకా చదవకపోతే, పూర్తిగా చదవండి!
'విదేశీ మదుపరులు...........నిధులను తీసుకు వెళ్ళిపోయినప్పుడు సిసలైన మార్కెట్ ప్రాణం పోసుకొంటుంది.' అన్న సమాధానం గమనించండి! (అంటే వాపు తగ్గుతుందనేగా?)
మొన్న శుక్రవారం సెన్సెక్స్ పడిపోగానే, నాకు తెలిసిన ఓ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచి మేనేజరు, మామూలు మాటల్లో, 'బాగా తగ్గాయి కదా షేర్లు, ఇప్పుడేవి కొంటే మంచిదంటారు?' అనడిగారు!
నా సమాధానం ఊహించగలరా? 'ఇప్పటివరకూ అందరూ చేతులే కాల్చుకున్నారు! ఇప్పుడు మార్కెట్లో దిగితే, ఒళ్ళూ ఇల్లూ కూడా కాల్చుకుంటారు! అప్పుడే దానిజోలికి వెళ్ళకండి!' అని.
తప్పంటారా? చూద్దాం!
Sunday, October 26
ద్రవ్యోల్బణం
స్థూలంగా చెప్పాలంటే, ద్రవ్యోల్బణం వ్యవస్థలో డబ్బు చలామణి ఎక్కువయితే వస్తుంది.
ఉదాహరణకి---ప్రజల ఆదాయాలు బాగా పెరగడం, లేదా ఖర్చులు తగ్గడం, బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్థలు సరళంగా అప్పులివ్వడం, రిజర్వు బ్యాంకు / ప్రభుత్వం ఎక్కువ నోట్లని ప్రింటుచేయడం----ఇలాంటివి!
మరి మొదటిది ఎప్పుడు సాధ్యం?
1. రైతుకి గిట్టుబాటు ధర దొరుకుతోంది.
2. ఉద్యోగులకి జీతాలు బాగా ముడుతున్నాయి.
3. వర్తకులకి బాగా లాభాలు వస్తున్నాయి.
4. అందరూ కడుపు నిండా తినగా, ఇంకా ఎంతో కొంత డబ్బు మిగలడం.
5. ఫ్రజలందరూ ఏదో ఒక ఉపాధి ద్వారా సంపాదించగలగడం.
ఇంకా ఇలాంటివే---మీకు తోచేవి.
ధరలు తగ్గడం అంటే, ‘ద్రవ్య అనుల్బణం’ (ద్రవ్యోల్బణానికి వ్యతిరేకం)! అంటే, ఓపెన్ మార్కెట్ లో కిలో బియ్యం రూపాయకి దొరకడం లాంటివి!
మరి పైన అనుకొన్న పరిస్థితులేమున్నాయని ద్రవ్యోల్బణం విజృంభిస్తోంది?
"కష్టపడి (లేదా ఇంకేదో చేసి) కొంత డబ్బంటూ సంపాదిస్తే, తరవాత అదే పిల్లల్ని పెడుతుంది" అనే సిద్ధాంతం బాగా ప్రాచుర్యం పొందడంవల్ల!
అంటే, దేశంలో సంపదంతా ఓ 10 శాతం మంది చేతుల్లోనే వుంది అంటారు. పోనీ, నేను ఓ 20 శాతం మంది అంటాను.
సరే, మరో 30 శాతం మంది ఎగువ మధ్య తరగతికి చెందుతారనుకుందాం. వీరిలో, గత 30 యేళ్ళుగా ఉద్యోగ, వృత్తి, వ్యాపారాల్లొ ఎంతొ కొంత వెనకేసుకుని, తమ తరం, తమ పిల్లల తరం సౌకర్యంగా జీవించడానికి ఢోకా లేదు అని నిశ్చింతగా ఉండేవాళ్ళు.
ఇంకో 20 శాతం మంది దిగువ మధ్య తరగతికి చెందుతారు! వీరిలో, చిన్న ఉద్యోగులు, చిన్న రైతులు, కౌలుదార్లు, ఇతర వృత్తులవాళ్ళు, (ఖర్చుకి సరిపడా అదాయం దాదాపు సంపాదించగలిగినవాళ్ళు--నెలాఖర్లో అప్పులు చేసైనా)
ఈ రెండు మధ్యతరగతుల్నే బూర్జువాలు, పెటీ బూర్జువాలు అంటారు కమ్యూనిష్టులు.
ఇక మరో 20-25 శాతం ఱెక్కడితేగాని డొక్కాడని వాళ్ళు. దినసరి కూలీలు, రైతు కూలీలు, చేతి వృత్తుల పనివాళ్ళు, హాకర్లు మొదలైనవాళ్ళు.
మిగిలిన 5-10 శాతం 'పతితులూ, భ్రష్టులూ, బధాసర్పదష్టులూ!' వీరు జనాభా లెక్కల్లో వున్నారన్న సంగతి వాళ్ళతోపాటు అందరూ మరచిపోతూ వుంటారు--ఎలక్షన్లకి కొంతకాలం ముందు వీళ్ళని గుర్తు చేసుకొని మొక్కేవాళ్ళు తప్ప!
పై అన్ని వర్గాల్లోనూ, 50 శాతం స్త్రీలు! ఈమాట మాత్రం మరువకండి!
ద్రవ్యోల్బణంలోకి తరవాత ప్రవేశిద్దాం!
Friday, October 24
చెప్పానా, సంతొషించే వాళ్ళలో మొదటివాడిని నేను అని! (సెన్సెక్స్ పడిపోతే). ఇవాళ్టి ఫిగరు 8701!"8701"---ఇంకో 702 చాలు!
ఏదో పద్యం చెప్పావే------అంటున్నారా! వస్తున్నానక్కడకే!
ఓ పీనాసి, తన దగ్గరున్న బంగారాన్నంతా పద్యంలో చెప్పినట్టు ఓ గోతిలో పాతిపెట్టి, రోజుకోసారి వచ్చి చూసుకుంటుండేవాడట! తరవాత విషయం అందరికీ తెలుసు కదా?
కానీ ఈ కేసులో, బంగారం పిల్లల్ని పెట్టదు కదా?
ఇప్పుడు మోడర్న్ పీనాసులు--వాళ్ళ దగ్గరున్న కొద్దో గొప్పో డబ్బుని (కొంతమంది అప్పులు చేసి కూడా!) షేర్లలో పెట్టి, రోజూ సెన్సెక్స్ చూసుకొని, నా 'ఆస్తి ' ఇంత పెరిగింది....అంత పెరిగింది....అని ఆనందిస్తూ వుంటారు!
బిల్ గేట్స్, వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు తమ చెమటోడ్చి సంపాదించిన కాస్తో కూస్తొ డబ్బుతో ఓ కంపెనీ స్థాపించి, అది ఇంతింతై, వటుడింతై పెరుగుతుంటే, ఆనందిస్తూ, ఇంకా ఎక్కువ పెట్టుబడి అవసరమైతే, వాళ్ళ దగ్గర డబ్బు సరిపోక, కంపెనీలో కొంత షేర్ కేపిటల్ పబ్లిక్ ఆఫర్ చేస్తారు! ఆ షేర్లు లిస్టింగ్ అయ్యాక, వాటి విలువ పెరుగుతుంది (మార్కెట్ మాయాజాలం వల్ల--తగ్గినా తగ్గచ్చు!) కానీ, అసలు కంపెనీ పెట్టిన వాళ్ళు కొంత శాతం షేర్లు తమ దగ్గరే వుంచుకున్నారు కదా? వారి సంపద ఇబ్బడి ముబ్బడిగా పెరిగినట్లు! (ఫోర్బ్స్ మేగజైన్ లాంటివి ప్రపంచంలో అత్యంత ధనికుడు అని ప్రకటిస్తూ వుంటాయి) కానీ, గోతిలో బంగారానికీ, వీటికీ తేడా యేమి వుంది? ఆ షేర్లు అప్పుడు అమ్మితే కదా--అంత డబ్బు వచ్చేది? అదీ సంగతి!
మరి చిదంబరానికీ నాకూ ఏ కంపెనీలున్నాయని సెన్సెక్స్ పెరిగితే అంత ఆనందం?
వాపుని బలుపుగా చూస్తూ, దేశ ఆర్ధిక వృద్ధి అంతా సెన్సెక్స్ మీదే ఆధారపడింది అనే విత్త మంత్రిని ఏమనాలి? అంత మేధావి అయిన మన ప్రధాని చెయ్యగలిగింది మాత్రం యేముంది? వేరే వుద్దేశ్యాలున్న వాళ్ళది కంట్రోల్!
నేను ముందే చెప్పినట్లు ఈ కాంగీరేసు పరిపాలనలోనే ఎందుకు వస్తున్నాయి.....ఈ దరిద్రాలన్నీ? జనతా పాలనలో, ఎన్.డి.ఏ. పాలనలో, వృద్ధి జరగలేదా? ద్రవ్యోల్బణం అదుపులో లేదా?
ఆలోచించండి!
బై ది బై, శ్రీ శ్రీ శత జయంతి సభల్లో కొన్ని చోట్ల, కొంత మంది ఆయన చెప్పిన కవితలూ, ఆయన ఆలోచనలూ ఇంకా, ఇప్పుడుకూడా వర్తిస్తాయా? అన్నారట! మీ అభిప్రాయం?
మరొకసారి వ్రాస్తా!
Friday, October 17
"సెన్సె(షనల్)క్స్"
మళ్ళీ ఇవాళ (17-10-2008) కొన్ని వందల పాయింట్లు పడిపోయి, పదివేల దిగువకు వచ్చేసిందండోయ్ సెన్సెక్స్!
విత్తమంత్రిగారు ఇంకా ఏమీ అనలేదు! (వెవ్వెవ్వె!)
నీకంత ఆనందం యేమిటంటారా? చెప్పానుగా, కొన్నేళ్ళ క్రితం నవంబర్లోనో, డిసెంబర్లోనో సెన్సెక్స్ 8000 పాయింట్లు దాటగానే, 'వచ్చే మార్చి నెలాఖర్లోగా 16000 పాయింట్లు దాటి పోవచ్చు ' అని అత్యుత్సాహం ఒలకబోశారుగా విత్త మంత్రి గారు! 'దాని భావమేమి తిరుమలేశా' అని అప్పుడే ఆలోచించాను........ఓపెన్ గా మా కొలీగ్స్ తో చర్చించాను!
ఆ రోజు నించీ, ఈరోజు వరకూ, సెన్సెక్స్ 8000 పాయింట్లకి పడిపోతే సంతొషించే వాళ్ళలో మొదటివాడిని నేను! ఆ అనందం నాకు దక్కుతుంది చూస్తూ వుండండి!
అంటే, నీకిష్టంలేదు కాబట్టి, 'ఇన్వెస్టర్లు ' అనే ప్రజలు నష్టపోవాలా? అని అంటారా! అక్కడికే వస్తున్నాను!
ఎలిమెంట్రీ స్కూల్లోనే, తెలుగువాచకంలో ఓ పద్య పాఠం వుండేది........"ఊరి వెలుపల పాడు కోనేటి చెంత..........." ఎట్సెట్రా! మీలో చాలా మందికి గుర్తొచ్చి ఉండొచ్చు ఈపాటికే! '
'అయితేమాత్రం..........' అంటున్నారా?
వస్తా! నక్కడికే వస్తా!
Thursday, October 16
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం అనే సందట్లో
సడేమియా!
నిన్నటి పేపర్లో, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ని ఆదుకోడానికి, 'కేంద్రం' సూచనపై, అర్ బీఐ ఓ 20,000 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది--అని వార్త! ఆర్థిక వ్యవస్థ లోకి బ్యాంకుల ద్వారా విడుదలైన 65,000 కోట్లు కాకుండా ఇది అధికం అన్నమాట.
నిన్న, స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ మళ్ళీ ఓ 674 పాయింట్లు పడిపోయేసరికి, ఇవాళ (16-10-2008) పేపర్లో--సీఆరార్ 6.5 శాతానికి తగ్గించి, మరో 40,000 కోట్లు బ్యాంకులకి విడుదల చేయడమే కాకుండా, ఋణ మాఫీ ఖాతాలొ, మరో 25,000 కోట్లు వెరశి 1,45,000 కోట్లు ఆర్థిక వ్యవస్థ లోకి విడుదలైనట్లు! ఈనిర్ణయాలతో, గౌ. దువ్వూరి సుబ్బారావు గార్ని ఢిల్లీకి, ముంబాయికి మధ్య పరుగులు పెట్టిస్తున్నారు! మరి ద్రవ్యోల్బణం మాటో? దేవుడెరుగు!
మొన్న, లిక్విడిటీ అడ్జస్ట్ మెంట్ ఫెసిలిటీ-- క్రింద 14 రోజులకి 9% వార్షిక వడ్డీ కి వేలంపాట నిర్వహిస్తే, కేవలం 4 బిడ్లు, 3,500 కోట్లకి మాత్రమే దాఖలయ్యాయట! అంటే ద్రవ్య లభ్యత లో లోపం లేదు అన్నమాటే కదా?
మరి సమస్య ఎక్కడ?
ఎక్కువ ద్రవ్య నిల్వలున్న సంస్థలు, ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకుల వద్ద కొన్ని (పదుల/వందల) కోట్లు ఇచ్చి, 'సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్' (సీ డీ లు) తీసుకుంటాయి! (బ్యాంకులు, వాటి అవసరాలనిబట్టి, అధిక వడ్డీ ఆఫర్ చేస్తాయి!). ఏ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇస్తానంటే, ఆ బ్యాంకులో డిపాజిట్ చేస్తారన్నమాట! ఈ ఫండ్లకి వద్దంటే డబ్బు! ప్రజలదగ్గర ఎక్కువ డబ్బుండటంతొ, మ్యూచువల్ ఫండ్స్ లో, ఇన్సూరెన్స్ స్కీముల క్రింద దబ్బు వచ్చి పడిపోతోంది!
బ్యాంకుల సీ ఆర్ ఆర్ పెరిగినప్పుడు, ఇవి వాటితో, ఓ ఆట ఆడుకుంటాయి! మేమెక్కువ ఇస్తామంటే మేమెక్కువ ఇస్తాం అంటూ బ్యాంకులు వాటి వెంట పడతాయి!
మరి ఎక్కడ వచ్చింది సమస్య? అంటే, ఈ సీ డీ లు 14 రోజులకి జారీ చెయ్యబడతాయి! మధ్యలో కేన్సిలు చెయ్యడం కుదరదు! వాటి మీద అప్పు తీసుకునే సౌకర్యం కూడా లేదు!
కొంచెం వెలుగుతోందా!
ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ పతనం అవుతోందో, ఈక్విటీ ఫండ్స్ నించి కొన్ని కోట్ల మంది తొలగిపోదామని చూస్తారు! వారందరికీ డబ్బివ్వడానికి ఫండ్స్ ఎక్కడనించి తెస్తాయి? వాళ్ళ నిధులన్నీ సీ డీ ల్లొ బ్లాక్ అయి వున్నాయి! రెండోరోజున కొన్ని కోట్లు ఇవ్వాలి జనానికి--14 రోజుల దాకా సీడీ దబ్బులు రావు! మరి మ్యూచువల్ ఫండ్స్ చేతులెత్తెయ్యవూ?
అదీ సంగతి! పెళ్ళయితేగాని పిచ్చి కుదరదు! పిచ్చి కుదిరితేగాని పెళ్ళవదు!
సడేమియా గురించి వేరే చెప్పక్కర్లేదు! (చిదంబరంగారికి మొన్ననే ప్రశ్న సంధించాం గదా!)
సామాన్యుడి పాట్లు X ద్రవ్యోల్బణం గురించి తరవాత.......
Tuesday, October 14
"చిదంబర రహస్యం" ఏమిటి?
ఓ రెండు సంవత్సరాల క్రితం అనుకొంటా! బిఎస్ ఈ సెన్సెక్స్ 8000 పాయింట్లకి చేరుకోగానే, 'వచ్చే మార్చి లోపల సెన్సెక్స్ 16000 పాయింట్లు దాటుతుంది!' అని సెలవిచ్చారు అమాత్యులు!
గౌ. శ్రీ వై. వేణు గోపాల రెడ్డి గార్ని రిజర్వు బ్యాంకు గవర్నరుగా వుండగా, ఇన్ ఫ్లేషన్ కి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా చేతులు కట్టేశారని స్వయంగా ఆయనే ఒక అంతర్జాతీయ వేదిక మీద వాపోయారు!
ఇప్పుడు, సీఆరార్ ని 3, 4 రోజుల వ్యవధిలో, ఏకంగా 0.5 + 1.5 అంటే 2% తగ్గించారు! గౌ. దువ్వూరి సుబ్బారావు గార్ని మాట్లాడనివ్వకుండా!
పైగా 'హామీ' ఇస్తున్నారు! మన ఆర్ఠిక వ్యవస్థ పటిష్టంగా వుంది! అని.
దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకి విడుదల అయి పోతాయిట! ఎందుకంటే, స్టాక్ మార్కెట్ నిలదొక్కుకోవటానికట! అంటే, మళ్ళీ హర్షద్ మెహతాలూ, కేతన్ పరేఖ్ లూ మొ.వారు విజృంభించినా ఫరవాలేదు! బ్యంకులు వాళ్ళకి 60,000 కోట్లు అప్పులు ఇచ్చెయ్యవచ్చు! కాని స్టాక్ మర్కెట్ మాత్రం పడిపోకూడదు!
మరి చిదంబర రహస్యం ఏమిటి? (తమకెన్ని కోట్లున్నాయి? మార్కెట్లో? అని అడిగితే తప్పా!)
చెప్పు మిష్టర్ చిదంబరం!
Sunday, October 12
Tuesday, October 7
Tuesday, April 29
Some things a majority of people do not know
'Anyway, what do you think you know about animals and things? I've lived with snakes and things since I was a child. Alone. Have you ever seen a praying mantis eat her husband after they've made love? Have you ever seen the mongoose dance? Or an octopus dance? How long is a humming bird's tongue? Have you ever had a pet snake that wore a bell round its neck and rang it to wake you? Have you seen a scorpion get sunstroke and kill itself with its own sting? Have you seen the carpet of flowers under the sea at night? Do you know that a John Crow can smell a dead lizard a mile away...?' The girl had fired these questions like a scornful jabs with a rapier.
Dreams about future
'It was the encyclopedia. It told me that people collect seashells. That one could sell the rare ones. I talked to the local schoolmaster, without telling him my secret of course, and he found out that there's an American magazine called Nautilus for shell collectors. I had just enough money to subscribe to it and I began looking for shells that people said they wanted in the advertisements. I wrote to a dealer in Miami and he started buying from me. It was thrilling. Of course I made some awful mistakes to begin with. I thought people would like the prettiest shells, but they don't. Very often they want the ugliest. And then when I found rare ones I cleaned them and polished them to make them look better. That's wrong too. They want shells just as they come out of the sea, with the animal in and all. So I got some formalin from the doctor and put it into the live shells to stop them smelling and sent them off to this man in Miami. I only got it right about a year ago and I've already made fifteen pounds. I'd worked out that now I knew how they wanted them, and if I was lucky, I ought to make at least fifty pounds a year. Then in ten years I would be able to go to America and have the operation. And then,' she giggled delightedly, 'I had a terrific stroke of luck. I went over to Crab Key. I'd been there before, but this was just before Christmas, and I found these purple shells. They didn't look very exciting, but I sent one or two to Miami and the man wrote back at once and said he could take as many as I could get at five dollars each for the whole ones. He said that I must keep the place where they live a dead secret as otherwise we'd what he called "spoil the market" and the prices would get cheaper. It's just like having one's private gold mine. Now I may be able to save up the money in five ears. That's why I was so suspicious of you when I found you on my beach. I thought you'd come to steal my shells.'
About Dr. No
'One million dollars.'
It was a cavernous, echoing voice, with a trace of American accent.
Bond turned slowly, almost reluctantly, away from the window.
Dr. No had come through a door behind his desk. He stood looking at them benignly, with a thin smile on his lips.
'I expect you were wondering about the cost. My guests usually think about the material side after about fifteen minutes. Were you?.
'I was.'
Still smiling (Bond was to get used to that thin smile), Doctor No came slowly out from behind the desk and moved towards them. He seemed to glide rather than take steps. His knees did not dent the matt, gunmetal sheen of his kimono and no shoes showed below the sweeping hem.
Bond's first impression was of thinness and erectness and height. Doctor No was at least six inches taller than Bond, but the straight immovable poise of his body made him seem still taller. The head also was elongated and tapered from a round, completely bald skull down to a sharp chin so that the impression was of a reversed raindrop--or rather oildrop, for the skin was of a deep almost translucent yellow.
It was impossible to tell Doctor No's age: as far as Bond could see, there were no lines on his face. It was odd to see a forehead as smooth as the top of the polished skull. Even the cavernous indrawn cheeks below the prominent cheekbones looked as smooth as fine ivory. There was something Dali-esque about the eyebrows, which were fine and black and sharply upswept as if they had been painted on as make-up for a conjurer. Below them, slanting jet black eyes stared out of the skull. They were without eyelashes. They looked like the mouths of two small revolvers, direct and unblinking and totally devoid of expression. The thin fine nose ended very close above a wide compressed wound of a mouth which, despite its almost permanent sketch of a smile, showed only cruelty and authority. The chin was indrawn towards the neck. Later Bond was to notice that it rarely moved more than slightly away from centre, giving the impression that the head and the vertebra were in one piece.
The bizarre, gliding figure looked like a giant venomous worm wrapped in grey tin-foil, and Bond would not have been surprised to see the rest of it trailing slimly along the carpet behind.
----These are the exerpts from the famous James Bond Novel "Dr. No", written by Ian Fleming which was first published by Jonathan Cape Ltd. in Great Britain in the year 1957. Later it was published by many other publishers in many countries. Now the Penguin Books has published the same again as a part of the total collection of Bond Series (all books) by Ian Fleming. These are brought to you only to share the fine pieces of literature which I have enjoyed many a time reading and hope you will also feel the same way.
Sunday, March 16
నా బ్లాగు చదువరులకి మనవి-నాకు ఓపిక, సమయం వున్నప్పుడు కొంచెం కొంచెంగా రాస్తున్నాను. దయచేసి కంటిన్యూగా చదువుతూ వుండండి.--క్రిష్ణశ్రీ
(అమ్మన)మంచి"ముత్యాలు"
సంగతేమిటంటే--మనకి స్వతంత్రం వచ్చిన ఓ 3 నెలల్లొపు మన భారద్దేశంలొ పరిస్థితులెలా వున్నయో, వాటిని నేటి పరిస్ఠితులతో పోల్చి చూడాలంటే వీలవుతుందా?--అంటే-- అవుతుంది! యెలాగంటారా? అప్పటి పత్రికలు అప్పటి పరిస్థితుల్ని ప్రతిబింబిస్తాయి కదా? మరి వాటిని ఇప్పుడు చదువుతే, ఇప్పటి పరిస్థితుల్తో పొల్చి చూడడం తేలికే కదా? మరి ఇంకెందుకాలస్యం? చదవండి! మీరు చదివాక, అదెప్పటిదో, యెక్కడిదో--చెపుతాను--సరేనా? ఇక చదవండి!
ఇది 7 నవంబర్ 1947 న వెలువడిన "ఆంధ్ర జ్యోతి" సచిత్ర మాస పత్రిక 'దీపావళి ప్రత్యేక సంచిక ' లో 'కలకత్తా డైరీ ' అనే శీర్షికతో 'రావు ' అనే రచయిత వ్రాసిన వ్యాసం.
మరి అప్పటికీ, ఇప్పటికీ యేమైనా మార్పు వచ్చిందా? విజ్ఞులైన పాఠకులకే
వదుల్తున్నాను.
"గాంధీ మహాత్ముని ధర్మమా అని సెప్టెంబర్ నెల నుండి నగరం ప్రశాంతంగా ఉంది. జంకూ, భీతి లేకుండా ప్రజలు బాహాటంగా రాత్రింబగళ్ళూ తిరుగుతున్నారు. బస్సులూ, ట్రాములూ, టాక్సీలు యధా ప్రకారంగా నడుస్తున్నాయి. మైదానం మీద బంతి ఆటలూ, టాలీగంజిలో గుఱ్ఱపు పందెములూ యధావిధిగా సాగుతున్నయి. దుర్గపూజా కోలాహలంతో పట్టణమంతా కలకలలాడుతోంది. యిదివరకెన్నడూ జరగనట్టి మహావైభవంతో యీ పండుగ యీ సంవత్సరము జరగబోతోంది. గవర్నమెంటు భవనం తాలూకు హిందువులుకూడ అక్కడ పూజ జరుపుతున్నారు. ఆ ప్రదేశంలో 'పూజ 'జరగడం యిదే ప్రప్రధమం. యిప్పుడు నగరం చూచిన క్రొత్త మనిషికి 'యిక్కడ నిజంగా ఒక సంవత్సరముపాటు యెడతెరిపి లేకుండా మత కలహాలు జరిగినవా?' అన్న సందేహం కలగకపోదు.
బజారులన్నీ 'పూజా ' సరుకులతో నిండి పోయినాయి. యిదివరకు హారిసన్ రోడ్డు నిర్మానుష్యంగా, వెలవెలబోతూ ఉండేది. యిప్పుడు యిసుక వేస్తే రాలకుండా వచ్చే జనానికి వస్తువులు సరఫరా చేస్తొంది. ధర్మ్ తలా, కాలేజీస్ట్రీటూ, బిగ్ బజారు, భవానీ పూరు చెప్పుకోతగ్గవి. చక్కెర రేషన్ బెంగాలు మిఠాయి సరుకును ఏ విధంగానూ తగ్గించలేదు. క్రొత్తగా 'జై హింద్ ' సందేష్ అని మన కాంగ్రెస్ జండా రంగులతోటి బయలుదేరింది. దినుసుల ధరలు యెన్నో రెట్లు పెరిగినప్పటికీ ఆర్ధిక శాస్త్రజ్ఞులు తప్ప అవి కొనకుండా వెనుకంజ వేసే మానవుడు మచ్చుకైనా కనపడలేదు. దుర్గ పూజా మహోత్సవానికి డబ్బు విరజిమ్ముతున్నారు. మామూలుకంటే యెక్కువ పట్టుదలతోటి, ఉత్సాహంతోటి కార్యసన్నాహం చేస్తున్నారు.
పులిమీద పుట్ర అన్నట్టు దుర్గపూజ, యీద్ రెండూకూడ యీ సంవత్సరము వొక్క వారములోనే తటస్థమైనాయి. పంజాబు, ఢిల్లీ అల్లర్ల ఫలితంగా యిక్కడ యేమీ సంచలన కలుగలేదు. కాని యేవిధమైన సంఘర్షణలు రాకుండా తగిన యేర్పాట్లు చేయబడుతున్నాయి. శాంతిసేనలు నగరంలో పర్యటనలు చేస్తూ హిందూ ముస్లిము ఐక్యతను చాటుతున్నయి. విరివిగా ముస్లిము నేషనల్ గార్డ్సు కలిసి పనిచేస్తున్నారు. పత్రికా సంపాదకులు, హిందూముస్లిము ప్రఖ్యాత రచయితలు, కళోపాసకులు మోటార్లమీద వీధి వీధీ తిరుగుతున్నారు. రెండు మతములవారు కలిసి సభ చేసి యీ రెండు పండుగలను జయప్రదంగా జరిపించ పూనుకున్నారు. యిందు విషయమై క్వాజా నాజీముద్దీను, డాక్టరు ఘోష్, తదితర నాయకులతోటి సంప్రదించేరు. పూర్వపాకిస్థానులో కూడా మంత్రులూ, శాసనసభ్యులూ చాల కృషిచేస్తున్నారు. పేపర్లలోకూడ చాలమార్పు కలిగింది. ఒకర్నొకరు తిట్టిపోసుకొవడం కట్టిపెట్టి శాంతి స్థాపనకు పాటుపడుతున్నాయి. ఈ రెండు పండుగలూ ఏ అల్లర్లు లేకుండా శాంతంగా జరిగిపోతయి.
మతకలహాలు రూపుమాసినప్పటికీ, పట్టణంలో దుండగీడు తనము రెచ్చిపోతోంది. స్టెన్ తుపాకులు, పిస్తోళ్ళు, బాకులు ఉపయోగించి యిళ్ళలోను, దుకాణాలలోనూ పట్టపగలు జొరబడి దోచుకుంటున్నారు. ఈమధ్య చాలమంది దోపిడి దొంగలను పట్టుకున్నారు. వీరు పెద్ద కుటుంబాలకుచెంది, చదువుకున్న యువకులు కాని పామరులు కారు. అక్కడక్కడ వీళ్ళు హత్యలకుకూడ వెనుదీయ లేదు.
ఆహారపు పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. ఆ మధ్య బియ్యపు కొలత కూద తగ్గించడం జరిగింది. వారం వారమూ బియ్యపురకం మారుతోంది. పూర్వపాకిస్థానులో మరీకష్టంగా ఉన్నదట కాని, సెప్టెంబరు నెలనుండి దొంగ వర్తకులమీద విరామంలేకుండా పోలీసులు దాడిచేస్తున్నారు. డాక్టరు ఘోషుగారు ఈ విషయంలో శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారు. ఏ విధమైన ఆచోకీ తెలిసినప్పటికీ తానే స్వయంగా పోలీసులను తీసుకువెళ్ళి దాడి జరుపుతున్నారు. ధనవంతులైన యీ బ్లాక్ మర్కెటీయర్సుకు ఘోష్ పేరు సిం హస్వప్నం. గోధుమపిండిలో సుద్దరాతిపొడిని కలుపుతున్నారని తెలిసి ఆమిల్లు యజమానులైన మార్వాడీలను పట్టుకున్నారు. యిలాగే చింతగింజలపొడిని కలిపేవాళ్ళను అరెస్టు చేసేరు. యిన్నివేల ప్రాణాల్తో చెలగాటమాడే యీ ఆహారపు దొంగలకు జాలి చూపకూడదని ప్రజానీకం వొత్తిడి చేస్తున్నారు. ప్రధాని చర్యను శ్లాఘిస్తున్నారు. కొద్దిరోజులలో ఆహారసమస్య పరిష్కారం కాగలదన్న ధైర్యం కలుగుతోంది. యీపట్టణంలో 10,00,000 దొంగ రేషను కార్డులు పట్టుబడ్డాయి. ఒక్క యింట్లో 400 గుడ్డల కార్డులు దొరికేయి.
-------------------------------------------------------------------------------------------------(అప్పటిలో రాష్ట్ర ముఖ్య మంత్రిని 'ప్రధాని ' 'ప్రధానమంత్రి ' అనేవారుట. దాక్టరు ఘోష్ అప్పటి పశ్చిమ బెంగాలు ముఖ్యమంత్రి అని తెలుస్తోందిగా. యింకా ఆరోజుల్లో, రేషను కార్డులతోపాటు బట్టలకి కూడా కార్డులు వుండేవని, వాటికి దొంగ కార్డులు తయారుచేసేవారనీ తెలుస్తోందిగా. యిలాంటి పరిస్థితుల్లోనే దేశ ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ 'బ్లాక్ మార్కెటీర్లని దగ్గర్లోవున్న లాంతరు స్థంభానికి వురితీయాలి ' అని వుంటారు!--క్రిష్ణశ్రీ
-------------------------------------------------------------------------------------------------
(ఈ పేజీల్లోని ఒక కార్టూన్)
(బొమ్మలో ఒక జడ్జి, ముద్దాయి, లాయరు వున్నారు)
జడ్జి: "నిన్ను ఖడ్గమృగమని తిట్టితే మాత్రం ఐదేళ్ళు గడిచినాకనా ఫిర్యాదు చెయ్యడం?"
(జవాబు) "నాకప్పుడు ఖడ్గమృగమంటే ఏమిటో తెలియదు సార్. నిన్ననేను జూలో చూశాను."
---------------------------------------------------------------
21వ తేదీ ఆజాద్ హిందు నేషనల్ గవర్నమెంటుయొక్క నాల్గవ వార్షికోత్సవం శ్రీ శరత్ బోసుగారి అధ్యక్షతను చాల వైభవంగా జరిగింది. బ్రహ్మాండమైన ఉత్సవాలు ఉత్తర, దక్షిణ కలకత్తాలనుండి బయలుదేరి మైదానమ్మీద కూడినవి. సోషలిస్టు రిపబ్లిక్సు యేర్పాటు చేయాలని బోసుగారు చెప్పేరు. యిందులో అన్ని పార్టీలవాళ్ళు ముఖ్యంగా ముస్లిం నేషనల్ గార్డు కలిసేరు. యీరోజుననే బోసుగరి పార్టీ తాలుకు కొత్త పత్రిక "సోషలిస్ట్ రిపబ్లిక్" (ఈపేరు ఇంగ్లీషు లో ప్రింటు చేయబడింది) కూడ వెలువడింది.
రాజాజీ బెంగాలును జయించేడని చెప్పక తప్పదు. మొదట్లో అతడిని యీరాష్త్ర గవర్నరుగా నియమించేరని తెలిసి, అందుకు వ్యతిరేకాన్ని సూచిస్తూ సభలు జరిపేరు శ్రీ శరత్ బోసు పార్టీవారు. ట్రాములమీద, బస్సులవెనుక 'గో బాక్ రాజగోపాలాచారి ' (ఇది కూడా ఇంగ్లీషు లోనే ప్రింటు చెయ్యబడింది) అని కాగితాలు అంటించేరు. 'వంగదేశవిరోధి ' అన్నారు. విమానాశ్రయం వద్ద ఆయనకు వొకటో, రెండో నల్లజండాలు చూపించేరు. అంతే! ఆగస్టు 15వ తేదీన గవర్నరుగారి యింటిగేట్లు--పాపం! పోలీసులు నిస్సహాయులై చూస్తుండగా--తోసుకొని జనం తండోప తండాలుగా భవనాన్ని ముట్టడించేరు. "రాజాజీకీ జై! జైహింద్" కేకలతో ఆకాశం చిల్లులు పడింది. బాల్కనీ లోకి రాజాజీ వచ్చేవరకు జనాన్ని ఆపలేక పోయేరు. లోపలకు జొరబడి విచ్చలవిడిగా వ్యవహరించేరు. ఒక కూలివాడు మాసినగావంచాతో, అలిసిపోయి గవర్నరుగారి దర్బారుగదిలో ఒక సోఫాలో "జై హింద్!" అని మఠం వేసుకుని కూర్చుని "హిందూస్థాన్ హమారా హోగియా" అన్నాడు. ఆదృశ్యం చూడవలసిందే. గవర్నమెంటు భవనం మలినం కాబడినప్పటికీ, యిన్నాళ్ళకు మన బానిస శృంఖలాలు తెగినవి కదా అనిపించింది! బరోస్, వీడ్కోలు యివ్వడానికొచ్చిన ఘరానా మనుష్యులు దిక్కుతోచక, యీ రాపిడికి ఆగలేక తిరుగుమొహం పట్టేరు. ఇంక బరోస్ సంగతి. బాడీగార్డు యెంతగా అతణ్ణి చుట్టు ముట్టి కాచినప్పటికి జనసమూహంలోనుండి యెవరో ఒక గాంధీటోపీ అతనికి అందిచ్చేడు. అది మారుమాటాడకుండా ధరించేడు. ఒక కాంగ్రెసు జెండా మరొకరు ఇచ్చేడు. అది చేతబుచ్చుకుని ముమ్మారు "జై హింద్" అని మాజీ గవర్నరు అన్నాడు. పిమ్మట అతికష్టం మీద కారులో అతణ్ణి కూర్చోపెట్టి సాగనంపేరు. యీమాదిరిగా స్వాతంత్ర్యదినము మరెక్కడకూడ జరగలేదని చెప్పవచ్చును.
గవర్నరు రాజాజీ పద్ధతేవేరు, గేట్లు సాధారణంగా తెరవబడే ఉంటున్నాయి. కే.సి.డే, పంకజమల్లిక్ మొదలైనవారి పాటకచ్చేరీలు భవనంలో జరుగుతున్నాయి. గాంధీజీ జన్మదినమునాటి బహిరంగసభలో రాజాజీ తన అమోఘమైన ఉపన్యాసంతో ప్రజలను మెప్పించేడు. హాస్యరసం వొలికిస్తూ, పిట్టకథలు చెబుతూ, వాక్చాతుర్యంవల్ల జనాన్ని బంధించేసేడు. అతనిపట్ల గౌరవాభిమానాలు యినుమడించేయి. బహుశా కొన్నాళ్ళకు మన సి.ఆర్. శ్రీ రాజేంద్ర చక్రవర్తి అగునేమోకూడా!
కలకత్తా కార్పొరేషను వ్యవహారాలు లోకవిదితమే. యిటువంటి అశుభ్రమైన నగరం మరెక్కడలేదని పాశ్చాత్యులుకూడ వొప్పుకోక తప్పిందికాదు. ముక్కుమూసుకోకుండా ఏవీధి అయినా తిరగగల శక్తి ఉంటే ఋషి పుంగవుడన్నమాటే! అహమద్ అబ్దుల్లా (ఇంగ్లీషు లో ప్రింటు చెయ్యబడింది) (ఒక పాశ్చాత్యరచయిత) కలకత్తాను సిటీ ఆఫ్ 69 స్మెల్స్ (ఇంగ్లీషులో ప్రింటు చెయ్యబడింది) అన్నాడు. అతను చూచినప్పటికంటే యిప్పుడు సంఖ్య పెరిగింది. ఈ కార్పొరేషనులో లంచగొండితనమూ, బద్ధకమూ, అరాచకమూ, నాటుకుపోయి ఉన్నాయి. నగరాన్ని బాగుచేద్దామన్న ఉద్దేశ్యంతో పీఠమెక్కిన మేయరు సుధీర్ రాయ్ చౌదరీకి ప్రాణం విసిగి పదవికి రాజీనామా ఇచ్చేడు. గవర్నమెంటుచేత ఎంక్వైరీ (ఇంగ్లీషులొ 'ఎంక్యురీ' అని ముద్రా రాక్షసం) చెయ్యమన్నాడని కార్పొరేషను మెంబర్లు రుసరుసలాడుతున్నారు.
-----------------------------------------------------------------------------------
ఈ పేజీల్లోని కార్టూన్
ఒక నాగరిక అమ్మాయికి ఒక కూలీ లాంటి మనిషి రుమాలు అందిస్తున్నట్టు, వెనుక ఇంకా చాలామంది నాగరికులు వున్నట్టూ వున్న బొమ్మ క్రింద వ్యాఖ్య--
"ఇడియట్! ఇంతమంది ఉండగా నీవే తీసి అందించాలా? ఏ"
---------------------------------------------------------------------------------
12వ తేదీన కలకత్తా ఆంధ్రా అసోసియేషను తన పదనొకండవ వార్షికోత్సవము జరిపింది. ఆంధ్రులేకాక, తక్కిన రాష్ట్రాల వాళ్ళు కూడావచ్చి సమావేశాన్ని జయప్రదంగా జరిగించేరు. అధ్యక్షులు శ్రీ డి.యస్. నాయుడుగారు, కార్యదర్శులు శ్రీ ప్రకాశరావు, గోపాలరావుగార్లు ప్రశంసనీయులు. కార్యక్రమం పాటలు, పద్యాలతో చక్కగా నడిచింది.
యిక్కడి మిణ్ట్ (ఇంగ్లీషు) లోని ఉద్యోగులు కొందరు పాకిస్థాను వెళ్ళుటకు కోరుతున్నారు. అందుమీదట వీళ్ళను యిండియా సర్కారు వారు విడుదలచేసేరు. యింతలో పాకిస్థాను నుండి ఉత్తర్వువచ్చింది, అక్కడ వీళ్ళకు తావులేదని. వీళ్ళ అవస్థ త్రిశంకు స్వర్గంగానే వుంది.
ఆర్టిస్ ట్రీ హౌస్ (ఇంగ్లీషు) లో పి(ల్లల పుస్త)కాల యెగ్జిబిషను యేర్పాటు చేసే(రు). ఫ్రెంచి, యింగ్లీషు, బెంగాలీ పుస్తకాలు చాల చక్కగా అమర్చేరు. మన తెలుగు పుస్తకా(లు) యెన్నో రాలేదు. ఎందువల్లనో. ఉన్నవా(టిలో) దీక్షితులుగారి అనువాదం "మన యి(తిహాసాలు) వొక్కటే చెప్పుకోతగ్గది.
--------------------------------------------------------------------------------ప్రాచీన పుస్తకం ఒకమూల చెదలు కొట్టెయ్యడంవల్ల అక్కడ అక్షరాలు మాయం అయిపోయాయి. సందర్భాన్నిబట్టి అక్కడ వుండాలని ఊహించి నేను రాసిన అక్షరాలని బ్రాకెట్లలొ చూపించాను.
--క్రిష్ణశ్రీ
----------------------------------------------------------------------------------
అస్సాము, బీహార్లలో బె(oగాలీల) వ్యతిరేక ప్రచారం చురుకుగా జ(రుగుతోంది) ముఖ్యంగా డార్జీలింగులో బెంగాళీలను చాల అవమానం చేస్తున్నారు. ఆమధ్య ఒరిస్సాలో కూడా యాత్రకువెళ్ళిన బెంగాళీలను బాధలు పెట్టగా, యిక్కడ కలకత్తాలోని ఒరియాల మీద దెబ్బతీసేరు. అంతటితో హరికృష్ణ మెహతాబుగారు యిక్కడకు రాజీకి రావడం జరిగింది. యీ వ్యతిరేక ఆందోళన ఫలితంగా బెంగాలులో కూడ యువకులు "బెంగాల్ ఫర్ బెంగాలీస్" (ఇంగ్లీషు) అని ఆరంభించేరు. ఒరిస్సాలో బెంగాలీల మీదనే కాకుండా ఆంధ్రుల మీదకూడ దాడి చేస్తున్నారట. "ఆంధ్రులను సముద్రంలో త్రోసెయ్యండని" పదాలు, పాటలూ పడుతున్నారని అక్కడ నుండివచ్చిన మిత్రులు చెప్పేరు. హరికృష్ణ మెహతాబుగారుకూడ యీధోరణిలోనే మాట్లాడుతూ, ఆంధ్రులను బెదిరిస్తున్నారట. మన తెనుగుమంత్రులు ఏమి చేస్తున్నట్టు? స్వరాష్ట్రం లేని దోషమిది. తీర్మానాలు ఉపాదించడంలో ఉండే తృష్ణ వాటిని అమలులో పెట్టడంలో ఉంటే మనమెప్పుడో బాగుపడి ఉండేవాళ్ళము.
(పూర్తయింది)
Thursday, August 16
Diamond jubilee of Indian Independance
But, no one cared to suggest improvements!
No doubt, democracy is flourishing in India. The parliament and the State assemblies are conducting sessions regularly, discussing important matters, and legislating. But to one, who is looking at the sessions, in live electronic media, they are a pathetic sight. What with the shouting and fighting; breaking of the mikes; government representatives trying to silence the opposition; opposition not heeding the speaker; suspending of the entire opposition out of the house; marshals snatching away the members…….so on and so on!
WHY DON’T WE REVISE THE PROCEDURES ADOPTED IN THE HOUSES?
Usually the day starts in the house with ‘Question Hour’ as per the age old prevailing practice. As the questions raised by the members to the Government were considered to be of great importance to the public, the question hour was regarded as the most important part of the proceedings and hence the priority.
The public were thrilled to read about the questions and the answers in the print media the next day and discussed how their representatives were extracting information from the Government and how at times the Government was facing critical situations. The best example of the relevance of the question hour was portrayed in one of the Novels of famous writer Jeffery Archer.
As this was the case, when some things considered important by the opposition, demanding immediate attention of the house, they used to place ‘adjournment motions’ in the house. Meaning, the Question hour has to be adjourned to enable immediate discussion on the matters raised in the adjournment motion. At times, the speaker, basing on the urgency of the matter, allowed the motions, adjourning the question hour! The public felt proud that their representatives were taking up the matters of public interest in right earnest.
But now, the question hour has become irrelevant. The audience do not know what are the questions asked, who asked the question etc. Simply the speaker reads out the question number and asks the concerned Minister about his answer. The Minister or his representative answer in mono-syllables like ‘for point a) the answer is ‘No Sir’, for b) ‘Not true Sir’, for c) ‘the question does not arise Sir’. What the members of the house or the Government or the watching public gain from such sessions is only known to God. More over, after the Right to Information Act (though it is not being utilized to the fullest extant) there is no need for the Question Hour!
Recently, it has become a habit for all the political parties in the house to shower adjournment motions on the speaker, some times with ridiculous matters such as ‘a person has publicly scolded our leader and there as to be urgent discussion in the house’! So also it has become customary for the speaker to declare that all the adjournment motions are ‘declined’, thereby lessening the importance of the really urgent matters. At times, it seems to the public that some speakers are aiding the Government in postponing discussions and to face the opposition on urgent public matters.
When the house is in sessions, every day one can see the routine: Speaker calling the house to order, declaring that all the adjournment motions are declined, calling for answer to the days 1st question, the opposition raising cries about their adjournment motions or some allegations against the Government, Speaker not allowing the members to speak and asking to proceed with the question hour, the members moving to the well of the house, leader of the house moving a motion for suspension of the opposition members, the motion declared as ‘carried out’ by the Speaker, the suspended members refusing to go away, the marshals lifting them and practically throwing them out, agitation by the other members and the house declared as ‘adjourned’. What a waste of public money!
Why not, for a change, start the session by placing before the house by the Speaker himself, the important Public issues, raised by the print media the previous day? And asking the Government to react and tell the public the facts?
Just Think of it!
"I'm a citizen of the World"
Tuesday, August 7
We are Happy!
అసలు రిటైర్మెంటు ముందైనా సొంత ఇంటికి చేరాలనీ, ప్రశాంతంగా రిటైరు అవ్వాలని ఎవరికి వుండదు?
కాని దానిక్కూడా అడ్డు పడేవాళ్ళు, చెడగొట్టాలని చూసేవాళ్ళు వుంటారంటే నమ్ముతారా?
అయినా వాటన్నింటినీ అధిగమించి, అడ్డంకులు తొలగించుకుని, అనుకున్నది సాధించేమంటే--ఆనందం కాదూ!
అవునంటారా, కాదంటారా?
Visit : http://groups.google.com/group/narasapurians
Mail to : narasapurians@googlegroups.com